Cafe at Indo China Border : భారత్- చైనా సరిహద్దులో 9 మంది మహిళలు కలిసి ఓ కేఫ్ను నడిపిస్తూ ఔరా అనిపిస్తున్నారు. భారత సైన్యం సహాయంతో ఈ కోమోస్ కేఫ్ను ప్రారంభించారు మహిళలు. అసలు ఈ కేఫ్ ఎక్కడుంది? అందులో ఏం దొరుకుతాయి? దాన్ని నడుపుతుంది ఎవరు? తదితర విషయాలు తెలుసుకుందాం.
వివాదస్పద ప్రాంతంలో కేఫ్
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ జిల్లాలోని భారత్-చైనా బార్డర్లోని ఉన్న జెమిథాంగ్లో 9మంది మహిళా సభ్యుల బృందం కోమోస్ కేఫ్ను నడుపుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఈ కేఫ్ను నడిపిస్తూ స్వయం సమృద్ధి సాధించారు. భారత సైన్యంలోని గజరాజ్ కార్ప్స్ విభాగం జెమిథాంగ్ లోని అనేక మంది మహిళలకు అవసరమైన సౌకర్యాలు, ఆహార తయారీ పరికరాలను అందించింది. అలాగే ట్రైనింగ్ను సైతం ఇచ్చింది. యెహ్మోత్సోర్గిలింగ్ స్వయం సహాయక బృందంలో మొత్తం తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. వారందరూ కలిసి ఈ కేఫ్ను నెలకొల్పారు. టెస్వాంగ్ చోంజోమ్, న్జింగ్ సెరింగ్, డెచిన్ పెమా, కర్మ డెర్మా, పెమా చోటాన్, లోబ్సోంగ్ పెమా, జో త్సోము, వాంచు డ్రామా, యెంచెన్ ఇందులోని సభ్యులు.

'కేఫ్ నిర్వహణ- అందులో నుంచే జీతాలు'
"మేము శిక్షణ పొందిన తర్వాత భారత సైన్యం సహాయంతో ఈ కేఫ్ను నడుపుతున్నాం. సైన్యం మాకు ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, బేకరీ వస్తువులు, కుర్చీలు, టేబుళ్లను అందించింది. గతంలో మేము గృహిణీలుగా ఇంట్లో ఉండేవాళ్లం. ఇప్పుడు మేము లుమ్లా మార్కెట్ నుంచి వస్తువులను కొని ఆహార పదార్థాలను ఇక్కడే తయారు చేస్తాం. మేము తొమ్మిది మంది సభ్యులం. నెలకు ముగ్గురం కేఫ్ నిర్వహణ చూసుకుంటాం. వ్యాపారంలో వచ్చిన డబ్బును ఆదా చేస్తాం. మాలో ప్రతి ఒక్కరూ ఆ డబ్బుతో జీతాన్ని పొందుతారు. జెమిథాంగ్కు వచ్చే పర్యటకులను మేము స్వాగతిస్తాం. కానీ మా ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండదు. కొన్ని ప్రదేశాలలో తప్ప మొబైల్ ఫోన్ నెట్ వర్క్ చాలా తక్కువగా ఉంటుంది." అని టెస్వాంగ్ చోంజోమ్ తెలిపారు.

జెమిథాంగ్ అనేది తవాంగ్ జిల్లాలోని లుమ్లా సబ్ డివిజన్ లోని ఒక రెవెన్యూ సర్కిల్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 2,498 జనాభా ఉన్నారు. ఈ రెవెన్యూ సర్కిల్ లో 18 గ్రామాలు ఉన్నాయి. భారత్- చైనా సరిహద్దులో వివాదస్పద ప్రాంతంలో జెమిథాంగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ కార్యక్రమం కింద భారత్ సైన్యం తాగునీరు, వ్యవసాయ వస్తువులను గ్రామస్థులకు అందిస్తోంది.


వైబ్రంట్ విలేజ్ అంటే ఏమిటి?
సరిహద్దు గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం 'వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్' (VVP) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ను హోంమంత్రి అమిత్ షా 2023 ఏప్రిల్ 10న అరుణాచల్ ప్రదేశ్లోని ఇండో-చైనా సరిహద్దులోని మారుమూల గ్రామమైన కిబెటులో ప్రారంభించారు. కమ్యూనికేషన్ సౌకర్యాలు తక్కువగా ఉన్న సరిహద్దు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక నిధులను కేటాయిస్తుంది.

కళ్లు కనిపించకపోయినా టైలరింగ్- మహిళలకు ఫ్రీగా ట్రైనింగ్
పాటలు పాడే లేడీ ట్రాఫిక్ పోలీస్- సిగ్నల్ వద్ద సాంగ్స్ పాడుతూ రూల్స్పై అవగాహన