ETV Bharat / bharat

పర్యటకులే లక్ష్యంగా- సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు - PAHALGAM TERROR ATTACK UPDATES

జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో పెరుగుతున్న మృతుల సంఖ్య- సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు

Pahalgam Terror Attack Updates
Pahalgam Terror Attack Updates (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 22, 2025 at 8:37 PM IST

Updated : April 22, 2025 at 8:43 PM IST

1 Min Read

Pahalgam Terror Attack Updates : జమ్ముకశ్మీర్​కు వచ్చిన పర్యటకులే లక్ష్యంగా సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో 27 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా మృతుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.

వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అమిత్‌ షా
ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అత్యవసర భద్రతా సమీక్ష నిర్వహించారు. మోదీ ఫోన్ చేసిన నేపథ్యంలో హుటాహుటిన శ్రీనగర్​కు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్​ గవర్నర్ కూడా ఉన్నారు.

"పర్యటకులపై దాడి తీవ్రంగా బాధించింది. ఇందులో పాల్గొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేరస్థులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఘటన గురించి ప్రధాని మోదీకి వివరించాను. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించాను. అత్యవసర భద్రతా సమీక్ష కోసం శ్రీనగర్‌ వెళ్తున్నాను"
- కేంద్ర హోంశాఖ మత్రి అమిత్‌ షా ట్వీట్‌

వారు మనుషులు కాదు మృగాలు: ఒమర్‌
పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

రాష్ట్రపతి విచారం

జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి పట్ల రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఉగ్రదాడి నీచమైన, అమానవీయ చర్య, పర్యాటకులపై ఉగ్రదాడి క్షమించరానిది' అని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెల్పిన ఆమె, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ఎవర్నీ వదిలిపెట్టం: మోదీ
జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు అన్ని రకాల సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 'ఉగ్ర దాడి వెనుక ఉన్నవారిని వదిలిపెట్టం. ఉగ్రవాదంతో పోరాడే మా సంకల్పం అచంచలమైనది' అని ప్రధాని మోదీ అన్నారు.

భారత్​కు అండగా
పహల్గామ్​ ఉగ్రదాడి ఘటనపై భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి స్పందించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్‌కు మద్దతుగా నిలుస్తామని పేర్కొంది.

Pahalgam Terror Attack Updates : జమ్ముకశ్మీర్​కు వచ్చిన పర్యటకులే లక్ష్యంగా సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో 27 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా మృతుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.

వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అమిత్‌ షా
ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అత్యవసర భద్రతా సమీక్ష నిర్వహించారు. మోదీ ఫోన్ చేసిన నేపథ్యంలో హుటాహుటిన శ్రీనగర్​కు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్​ గవర్నర్ కూడా ఉన్నారు.

"పర్యటకులపై దాడి తీవ్రంగా బాధించింది. ఇందులో పాల్గొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేరస్థులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఘటన గురించి ప్రధాని మోదీకి వివరించాను. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించాను. అత్యవసర భద్రతా సమీక్ష కోసం శ్రీనగర్‌ వెళ్తున్నాను"
- కేంద్ర హోంశాఖ మత్రి అమిత్‌ షా ట్వీట్‌

వారు మనుషులు కాదు మృగాలు: ఒమర్‌
పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

రాష్ట్రపతి విచారం

జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి పట్ల రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఉగ్రదాడి నీచమైన, అమానవీయ చర్య, పర్యాటకులపై ఉగ్రదాడి క్షమించరానిది' అని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెల్పిన ఆమె, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ఎవర్నీ వదిలిపెట్టం: మోదీ
జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు అన్ని రకాల సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 'ఉగ్ర దాడి వెనుక ఉన్నవారిని వదిలిపెట్టం. ఉగ్రవాదంతో పోరాడే మా సంకల్పం అచంచలమైనది' అని ప్రధాని మోదీ అన్నారు.

భారత్​కు అండగా
పహల్గామ్​ ఉగ్రదాడి ఘటనపై భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి స్పందించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్‌కు మద్దతుగా నిలుస్తామని పేర్కొంది.

Last Updated : April 22, 2025 at 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.