ETV Bharat / bharat

మణిపుర్​లో కాల్పులు- 10మంది మిలిటెంట్లు హతం - SEVERAL MILITANTS KILLED IN MANIPUR

మణిపుర్​లో కాల్పుల కలకలం - భద్రతా దళాల ఆపరేషన్​లో 10మంది మిలిటెంట్లు హతం

Several Militants Killed In Manipur
Representational Image (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2025 at 7:22 AM IST

Updated : May 15, 2025 at 8:24 AM IST

2 Min Read

Several Militants Killed In Manipur : మణిపుర్‌లో మరోసారి కాల్పుపు కలకలం రేపాయి. చందేల్‌ జిల్లాలో బుధవారం రాత్రి అసోం రైఫిల్స్‌ జరిపిన ఆపరేషన్‌లో కనీసం 10మంది మిలిటెంట్లు మరణించారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.

ఇండో-మయన్మార్‌ సరిహద్దు చందేల్‌ జిల్లా ఖెంగ్‌జోయ్‌ తహసీల్, న్యూ సమతాల్‌ గ్రామం సమీపంలో మిలిటెంట్ల కదలికలపై సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 10మంది మిలిటెంట్లు మృతిచెందినట్లు వెల్లడించారు. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్మీ ఈస్టర్న్ కమాండ్​ ఎక్స్​లో పోస్టు చేసింది.

మా పండుగకు మీరు రావొద్దు!
ఇదిలా ఉండగా, మణిపుర్​లోని ఉఖ్రుల్​ జిల్లాలో వచ్చే వారం నుంచి ఐదు రోజుల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా కుకీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి మైతేయిలు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ఏదైనా ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా పరిగణిస్తామని చెప్పారు. ఆ తర్వాత జరగే పరిణామాలకు వ్యుక్తులే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ మేరకు కుకీ జో విలేజ్ వలంటీర్ ఈస్టర్న్ జోన్ ఓ ప్రకటన జారీ చేసింది.

ఉఖ్రుల్​లో జరిగే శిరుయ్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మెయితైలు ఎక్కువగా ఉన్న ఇంఫాల్ నుంచి ఉఖ్రుల్‌కు వెళ్లే మార్గంలో- కుకీలు ఎక్కువగా ఉన్న కొన్ని గ్రామాల గుండా వెళ్లాలి. కాగా, ఉఖ్రుల్​లో నాగా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు.

అయితే ఈ హెచ్చరికను తంగ్ఖుల్​ నాగ సామాజిక కార్యకర్త అసంగ్ కాషర్ ఖండించారు. ఇది మణిపుర్‌లోని ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగా ఒక సవాలు అని, దీనివల్ల వారు (కుకీలు) శాంతికి వ్యతిరేకంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు.

మరోవైపు, మణిపుర్​లో జాతుల మధ్య వైరం కొనసాగుతోంది. మే 2023 నుంచి జరిగిన జాతి ఘర్షణల వల్ల దాదాపు 260మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

మణిపుర్​లో తోటి సైనికులపై CRPF​ జవాన్​ కాల్పులు- ముగ్గురు మృతి

ఆపరేషన్​ సిందూర్​ను రాజకీయం చేస్తున్న బీజేపీ- సమాధానాల కోసం జైహింద్ ర్యాలీలు : కాంగ్రెస్​

Several Militants Killed In Manipur : మణిపుర్‌లో మరోసారి కాల్పుపు కలకలం రేపాయి. చందేల్‌ జిల్లాలో బుధవారం రాత్రి అసోం రైఫిల్స్‌ జరిపిన ఆపరేషన్‌లో కనీసం 10మంది మిలిటెంట్లు మరణించారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.

ఇండో-మయన్మార్‌ సరిహద్దు చందేల్‌ జిల్లా ఖెంగ్‌జోయ్‌ తహసీల్, న్యూ సమతాల్‌ గ్రామం సమీపంలో మిలిటెంట్ల కదలికలపై సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 10మంది మిలిటెంట్లు మృతిచెందినట్లు వెల్లడించారు. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్మీ ఈస్టర్న్ కమాండ్​ ఎక్స్​లో పోస్టు చేసింది.

మా పండుగకు మీరు రావొద్దు!
ఇదిలా ఉండగా, మణిపుర్​లోని ఉఖ్రుల్​ జిల్లాలో వచ్చే వారం నుంచి ఐదు రోజుల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా కుకీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి మైతేయిలు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ఏదైనా ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా పరిగణిస్తామని చెప్పారు. ఆ తర్వాత జరగే పరిణామాలకు వ్యుక్తులే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ మేరకు కుకీ జో విలేజ్ వలంటీర్ ఈస్టర్న్ జోన్ ఓ ప్రకటన జారీ చేసింది.

ఉఖ్రుల్​లో జరిగే శిరుయ్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మెయితైలు ఎక్కువగా ఉన్న ఇంఫాల్ నుంచి ఉఖ్రుల్‌కు వెళ్లే మార్గంలో- కుకీలు ఎక్కువగా ఉన్న కొన్ని గ్రామాల గుండా వెళ్లాలి. కాగా, ఉఖ్రుల్​లో నాగా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు.

అయితే ఈ హెచ్చరికను తంగ్ఖుల్​ నాగ సామాజిక కార్యకర్త అసంగ్ కాషర్ ఖండించారు. ఇది మణిపుర్‌లోని ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగా ఒక సవాలు అని, దీనివల్ల వారు (కుకీలు) శాంతికి వ్యతిరేకంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు.

మరోవైపు, మణిపుర్​లో జాతుల మధ్య వైరం కొనసాగుతోంది. మే 2023 నుంచి జరిగిన జాతి ఘర్షణల వల్ల దాదాపు 260మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

మణిపుర్​లో తోటి సైనికులపై CRPF​ జవాన్​ కాల్పులు- ముగ్గురు మృతి

ఆపరేషన్​ సిందూర్​ను రాజకీయం చేస్తున్న బీజేపీ- సమాధానాల కోసం జైహింద్ ర్యాలీలు : కాంగ్రెస్​

Last Updated : May 15, 2025 at 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.