ETV Bharat / bharat

'సుప్రీంకోర్టు రాష్ట్రపతిని ఆదేశించగలదా?- జడ్జీలు సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారా?' - VP DHANKHAR SLAMS JUDICIARY

జడ్జీలు సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారా?- జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుందనుకోలేదు: ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ తీవ్ర వ్యాఖ్యలు

VP Dhankhar
VP Dhankhar (ANI & IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : April 18, 2025 at 8:07 AM IST

4 Min Read

VP Dhankhar Slams Judiciary : భారత రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్ అన్నారు. ఫలానా సమయంలోగా రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎలా ఆదేశిస్తుంది? జడ్జీలు సూపర్​ పార్లమెంట్​లా వ్యవహరిస్తారా? అని ధన్​ఖడ్​ మండిపడ్డారు.

రాష్ట్ర గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి ధన్​ఖడ్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాజ్యసభ ఆరో బ్యాచ్‌ శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన " న్యాయవ్యవస్థ రాష్ట్రపతికి గడువు నిర్దేశించడం ఏమిటి? ప్రజాస్వామ్య శక్తులపై అణు క్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించకూడదు. కానీ నేడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! వారే కార్యనిర్వాహక విధులు కూడా నిర్వర్తించేస్తున్నారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తున్నారు. కానీ వాళ్లకు మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే మన దేశ చట్టాలు వారికి ఏమాత్రం వర్తించవు" అని మండిపడ్డారు.

అది నన్నెంతో కలవరపెడుతోంది!

"రాజ్యాంగంలోని 142వ అధికరణం సుప్రీంకోర్టు ప్లీనరీ (సంపూర్ణ) అధికారాలను ఇచ్చింది. తన ముందుకు వచ్చిన ఏ అంశంలోనైనా పూర్తి న్యాయం జరిగేలా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చు.​ ఇది 24x7 అందుబాటులో ఉండే అణుక్షిపణి లాంటిది. ఇటీవల ఒక తీర్పులో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు రాష్ట్రపతికే ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి మనం ఎటు పోతున్నాం? అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఇలాంటి ఒక రోజు కోసం మనం ప్రజాస్వామ్యాన్ని కోరుకోలేదు. భారత రాష్ట్రపతి ఒక నిర్ణీత కాలవ్యవధిలోగా నిర్ణయాలు తీసుకోవాలట, లేదంటే అది చట్టం అయిపోతుందట. ఈ తీర్పు నాకెంతో కలవరం కలిగిస్తోంది. ఇలాంటిదొకటి నా జీవితంలో చూడాల్సిన రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. రాష్ట్రపతి పదవి అనేది అత్యంత ఉన్నతమైనది. మన భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు. ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఎంపీలు, న్యాయమూర్తులు సహా అంతా మన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాంటిది న్యాయవ్యవస్థ రాష్ట్రపతికి ఆదేశాలిచ్చే పరిస్థితి రావడం ఏమిటి? దానికి గల ప్రాతిపదిక ఏమిటి? ఆర్టికల్​ 145(3) కింద రాజ్యాంగానికి భాష్యం చెప్పే హక్కు మాత్రమే న్యాయవ్యవస్థకు ఉంది. ఒకవేళ అధికారాల విభజన ప్రకారం చూసినా, ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కనుక ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుంది. పార్లమెంటులో వారు తమ ప్రతినిధుల ద్వారా ప్రశ్నలు వేయవచ్చు. అంతేకానీ కార్యనిర్వాహక పాలనను న్యాయ వ్యవస్థకు ఇస్తే ప్రజలు ప్రశ్నలు ఎలా వేస్తారు? ఎన్నికల్లో ఎవరిని జవాబుదారీని చేస్తారు? శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలో ఒకటి చొరబడితే అది పెద్ద సవాల్‌గా మారుతుంది. అది ఏమాత్రం మంచిది కాదు."
- జగదీప్​ ధన్​ఖడ్​, భారత ఉపరాష్ట్రపతి

ఆ జడ్జ్​పై కేసు లేదేం?
ఓ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో కాలిన నోట్లకట్టలు కనిపిస్తే, దానిపై కేసు వేయలేదు ఎందుకు? ఇలాంటిదే ఓ సామాన్యుడి ఇంట్లో జరిగితే రాకెట్‌ వేగంతో స్పందిస్తారు కదా! కానీ ఈ కేసులో కనీసం ఎడ్లబండి అంతటి వేగమైనా లేదు ఎందుకని? శిక్షార్హమైన ప్రతి నేరాన్నీ పోలీసులకు తెలపాలని చట్టం నిర్దేశిస్తోంది. ఒక వేళ అలా చేయకపోతే అది నేరం అవుతుంది. అయినా ఆ జడ్జి నోట్ల కట్టల విషయంలో ఎఫ్‌ఐఆర్‌ లేకపోవడం ఆశ్చర్యకరం. రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉండే నాతో సహా ఎవరిపైనైనా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవచ్చు. ఎందుకంటే చట్టాన్ని అమలు చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఒకవేళ అవతలివారు న్యాయమూర్తులతై ఎఫ్‌ఐఆర్‌ను నేరుగా నమోదు చేయకుండా, న్యాయవ్యవస్థలోని సంబంధిత వర్గాల ఆమోదం పొందాలి.

మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే న్యాయ విచారణ నుంచి మినహాయింపు ఉంది. "చట్టానికి అతీతంగా ఉండే కేటగిరీ"కి న్యూ విచారణ నుంచి రక్షణ ఉందా? న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే విచారణ, దర్యాప్తు నుంచి దుర్భేద్యమైన రక్షణ ఉండడం కాదు కదా! విచారణలే లేకుండా చేస్తే ఎలాంటి వ్యవస్థ అయినా భ్రష్టుపట్టడం ఖాయం. కేవలం ముగ్గురు న్యాయమూర్తులతో జరుపుతున్న అంతర్గత విచారణ చట్టం ముందు ఎంత వరకు నిలుస్తుంది? అసలు దానికి చట్టబద్ధతే ఉండదు. వాస్తవానికి ఆ కమిటీ ఏం చేయగలదు? మహా అయితే ఒక సిఫార్సు మాత్రమే చేస్తుంది. అదైనా ఎవరికి, ఏమని చేస్తుంది? ఈ జడ్జి కేసు దేశ ప్రజలందరినీ కలవరపెడుతోంది. నిజానికి దర్యాప్తు జరపాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థే గానీ న్యాయవ్యవస్థ కాదు కదా!. మనకున్న వ్యవస్థ ప్రకారం న్యాయమూర్తులపై చర్య తీసుకునే తుది అధికారం పార్లమెంటుదే. ఇంటిలో చెదలు పడితే వాటిని తొలగించాలి. తలుపులు తెరిచి పంపించాలి. కానీ ఇప్పుడు కప్‌బోర్డులు కుప్పకూలే పరిస్థితి వచ్చింది. కనుక ఆ పురుగుల్ని, వాటి అవశేషాల్ని ప్రజల్లో పెడితే పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. నిజానికి ఆ ఘటన జరిగిన వారం వరకు దాని గురించే ఎవరికీ తెలియదు. దీనిపై మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈ జాప్యం చాలా సందేహాలు లేవనెత్తదా? ప్రజలు అత్యంత గౌరవమిచ్చే న్యాయ వ్యవస్థే బోనులో నిలబడింది. న్యాయవ్యవస్థ స్వచ్ఛత మన ప్రజాస్వామ్య గమనాన్ని నిర్వచిస్తుంది" అని ధన్‌ఖడ్‌ అన్నారు.

వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను నియమించొద్దు: సుప్రీంకోర్టు

డ్రైవర్ల పనిగంటలపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

VP Dhankhar Slams Judiciary : భారత రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్ అన్నారు. ఫలానా సమయంలోగా రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎలా ఆదేశిస్తుంది? జడ్జీలు సూపర్​ పార్లమెంట్​లా వ్యవహరిస్తారా? అని ధన్​ఖడ్​ మండిపడ్డారు.

రాష్ట్ర గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి ధన్​ఖడ్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాజ్యసభ ఆరో బ్యాచ్‌ శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన " న్యాయవ్యవస్థ రాష్ట్రపతికి గడువు నిర్దేశించడం ఏమిటి? ప్రజాస్వామ్య శక్తులపై అణు క్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించకూడదు. కానీ నేడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! వారే కార్యనిర్వాహక విధులు కూడా నిర్వర్తించేస్తున్నారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తున్నారు. కానీ వాళ్లకు మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే మన దేశ చట్టాలు వారికి ఏమాత్రం వర్తించవు" అని మండిపడ్డారు.

అది నన్నెంతో కలవరపెడుతోంది!

