ETV Bharat / bharat

కార్చిచ్చుతో క్లౌడ్ బరస్ట్‌కు లింక్! మంటల వల్ల మేఘాలు యాక్టివేట్​ అవ్వడం వల్లేనా? - CLOUD BURST STORY

అటవీ కార్చిచ్చుకు క్లౌడ్ బరస్ట్‌తో లింక్- అడవుల్లోని మంటల ధాటికి మేఘాల సంగ్రహణ కేంద్రకాలు యాక్టివేట్- పెద్ద మొత్తంలో నీటి ఆవిరి ఘనీభవించి భారీ మేఘాల ఆవిర్భావం

Forest Fire And Cloud Burst Connection
Forest Fire And Cloud Burst Connection (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 17, 2025 at 7:57 PM IST

3 Min Read

Forest Fire And Cloud Burst Connection : 'క్లౌడ్ బరస్ట్' అంటే మేఘాల విస్ఫోటం. 'ఫారెస్ట్ ఫైర్' అంటే అడవులను కాల్చేసే కార్చిచ్చు. ఇవి రెండూ వేర్వేరు ప్రకృతి వైపరీత్యాలు అని మనం భావిస్తూ వచ్చాం. హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఉన్న హేమవతి నందన్ బహుగుణ గర్హ్వాల్ విశ్వవిద్యాలయం, ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో అనూహ్య విషయం వెలుగులోకి వచ్చింది. అడవుల్లో రాచుకునే మంటలకు, మేఘాల విస్ఫోటనానికి మధ్య లోతైన సంబంధం ఉందని వారు గుర్తించారు.

ఏడాది పొడవునా కార్చిచ్చులు, క్లౌడ్ బరస్ట్‌లు
ఉత్తరాఖండ్‌ హిమాలయ రాష్ట్రం. అందుకే దీనికి క్లౌడ్ బరస్ట్‌లు, కుండపోత వర్షాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. హిమాలయాలకు నెలవైన ఈ కూల్ కూల్ రాష్ట్రంలో ఏడాదికేడాది అటవీ కార్చిచ్చు ఘటనలు పెరుగుతూపోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక ఇదే సమయంలో క్లౌడ్ బరస్ట్‌ ఘటనలు ఏడాది పొడవునా అన్ని నెలల్లో సంభవిస్తున్నాయి. ఇంతకుముందు వర్షాకాలంలోనే మేఘాల విస్ఫోటం సంభవించేది.

ఓ వైపు అటవీ కార్చిచ్చులు, మరోవైపు క్లౌడ్ బరస్ట్‌లు సీజన్‌లతో సంబంధం లేకుండా కలకలం రేపుతుండటంపై హేమవతి నందన్ బహుగుణ గర్హ్వాల్ వర్సిటీ, ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల టీమ్ ప్రత్యేక రీసెర్చ్ చేసింది. అడవుల్లో రాచుకుంటున్న మంటలకు, క్లౌడ్ బరస్ట్‌ ఘటనలతో సంబంధం ఉందని వారు గుర్తించారు. అడవులు కాలడం వల్ల వెలువడే వాయువులు, మంటలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. ప్రత్యేకించి వాయు కాలుష్యానికి కారణమవుతాయి. ఆ మంటల్లో ఎన్నో వన్యప్రాణులు చనిపోతాయి. అయితే అసలు నష్టం ఇంతకు మించిన స్థాయిలో జరుగుతోందని పరిశోధకులు చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో రాచుకుంటున్న మంటలకు నేరుగా మేఘాల విస్ఫోటనంతో సంబంధం ఉందని వెల్లడించారు.

మేఘాల సంగ్రహణ కేంద్రకాలు అంటే?
''వాతావరణంలో ఎన్నో సూక్ష్మ కణాలు ఉంటాయి. వీటిపై ఏర్పడే నీటి ఆవిరి ఘనీభవించి మేఘాలను ఏర్పరుస్తుంది. అందుకే ఆ కణాలను మేఘాల సంగ్రహణ కేంద్రకాలు అని పిలుస్తారు'' అని ఈ అధ్యయనంలో పాల్గొన్న భూగర్భ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎస్పీ సతి తెలిపారు.

