Pak Violates Ceasefire : భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ చర్చలు ముగిసిన కొద్దిసేపటికే దాయాది కవ్వింపు చర్యలకు దిగింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ సాంబా సెక్టార్లో పాక్ నుంచి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఆ డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. ప్రస్తుతం సాంబా సెక్టార్లో అధికారులు బ్లాక్ అవుట్ను అమలు చేస్తున్నారు.
#WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Samba.
— ANI (@ANI) May 12, 2025
(Visuals deferred by unspecified time) pic.twitter.com/EyiBfKg6hs
ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్థాన్ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు సైన్యం పేర్కొంది. ప్రస్తుతం డ్రోన్లు ఏమి లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. సాంబా, కతువా, రాజోరి, జమ్ములో బ్లాక్ అవుట్ అమల్లో ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం వైష్ణో దేవి భవన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భవనంతో పాటు, వైష్ణో దేవి వెళ్ళే మార్గంలో కూడా లైట్ల నిలిపివేసినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జమ్ముకశ్మీర్తో పాటు పంజాబ్లో బ్లాక్ అవుట్ చేశారు. దిల్లీ నుంచి అమృత్సర్ విమానాన్ని కూడా దారి మళ్లినట్లు తెలిపారు.