PM Modi On Pahalgam Terror Attack : జమ్ముకశ్మీర్, పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దారుణమైన చర్య వెనుక ఉన్న వారిని ఎవర్నీ వదిలిపెట్టమని, వారిని చట్టం ముందు నిలబెడతామని అన్నారు.
I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected.
— Narendra Modi (@narendramodi) April 22, 2025
Those behind this heinous act will be brought…
"పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులు ఎవ్వరినీ విడిచిపెట్టం. వారి దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయంవంతం కాదు. ఉగ్రవాదం పోరాడాలనే మా సంకల్పం చాలా దృఢమైనది. ఇది ఇప్పుడు మరింత బలపడుతుంది."
- మోదీ ట్వీట్
ఉగ్రదాడిలో తమ బంధు, మిత్రులను కోల్పోయినవారికి ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలిపారు. 'గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత సాయం అందిస్తాం' అని మోదీ అన్నారు.
అమిత్షాతో ఫోన్లో మాట్లాడిన మోదీ
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనాస్థలాన్ని సందర్శించాలని అమిత్షాకు సూచించారు. దీంతో ఆయన శ్రీనగర్కు పయనమయ్యారు. భద్రతా సంస్థలతో సమావేశమై శాంతిభద్రతలను సమీక్షించనున్నారు.
On Pahalgam terror attack on tourists, Union Home Minister Amit Shah says, " briefed pm modi about the incident and held a meeting with the concerned officials via video conferencing. will shortly leave for srinagar to hold an urgent security review meeting with all the agencies." pic.twitter.com/OXqefdKZaF
— ANI (@ANI) April 22, 2025
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రాంబన్ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని శ్రీనగర్కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రదాడిని జమ్ముకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
పర్యటకులపై ఉగ్రదాడి
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. పర్యాటక కేంద్రం పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పర్యాటకులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతాదళాలు భావిస్తున్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్ర కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇది కూడా ఉగ్రదాడికి కారణం కావచ్చని భావిస్తున్నారు. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.