అడవులు కాలుతుంటే అలుముకున్న కొత్త మేఘాలు
అడవులు కాలినప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మోతాదు, వాతావరణంలో వ్యాపించి ఉండే మేఘాల సంగ్రహణ కేంద్రకాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా అటవీ కార్చిచ్చులు రాచుకున్న ప్రాంతాల్లోని మేఘాల సంగ్రహణ కేంద్రకాల కార్యకలాపాలను వారు నిశితంగా పరిశీలించారు. అడవులు కాలుతున్న సమయంలో వాతావరణంలోని మేఘాల సంగ్రహణ కేంద్రకాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి? మేఘాలు ఏర్పడే స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. అడవులు కాలినప్పుడు ఉత్పన్నమయ్యే వేడి, కార్బన్ డయాక్సైడ్ కారణంగా వాతావరణంలోని మేఘాల సంగ్రహణ కేంద్రకాలపై నీటి ఆవిరి ఏర్పడి ఘనీభవిస్తోంది. మంటల తీవ్రతను బట్టి- ఘనీభవించే నీటి ఆవిరి మోతాదు పెరుగుతోంది. ఘనీభవించే నీటి ఆవిరి మోతాదును బట్టి- వివిధ సైజుల్లో మేఘాలు ఏర్పడుతున్నాయి. చివరకు ఆ మేఘాలే విస్ఫోటం (క్లౌడ్ బరస్ట్) చెందుతున్నాయని సైంటిస్టులు గుర్తించారు.

కార్చిచ్చు ఘటనలు పెరిగితే క్లౌడ్ బరస్ట్‌లూ పెరుగుతాయి : జై సింగ్ రావత్, రచయిత
ఈ అధ్యయనాన్ని నేరుగా పరిశీలించిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత జై సింగ్ రావత్ మాట్లాడారు. ''అడవుల్లో రాచుకునే మంటల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడే క్లౌడ్ బరస్ట్ ఘటనలకు కారణమవుతోంది. ఉత్తరాఖండ్‌లో అటవీ కార్చిచ్చు ఘటనలు ఎంతగా పెరుగుతాయో, క్లౌడ్ బరస్ట్ ఘటనలూ అంతమేర పెరిగే ముప్పు ఉంది'' అని చెప్పారు.

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ ఘటనలివీ

  • 2019లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 23 క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగాయి. వీటిలో 19 మంది మరణించారు.
  • 2020లో 14 చోట్ల క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగాయి. ఐదుగురు మరణించారు.
  • 2021లో 9 జిల్లాల్లో 26 చోట్ల మేఘాల విస్ఫోటనం జరిగింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2022లో 31 క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగాయి.
  • 2023లో క్లౌడ్ బరస్ట్ ఘటనల వల్ల దాదాపు 15 మరణించారు.
  • 2024లో క్లౌడ్ బరస్ట్ ఘటనల్లో దాదాపు 12 చోట్ల అతి తీవ్ర వర్షాలు కురిశాయి.

ఉత్తరాఖండ్‌లో అటవీ కార్చిచ్చు ఘటనలివీ

  • ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఏడాది (2025లో) ఇప్పటివరకు 65 అటవీ అగ్నిప్రమాదాలు జరిగాయి. దీని వల్ల దాదాపు 60 హెక్టార్ల అడవులు ప్రభావితం అయ్యాయి.
  • 2023లో ఏప్రిల్ నాటికి రాష్ట్రంలోని అడవుల్లో 177 అగ్నిప్రమాదాలు సంభవించాయి.
  • 2024లో ఏప్రిల్ నాటికి రాష్ట్రంలోని అడవుల్లో 356 అగ్ని ప్రమాదాలు జరిగాయి.
  • ఈ గణాంకాలను పోల్చి చూస్తే కాస్త ఊరటగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు అడవుల్లో కార్చిచ్చు రాచుకున్న ఘటనలు చాలా తక్కువ. ఉష్ణోగ్రతలు పెరిగినందు వల్లే ఇలా జరిగి ఉండొచ్చు.

