Modi Policies For Next 1000 Years : తమ ప్రభుత్వ విధానాలు రానున్న 1000 సంవత్సరాల భవిష్యత్ను నిర్ణయిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 17వ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 'భారతదేశ సమగ్ర అభివృద్ధి అంటే ఏ గ్రామం, ఏ కుటుంబం, చివరికి ఏ పౌరుడు కూడా వెనుకబడి ఉండకూడదు' అని మోదీ పేర్కొన్నారు.
Delhi | Addressing the 17th Civil Services Day event at the Vigyan Bhawan, PM Modi says, " today, we are in a world that is changing at a fast pace. our bureaucracy and policy-making cannot operate on outdated systems. that is why, since 2014, systemic change has been actively… pic.twitter.com/LMuV66HzAA
— ANI (@ANI) April 21, 2025
"మన బ్యూరోక్రసీ, విధాన రూపకల్పన అవుట్డేటెట్ వ్యవస్థల ఆధారంగా పనిచేయదు. అందుకే ఈ రోజు మా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు రానున్న 1000 సంవత్సరాల భవిష్యత్ను ప్రభావితం చేస్తాయి"
- ప్రధాని నరేంద్ర మోదీ
'భారతదేశంలో యువత, రైతులు, మహిళలు, వారి కలలు, ఆకాంక్షలను నెరవేర్చుడానికి, అసాధారణమైన వేగం చాలా అవసరం' అని మోదీ అన్నారు.
'ప్రభుత్వ పథకాలు ఎంతగా ప్రజలకు అందుతున్నాయో, క్షేత్రస్థాయిలో వాటి నిజమైన ప్రభావం ఎంత ఉందో అన్నదానిని బట్టి, పాలనలో నాణ్యత తెలుస్తుంది. గత పదేళ్లలో భారతదేశం క్రమానుగతంగా పెరుగుతున్న మార్పును దాటి, ప్రభావవంతమైన పరివర్తనను చూసింది. అంతేకాదు భారతదేశ పాలన, పారదర్శకత, ఆవిష్కరణలలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది' అని మోదీ పేర్కొన్నారు.
అవకాశాలను పెంచాలి
'సాంకేతిక యుగంలో పాలన అంటే కేవలం వ్యవస్థలను నిర్వహించడం కాదు. అవకాశాలను మరింతగా పెంచడం' అని మోదీ అన్నారు. ప్రస్తుతం భారతదేశం అంతర్జాతీయ సదస్సుల్లో కేవలం పాల్గొనడం మాత్రమే కాదు, నాయకత్వం వహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
సివిల్ సర్వెంట్లను ఉద్దేశిస్తూ, 'ప్రభుత్వ ఉద్యోగులు పేదల పట్ల చాలా సున్నితంగా వ్యవహరించాలని, వారు చెప్పే మాటలు వినాలని, పేదలను గౌరవించి, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రధాన్యత ఇవ్వాలి' అని మోదీ కోరారు.
భారత్లో దిగిన జేడీ వాన్స్ ఫ్యామిలీ- మోదీతో భేటీ కానున్న అమెరికా ఉపాధ్యక్షుడు
'ఎన్నికల సంఘం రాజీపడింది, లోపాలున్నాయి'- CECపై రాహుల్ సంచలన ఆరోపణలు