Owaisi Slams Pakistan : తమ వద్ద అణు బాంబులు ఉన్నాయని, అరగంటలో భారత్పై దాడి చేయగలమని పాకిస్థాన్ ప్రగల్భాలు పలుకుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన రీతిలో స్పందించారు. పాకిస్థాన్ కేవలం అరగంట కాదు, భారత్ కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని ఎద్దేవా చేశారు.
వక్ఫ్ (సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని ప్రభానిలో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి వెనుకున్న పాకిస్థాన్పై అసుదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ నేతల బెదిరింపులను ఆయన తోసిపుచ్చారు.
" పాకిస్థాన్ భారత్ కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉంది. మీ పాకిస్థాన్ బడ్జెట్, మా సైనిక బడ్జెట్కు కూడా సమానం కాదు. పాకిస్థాన్ తమ వద్ద న్యూక్లియర్, అటమిక్ బాంబులు ఉన్నాయని పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే, ఏ దేశమూ మౌనంగా ఉండదు."
- అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ
ఉగ్రవాదులు ఖవారీజ్ కంటే దారుణం!
'ఉగ్రవాదులు పహల్గాం పర్యాటకులను చంపే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్ఐఎస్ వారసులని చెబుతోంది' అని ఒవైసీ అన్నారు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని, పాకిస్థాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఒవైసీ పేర్కొన్నారు. పాకిస్థాన్ను ఆర్థికంగా బలహీనపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తగిన చర్యలు తీసుకోవాలని ఒవైసీ డిమాండ్ చేశారు.
కశ్మీర్లో భారత్లో అంతర్భాగం
'టీవీ ఛానల్స్లో కొంత మంది యాంకర్లు కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ యాంకర్లకు సిగ్గు లేదు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కనుక కశ్మీర్ ప్రజలు కూడా భారతీయులే. వారిని మనం ఎలా అనుమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతూ తన ప్రాణాలు అర్పించిన ఓ వ్యక్తి కశ్మీరీ, గాయపడిన ఓ పిల్లవాడిని తన వీపుపై మోసుకెళ్లి రక్షించిన వ్యక్తి కశ్మీరీ' అని ఒవైసీ అన్నారు.
వక్ఫ్ (సవరణ) చట్టంపై, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటించిన నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 30న జరగనున్న 'బట్టి గుల్' కార్యక్రమంలో పాల్గొనాలని, అందరూ లైట్లు ఆపేసి తమ నిరసనను తెలియజేయాని సూచించారు.
వక్ఫ్ (సవరణ) బిల్లుకు మద్దతు ఇచ్చిన అజిత్ పవార్, నితీశ్ కుమార్, జయంత్ చౌదరిపై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. ముస్లింలు, లౌకికవాదులు వీరిని క్షమించరని పేర్కొన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి తమను వెన్నుపోటు పొడిచారని ఒవైసీ ఆరోపించారు.
16 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేసిన కేంద్రం
LoC వెంబడి ఆగని పాక్ కవ్వింపు చర్యలు- వరుసగా నాలుగో రోజు కాల్పులు- భారత్ స్ట్రాంగ్ కౌంటర్