ETV Bharat / bharat

పహల్గాంలో ఉగ్రమూకను ఫస్ట్ చూసింది ఈ రైతే- ఏం జరిగిందో పూసగుచ్చినట్లు! - PAHALGAM TERORIST ATTACK

పహల్గాం ఉగ్రదాడి గురించి ఈటీవీ భారత్​కు వివరించిన ప్రత్యక్ష సాక్షి!

Pahalgam Terorist Attack Eyewitness
Pahalgam Terorist Attack Eyewitness (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 23, 2025 at 10:28 AM IST

Updated : April 23, 2025 at 12:49 PM IST

2 Min Read

Pahalgam Terorist Attack Eyewitness: జమ్ముకశ్మీర్​లోని పవాల్గాంలో ఉగ్రవాదులు తూటాల నుంచి మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసి మరి ప్రాణాలు దక్కించుకున్నాడు. అనంతరం మీడియాకు ఫోన్​ చేసి పర్యటకులపై ముష్కరులు తుపాకులతో విరుచుకుపడిన ఘటన, తాను ఎలా తప్పించుకున్నాడు అనే విషయాలను వివరించాడు.

మధ్యప్రదేశ్​లోని ఛింద్వాడాలో బాంకా నాగ్​పుర్​కు చెందిన రైతు నవీన్ పటేల్, తన స్నేహితులతో కలిసి జమ్ముకశ్మీర్​కు వెళ్లాడు. అందరూ కలిసి మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం సమీప బైసరన్‌ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్నారు. అకస్మాత్తుగా కొంతమంది వచ్చి పర్యాటకులపై కాల్పులు జరపడం ప్రారంభించారని, ప్రాణ భయంతో అందరూ పరుగులు తీశారని 'ఈటీవీ భారత్'​కు ఫోన్​ చేసి తెలిపాడు.

'ఇవే చివరి క్షణాలు అనుకున్నా'
"నా స్నేహితులతో కలిసి అందమైన లోయలను చూస్తుండగా అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వినిపించింది. ఏమీ జరుగుతుందో మాకు అర్థం కాలేదు. అయితే స్థానిక ప్రజల భాష ఒకేలా ఉండటం వల్ల కాల్పులు జరుపుతున్న వారు సైనిక దుస్తుల్లో ఉన్నట్లు కనిపించారు. వారిలో కొంతమంది తుపాకులు పట్టుకుని పర్యాటకులపై కాల్పులు జరిపారు. వారంతా ఉగ్రవాదులు అని ఆ తర్వాతే తెలిసింది. దీంతో ఇవే మాకు చివరి క్షణాలు అని అనుకున్నాం. ఇంకా దేవుడని ప్రార్థించడం ప్రారంభించాం. భయంతో అందరూ తప్పించుకునేందుకు పరుగులు తీశారు. నేను కూడా ఆ భయంకరమైన తూటాల నుంచి పరుగులు తృటిలో తప్పించుకున్నా. ఆ దేవుడే నన్ను రక్షించాడు." అని నవీన్​ అన్నాడు

ముష్కరుల నుంచి తప్పించుకున్న వ్యక్తులను సైనికులు సురక్షితమైన ప్రాంతాలను తరలించినట్లు కుటుంబ సభ్యులకు నవీన్ తెలియజేశారు. ఇక మంగళవారం ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. మరోవైపు ఉగ్రవాదులను గుర్తించేందుకు ఇప్పటికే కేంద్రం ముగ్గురి చాయాచిత్రలను విడుదల చేసింది. ఆ చాయాచిత్రాల ఆధారంగా ఉగ్రమూకలను పట్టుకునేందుకు సిద్ధమైంది.

కొత్త జంటల జీవితాన్ని చిదిమేసిన ఉగ్రవాదులు- భార్యల కళ్లెదుటే భర్తల తలలపై కాల్చి!

పర్యటకులే లక్ష్యంగా- సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు

Pahalgam Terorist Attack Eyewitness: జమ్ముకశ్మీర్​లోని పవాల్గాంలో ఉగ్రవాదులు తూటాల నుంచి మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసి మరి ప్రాణాలు దక్కించుకున్నాడు. అనంతరం మీడియాకు ఫోన్​ చేసి పర్యటకులపై ముష్కరులు తుపాకులతో విరుచుకుపడిన ఘటన, తాను ఎలా తప్పించుకున్నాడు అనే విషయాలను వివరించాడు.

మధ్యప్రదేశ్​లోని ఛింద్వాడాలో బాంకా నాగ్​పుర్​కు చెందిన రైతు నవీన్ పటేల్, తన స్నేహితులతో కలిసి జమ్ముకశ్మీర్​కు వెళ్లాడు. అందరూ కలిసి మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం సమీప బైసరన్‌ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్నారు. అకస్మాత్తుగా కొంతమంది వచ్చి పర్యాటకులపై కాల్పులు జరపడం ప్రారంభించారని, ప్రాణ భయంతో అందరూ పరుగులు తీశారని 'ఈటీవీ భారత్'​కు ఫోన్​ చేసి తెలిపాడు.

'ఇవే చివరి క్షణాలు అనుకున్నా'
"నా స్నేహితులతో కలిసి అందమైన లోయలను చూస్తుండగా అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వినిపించింది. ఏమీ జరుగుతుందో మాకు అర్థం కాలేదు. అయితే స్థానిక ప్రజల భాష ఒకేలా ఉండటం వల్ల కాల్పులు జరుపుతున్న వారు సైనిక దుస్తుల్లో ఉన్నట్లు కనిపించారు. వారిలో కొంతమంది తుపాకులు పట్టుకుని పర్యాటకులపై కాల్పులు జరిపారు. వారంతా ఉగ్రవాదులు అని ఆ తర్వాతే తెలిసింది. దీంతో ఇవే మాకు చివరి క్షణాలు అని అనుకున్నాం. ఇంకా దేవుడని ప్రార్థించడం ప్రారంభించాం. భయంతో అందరూ తప్పించుకునేందుకు పరుగులు తీశారు. నేను కూడా ఆ భయంకరమైన తూటాల నుంచి పరుగులు తృటిలో తప్పించుకున్నా. ఆ దేవుడే నన్ను రక్షించాడు." అని నవీన్​ అన్నాడు

ముష్కరుల నుంచి తప్పించుకున్న వ్యక్తులను సైనికులు సురక్షితమైన ప్రాంతాలను తరలించినట్లు కుటుంబ సభ్యులకు నవీన్ తెలియజేశారు. ఇక మంగళవారం ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. మరోవైపు ఉగ్రవాదులను గుర్తించేందుకు ఇప్పటికే కేంద్రం ముగ్గురి చాయాచిత్రలను విడుదల చేసింది. ఆ చాయాచిత్రాల ఆధారంగా ఉగ్రమూకలను పట్టుకునేందుకు సిద్ధమైంది.

కొత్త జంటల జీవితాన్ని చిదిమేసిన ఉగ్రవాదులు- భార్యల కళ్లెదుటే భర్తల తలలపై కాల్చి!

పర్యటకులే లక్ష్యంగా- సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు

Last Updated : April 23, 2025 at 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.