ETV Bharat / bharat

తమిళనాడులో పాకిస్థాన్ యువకుడు మృతి - PAKISTAN YOUTH DIED IN TAMILNADU

చెన్నైలో పాకిస్థాన్ యువకుడు మృతి - స్వదేశానికి మృతదేహం తరలింపు

Pakistan Youth Died In Tamilnadu
Pakistan Youth Died In Tamilnadu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 29, 2025 at 4:15 PM IST

2 Min Read

Pakistan Youth Died In Tamilnadu: తమిళనాడు చెన్నైలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఒక పాకిస్థానీ యువకుడు మరణించాడు. అతడి మృతదేహానికి పోస్ట్​ మార్టం నిర్వహించి సోమవారం శ్రీలంక ఎయిర్​లైన్స్​ ద్వారా కొలొంబోకు పంపించారు. అనంతరం అక్కడి నుంచి మంగళవారం పాకిస్థాన్​లోని లాహోర్​కు పంపించినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ముష్కరులు చేసిన పాశవిక దాడిలో 26మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. భారత్​లో ఉన్న పాకిస్థానీయులందరూ వెంటనే దేశం విడిచి వెళ్లాలని, వైద్య చికిత్స కోసం వచ్చిన వారు ఏప్రిల్ 29నాటికి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో కేంద్ర నిఘా, ఇమ్మిగ్రేషన్ అధికారులు వైద్య వీసాలతో సహా వివిధ వీసాలపై భారతదేశానికి వచ్చిన పాకిస్థానీలను లెక్కించి వారి స్వదేశానికి పంపించే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు.

ఇలా చనిపోయాడు!
ఈ క్రమంలో పాకిస్థాన్​కు చెందిన సయ్యద్ ఆరిఫ్(23) అనే యువకుడు ఊపిరితిత్తులు, గుండె సమస్యలు ఉండటం వల్ల వైద్య వీసాపై చెన్నైకి వచ్చాడు. గత రెండు నెలలుగా నగరంలోని అమింకరై ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆదేశాల మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసుల సహాయంతో అతడిని తిరిగి పాకిస్థాన్​కు పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చికిత్స లేకపోవడం వల్ల ఏప్రిల్ 25 ఆ యువకుడు చనిపోయినట్లు ఆస్పత్రి యాజమాన్యం సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అనంతరం ఆ యువకుడి మృతదేహాన్ని అతడితో సహాయంగా వచ్చిన ఇద్దరు పాకిస్థానీలతో సోమవారం తెల్లవారు జామున లాహోర్​కు పంపించారు.

ఇదిలా ఉండగా, అధునాతన వైద్యం కోరుకునే పాకిస్థానీయులకు చెన్నై ఒక గమ్యస్థానంగా మారింది. దీర్ఘకాలిక గుండె జబ్బుతో బాధపడుతున్న 19 ఏళ్ల పాకిస్థానీ యువతికి గతేడాది జనవరిలో ఇదే ఆస్పత్రిలో గుండె మార్పిడి జరిగింది. కరాచీకి చెందిన ఆ బాలిక ఆపరేషన్ ఖర్చును ఆస్పత్రి, NGO భరించాయి.

'ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు'- ప్రధాని మోదీ వార్నింగ్​

పహల్గాం ఉగ్రదాడి: కర్త, కర్మ, క్రియ 'హఫీజ్ సయీద్'- పాక్ ఆర్మీ కనుసన్నల్లో!

Pakistan Youth Died In Tamilnadu: తమిళనాడు చెన్నైలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఒక పాకిస్థానీ యువకుడు మరణించాడు. అతడి మృతదేహానికి పోస్ట్​ మార్టం నిర్వహించి సోమవారం శ్రీలంక ఎయిర్​లైన్స్​ ద్వారా కొలొంబోకు పంపించారు. అనంతరం అక్కడి నుంచి మంగళవారం పాకిస్థాన్​లోని లాహోర్​కు పంపించినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ముష్కరులు చేసిన పాశవిక దాడిలో 26మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. భారత్​లో ఉన్న పాకిస్థానీయులందరూ వెంటనే దేశం విడిచి వెళ్లాలని, వైద్య చికిత్స కోసం వచ్చిన వారు ఏప్రిల్ 29నాటికి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో కేంద్ర నిఘా, ఇమ్మిగ్రేషన్ అధికారులు వైద్య వీసాలతో సహా వివిధ వీసాలపై భారతదేశానికి వచ్చిన పాకిస్థానీలను లెక్కించి వారి స్వదేశానికి పంపించే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు.

ఇలా చనిపోయాడు!
ఈ క్రమంలో పాకిస్థాన్​కు చెందిన సయ్యద్ ఆరిఫ్(23) అనే యువకుడు ఊపిరితిత్తులు, గుండె సమస్యలు ఉండటం వల్ల వైద్య వీసాపై చెన్నైకి వచ్చాడు. గత రెండు నెలలుగా నగరంలోని అమింకరై ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆదేశాల మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసుల సహాయంతో అతడిని తిరిగి పాకిస్థాన్​కు పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చికిత్స లేకపోవడం వల్ల ఏప్రిల్ 25 ఆ యువకుడు చనిపోయినట్లు ఆస్పత్రి యాజమాన్యం సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అనంతరం ఆ యువకుడి మృతదేహాన్ని అతడితో సహాయంగా వచ్చిన ఇద్దరు పాకిస్థానీలతో సోమవారం తెల్లవారు జామున లాహోర్​కు పంపించారు.

ఇదిలా ఉండగా, అధునాతన వైద్యం కోరుకునే పాకిస్థానీయులకు చెన్నై ఒక గమ్యస్థానంగా మారింది. దీర్ఘకాలిక గుండె జబ్బుతో బాధపడుతున్న 19 ఏళ్ల పాకిస్థానీ యువతికి గతేడాది జనవరిలో ఇదే ఆస్పత్రిలో గుండె మార్పిడి జరిగింది. కరాచీకి చెందిన ఆ బాలిక ఆపరేషన్ ఖర్చును ఆస్పత్రి, NGO భరించాయి.

'ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు'- ప్రధాని మోదీ వార్నింగ్​

పహల్గాం ఉగ్రదాడి: కర్త, కర్మ, క్రియ 'హఫీజ్ సయీద్'- పాక్ ఆర్మీ కనుసన్నల్లో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.