"రాజ్యాంగంలోని 142వ అధికరణం సుప్రీంకోర్టు ప్లీనరీ (సంపూర్ణ) అధికారాలను ఇచ్చింది. తన ముందుకు వచ్చిన ఏ అంశంలోనైనా పూర్తి న్యాయం జరిగేలా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చు.​ ఇది 24x7 అందుబాటులో ఉండే అణుక్షిపణి లాంటిది. ఇటీవల ఒక తీర్పులో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు రాష్ట్రపతికే ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి మనం ఎటు పోతున్నాం? అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఇలాంటి ఒక రోజు కోసం మనం ప్రజాస్వామ్యాన్ని కోరుకోలేదు. భారత రాష్ట్రపతి ఒక నిర్ణీత కాలవ్యవధిలోగా నిర్ణయాలు తీసుకోవాలట, లేదంటే అది చట్టం అయిపోతుందట. ఈ తీర్పు నాకెంతో కలవరం కలిగిస్తోంది. ఇలాంటిదొకటి నా జీవితంలో చూడాల్సిన రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. రాష్ట్రపతి పదవి అనేది అత్యంత ఉన్నతమైనది. మన భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు. ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఎంపీలు, న్యాయమూర్తులు సహా అంతా మన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాంటిది న్యాయవ్యవస్థ రాష్ట్రపతికి ఆదేశాలిచ్చే పరిస్థితి రావడం ఏమిటి? దానికి గల ప్రాతిపదిక ఏమిటి? ఆర్టికల్​ 145(3) కింద రాజ్యాంగానికి భాష్యం చెప్పే హక్కు మాత్రమే న్యాయవ్యవస్థకు ఉంది. ఒకవేళ అధికారాల విభజన ప్రకారం చూసినా, ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కనుక ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుంది. పార్లమెంటులో వారు తమ ప్రతినిధుల ద్వారా ప్రశ్నలు వేయవచ్చు. అంతేకానీ కార్యనిర్వాహక పాలనను న్యాయ వ్యవస్థకు ఇస్తే ప్రజలు ప్రశ్నలు ఎలా వేస్తారు? ఎన్నికల్లో ఎవరిని జవాబుదారీని చేస్తారు? శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలో ఒకటి చొరబడితే అది పెద్ద సవాల్‌గా మారుతుంది. అది ఏమాత్రం మంచిది కాదు."
- జగదీప్​ ధన్​ఖడ్​, భారత ఉపరాష్ట్రపతి

ఆ జడ్జ్​పై కేసు లేదేం?
ఓ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో కాలిన నోట్లకట్టలు కనిపిస్తే, దానిపై కేసు వేయలేదు ఎందుకు? ఇలాంటిదే ఓ సామాన్యుడి ఇంట్లో జరిగితే రాకెట్‌ వేగంతో స్పందిస్తారు కదా! కానీ ఈ కేసులో కనీసం ఎడ్లబండి అంతటి వేగమైనా లేదు ఎందుకని? శిక్షార్హమైన ప్రతి నేరాన్నీ పోలీసులకు తెలపాలని చట్టం నిర్దేశిస్తోంది. ఒక వేళ అలా చేయకపోతే అది నేరం అవుతుంది. అయినా ఆ జడ్జి నోట్ల కట్టల విషయంలో ఎఫ్‌ఐఆర్‌ లేకపోవడం ఆశ్చర్యకరం. రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉండే నాతో సహా ఎవరిపైనైనా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవచ్చు. ఎందుకంటే చట్టాన్ని అమలు చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఒకవేళ అవతలివారు న్యాయమూర్తులతై ఎఫ్‌ఐఆర్‌ను నేరుగా నమోదు చేయకుండా, న్యాయవ్యవస్థలోని సంబంధిత వర్గాల ఆమోదం పొందాలి.

మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే న్యాయ విచారణ నుంచి మినహాయింపు ఉంది. "చట్టానికి అతీతంగా ఉండే కేటగిరీ"కి న్యూ విచారణ నుంచి రక్షణ ఉందా? న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే విచారణ, దర్యాప్తు నుంచి దుర్భేద్యమైన రక్షణ ఉండడం కాదు కదా! విచారణలే లేకుండా చేస్తే ఎలాంటి వ్యవస్థ అయినా భ్రష్టుపట్టడం ఖాయం. కేవలం ముగ్గురు న్యాయమూర్తులతో జరుపుతున్న అంతర్గత విచారణ చట్టం ముందు ఎంత వరకు నిలుస్తుంది? అసలు దానికి చట్టబద్ధతే ఉండదు. వాస్తవానికి ఆ కమిటీ ఏం చేయగలదు? మహా అయితే ఒక సిఫార్సు మాత్రమే చేస్తుంది. అదైనా ఎవరికి, ఏమని చేస్తుంది? ఈ జడ్జి కేసు దేశ ప్రజలందరినీ కలవరపెడుతోంది. నిజానికి దర్యాప్తు జరపాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థే గానీ న్యాయవ్యవస్థ కాదు కదా!. మనకున్న వ్యవస్థ ప్రకారం న్యాయమూర్తులపై చర్య తీసుకునే తుది అధికారం పార్లమెంటుదే. ఇంటిలో చెదలు పడితే వాటిని తొలగించాలి. తలుపులు తెరిచి పంపించాలి. కానీ ఇప్పుడు కప్‌బోర్డులు కుప్పకూలే పరిస్థితి వచ్చింది. కనుక ఆ పురుగుల్ని, వాటి అవశేషాల్ని ప్రజల్లో పెడితే పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. నిజానికి ఆ ఘటన జరిగిన వారం వరకు దాని గురించే ఎవరికీ తెలియదు. దీనిపై మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈ జాప్యం చాలా సందేహాలు లేవనెత్తదా? ప్రజలు అత్యంత గౌరవమిచ్చే న్యాయ వ్యవస్థే బోనులో నిలబడింది. న్యాయవ్యవస్థ స్వచ్ఛత మన ప్రజాస్వామ్య గమనాన్ని నిర్వచిస్తుంది" అని ధన్‌ఖడ్‌ అన్నారు.

వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను నియమించొద్దు: సుప్రీంకోర్టు

డ్రైవర్ల పనిగంటలపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.