Forest Fire And Cloud Burst Connection : 'క్లౌడ్ బరస్ట్' అంటే మేఘాల విస్ఫోటం. 'ఫారెస్ట్ ఫైర్' అంటే అడవులను కాల్చేసే కార్చిచ్చు. ఇవి రెండూ వేర్వేరు ప్రకృతి వైపరీత్యాలు అని మనం భావిస్తూ వచ్చాం. హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఉన్న హేమవతి నందన్ బహుగుణ గర్హ్వాల్ విశ్వవిద్యాలయం, ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో అనూహ్య విషయం వెలుగులోకి వచ్చింది. అడవుల్లో రాచుకునే మంటలకు, మేఘాల విస్ఫోటనానికి మధ్య లోతైన సంబంధం ఉందని వారు గుర్తించారు.

ఏడాది పొడవునా కార్చిచ్చులు, క్లౌడ్ బరస్ట్‌లు
ఉత్తరాఖండ్‌ హిమాలయ రాష్ట్రం. అందుకే దీనికి క్లౌడ్ బరస్ట్‌లు, కుండపోత వర్షాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. హిమాలయాలకు నెలవైన ఈ కూల్ కూల్ రాష్ట్రంలో ఏడాదికేడాది అటవీ కార్చిచ్చు ఘటనలు పెరుగుతూపోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక ఇదే సమయంలో క్లౌడ్ బరస్ట్‌ ఘటనలు ఏడాది పొడవునా అన్ని నెలల్లో సంభవిస్తున్నాయి. ఇంతకుముందు వర్షాకాలంలోనే మేఘాల విస్ఫోటం సంభవించేది.

ఓ వైపు అటవీ కార్చిచ్చులు, మరోవైపు క్లౌడ్ బరస్ట్‌లు సీజన్‌లతో సంబంధం లేకుండా కలకలం రేపుతుండటంపై హేమవతి నందన్ బహుగుణ గర్హ్వాల్ వర్సిటీ, ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల టీమ్ ప్రత్యేక రీసెర్చ్ చేసింది. అడవుల్లో రాచుకుంటున్న మంటలకు, క్లౌడ్ బరస్ట్‌ ఘటనలతో సంబంధం ఉందని వారు గుర్తించారు. అడవులు కాలడం వల్ల వెలువడే వాయువులు, మంటలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. ప్రత్యేకించి వాయు కాలుష్యానికి కారణమవుతాయి. ఆ మంటల్లో ఎన్నో వన్యప్రాణులు చనిపోతాయి. అయితే అసలు నష్టం ఇంతకు మించిన స్థాయిలో జరుగుతోందని పరిశోధకులు చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో రాచుకుంటున్న మంటలకు నేరుగా మేఘాల విస్ఫోటనంతో సంబంధం ఉందని వెల్లడించారు.

మేఘాల సంగ్రహణ కేంద్రకాలు అంటే?
''వాతావరణంలో ఎన్నో సూక్ష్మ కణాలు ఉంటాయి. వీటిపై ఏర్పడే నీటి ఆవిరి ఘనీభవించి మేఘాలను ఏర్పరుస్తుంది. అందుకే ఆ కణాలను మేఘాల సంగ్రహణ కేంద్రకాలు అని పిలుస్తారు'' అని ఈ అధ్యయనంలో పాల్గొన్న భూగర్భ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎస్పీ సతి తెలిపారు.

అడవులు కాలుతుంటే అలుముకున్న కొత్త మేఘాలు
అడవులు కాలినప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మోతాదు, వాతావరణంలో వ్యాపించి ఉండే మేఘాల సంగ్రహణ కేంద్రకాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా అటవీ కార్చిచ్చులు రాచుకున్న ప్రాంతాల్లోని మేఘాల సంగ్రహణ కేంద్రకాల కార్యకలాపాలను వారు నిశితంగా పరిశీలించారు. అడవులు కాలుతున్న సమయంలో వాతావరణంలోని మేఘాల సంగ్రహణ కేంద్రకాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి? మేఘాలు ఏర్పడే స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. అడవులు కాలినప్పుడు ఉత్పన్నమయ్యే వేడి, కార్బన్ డయాక్సైడ్ కారణంగా వాతావరణంలోని మేఘాల సంగ్రహణ కేంద్రకాలపై నీటి ఆవిరి ఏర్పడి ఘనీభవిస్తోంది. మంటల తీవ్రతను బట్టి- ఘనీభవించే నీటి ఆవిరి మోతాదు పెరుగుతోంది. ఘనీభవించే నీటి ఆవిరి మోతాదును బట్టి- వివిధ సైజుల్లో మేఘాలు ఏర్పడుతున్నాయి. చివరకు ఆ మేఘాలే విస్ఫోటం (క్లౌడ్ బరస్ట్) చెందుతున్నాయని సైంటిస్టులు గుర్తించారు.

కార్చిచ్చు ఘటనలు పెరిగితే క్లౌడ్ బరస్ట్‌లూ పెరుగుతాయి : జై సింగ్ రావత్, రచయిత
ఈ అధ్యయనాన్ని నేరుగా పరిశీలించిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత జై సింగ్ రావత్ మాట్లాడారు. ''అడవుల్లో రాచుకునే మంటల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడే క్లౌడ్ బరస్ట్ ఘటనలకు కారణమవుతోంది. ఉత్తరాఖండ్‌లో అటవీ కార్చిచ్చు ఘటనలు ఎంతగా పెరుగుతాయో, క్లౌడ్ బరస్ట్ ఘటనలూ అంతమేర పెరిగే ముప్పు ఉంది'' అని చెప్పారు.

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ ఘటనలివీ

  • 2019లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 23 క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగాయి. వీటిలో 19 మంది మరణించారు.
  • 2020లో 14 చోట్ల క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగాయి. ఐదుగురు మరణించారు.
  • 2021లో 9 జిల్లాల్లో 26 చోట్ల మేఘాల విస్ఫోటనం జరిగింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2022లో 31 క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగాయి.
  • 2023లో క్లౌడ్ బరస్ట్ ఘటనల వల్ల దాదాపు 15 మరణించారు.
  • 2024లో క్లౌడ్ బరస్ట్ ఘటనల్లో దాదాపు 12 చోట్ల అతి తీవ్ర వర్షాలు కురిశాయి.

ఉత్తరాఖండ్‌లో అటవీ కార్చిచ్చు ఘటనలివీ

  • ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఏడాది (2025లో) ఇప్పటివరకు 65 అటవీ అగ్నిప్రమాదాలు జరిగాయి. దీని వల్ల దాదాపు 60 హెక్టార్ల అడవులు ప్రభావితం అయ్యాయి.
  • 2023లో ఏప్రిల్ నాటికి రాష్ట్రంలోని అడవుల్లో 177 అగ్నిప్రమాదాలు సంభవించాయి.
  • 2024లో ఏప్రిల్ నాటికి రాష్ట్రంలోని అడవుల్లో 356 అగ్ని ప్రమాదాలు జరిగాయి.
  • ఈ గణాంకాలను పోల్చి చూస్తే కాస్త ఊరటగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు అడవుల్లో కార్చిచ్చు రాచుకున్న ఘటనలు చాలా తక్కువ. ఉష్ణోగ్రతలు పెరిగినందు వల్లే ఇలా జరిగి ఉండొచ్చు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.