ETV Bharat / bharat

'కొత్త రూపంలో ఉగ్రవాదం- 5లక్షల మంది భారతీయులతో పాక్ అమ్మాయిల పెళ్లి' - NISHIKANT DUBEY ON PAKISTANI GIRLS

2025 చివరి నాటికి పాక్ నాలుగు ముక్కలు అవుతుందని ఎంపీ దూబే జోస్యం- పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​ భారత్​ తిరిగి వస్తుందని ధీమా

nishikant dubey on pakistan
nishikant dubey on pakistan (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 28, 2025 at 12:01 PM IST

2 Min Read

Nishikant Dubey on Pakistan : భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్​ ఉగ్రవాదం కొత్త రూపాన్ని సంతరించుకుందని అన్నారు. పాకిస్థాన్​ అమ్మాయిలు పెళ్లి చేసుకుని భారత్​లోకి ప్రవేశించారని, కానీ ఇప్పటివరకూ వారికి పౌరసత్వం లేదని తెలిపారు. ఎక్స్ వేదికగా దూబే ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 5లక్షల మంది పాకిస్థాన్​ అమ్మాయిలు భారతీయలను పెళ్లి చేసుకున్నారని, వారంతా ఇక్కడే నివసిస్తున్నారని తెలిపారు. కానీ వారికి ఇప్పటి వరకూ ఎలాంటి భారత పౌరసత్వం లేదని చెప్పారు. ఇలా దేశంలోకి ప్రవేశించిన శత్రువులను ఎలా ఎదుర్కొవాలని ప్రశ్నించారు.

"పాకిస్థాన్​ అమ్మాయిలు వివాహం చేసుకుని ఇక్కడే ఉన్నారు. వారంతా అనేక ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నా భారత పౌరులు కారు. ఇంకా పాకిస్థానీ యువకులు సైతం పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నారు. ఈ పెళ్లిళ్ల వెనుక ఉద్దేశం ఏంటో విచారణ జరపాలి. వారి దేశాల్లో పెళ్లి సంబంధాలు లేవా? 1947 దేశ విభజన సమయంలో పాకిస్థాన్​కు వలస వెళ్లిన వారి ఆస్తులను ప్రభుత్వం శత్రువు ఆస్తిగా ప్రకటించి స్వాధీనం చేసుకుంది. దీనర్థం పాకిస్థాన్, భారత్​ దేశాల వారు పరస్పరం పెళ్లి చేసుకోవడం వల్ల శత్రువులు కాలేరా?"

--నిషికాంత్ దూబే, బీజేపీ ఎంపీ

'పాకిస్థాన్​ నాలుగు ముక్కలు అవుతుంది'
అంతకుముందు ఆదివారం ఝార్ఖండ్​లోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన దూబే, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025 చివరి వరకు పాకస్థాన్​ ఉనికిలో లేకుండా పోతుందని అన్నారు. పాకిస్థాన్​ నాలుగు ముక్కులుగా విడిపోతుందని జోస్యం చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్​ను తిరిగి పొందుతామని, మిగిలినది బలూచిస్థాన్, పంక్తూనిస్థాన్, పంజాబ్​గా విడిపోతాయని తెలిపారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు.

జమ్ము కశ్మీర్​లో మినీ స్విట్జర్లాండ్​గా పిలిచే పహల్గాంలో ఏప్రిల్​ 22న జరిగి ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో 26 మంది చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్​ పౌరులకు వీసాలు రద్దు చేసి 27తేదీలోగా దేశం విడిచిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా గత నాలుగు రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు. మరోవైపు 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ భారత్‌లోనే తిష్ఠ వేసిన పాకిస్థానీయులను ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్‌-2025 ప్రకారం అరెస్టు చేస్తామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఈ చట్టం కింద అరెస్టైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా గరిష్ఠంగా 3 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెప్పారు.

16 పాకిస్థాన్‌ యూట్యూబ్‌ ఛానెళ్లను బ్యాన్ చేసిన కేంద్రం

LoC వెంబడి ఆగని పాక్​ కవ్వింపు చర్యలు- వరుసగా నాలుగో రోజు కాల్పులు- భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Nishikant Dubey on Pakistan : భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్​ ఉగ్రవాదం కొత్త రూపాన్ని సంతరించుకుందని అన్నారు. పాకిస్థాన్​ అమ్మాయిలు పెళ్లి చేసుకుని భారత్​లోకి ప్రవేశించారని, కానీ ఇప్పటివరకూ వారికి పౌరసత్వం లేదని తెలిపారు. ఎక్స్ వేదికగా దూబే ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 5లక్షల మంది పాకిస్థాన్​ అమ్మాయిలు భారతీయలను పెళ్లి చేసుకున్నారని, వారంతా ఇక్కడే నివసిస్తున్నారని తెలిపారు. కానీ వారికి ఇప్పటి వరకూ ఎలాంటి భారత పౌరసత్వం లేదని చెప్పారు. ఇలా దేశంలోకి ప్రవేశించిన శత్రువులను ఎలా ఎదుర్కొవాలని ప్రశ్నించారు.

"పాకిస్థాన్​ అమ్మాయిలు వివాహం చేసుకుని ఇక్కడే ఉన్నారు. వారంతా అనేక ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నా భారత పౌరులు కారు. ఇంకా పాకిస్థానీ యువకులు సైతం పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నారు. ఈ పెళ్లిళ్ల వెనుక ఉద్దేశం ఏంటో విచారణ జరపాలి. వారి దేశాల్లో పెళ్లి సంబంధాలు లేవా? 1947 దేశ విభజన సమయంలో పాకిస్థాన్​కు వలస వెళ్లిన వారి ఆస్తులను ప్రభుత్వం శత్రువు ఆస్తిగా ప్రకటించి స్వాధీనం చేసుకుంది. దీనర్థం పాకిస్థాన్, భారత్​ దేశాల వారు పరస్పరం పెళ్లి చేసుకోవడం వల్ల శత్రువులు కాలేరా?"

--నిషికాంత్ దూబే, బీజేపీ ఎంపీ

'పాకిస్థాన్​ నాలుగు ముక్కలు అవుతుంది'
అంతకుముందు ఆదివారం ఝార్ఖండ్​లోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన దూబే, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025 చివరి వరకు పాకస్థాన్​ ఉనికిలో లేకుండా పోతుందని అన్నారు. పాకిస్థాన్​ నాలుగు ముక్కులుగా విడిపోతుందని జోస్యం చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్​ను తిరిగి పొందుతామని, మిగిలినది బలూచిస్థాన్, పంక్తూనిస్థాన్, పంజాబ్​గా విడిపోతాయని తెలిపారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు.

జమ్ము కశ్మీర్​లో మినీ స్విట్జర్లాండ్​గా పిలిచే పహల్గాంలో ఏప్రిల్​ 22న జరిగి ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో 26 మంది చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్​ పౌరులకు వీసాలు రద్దు చేసి 27తేదీలోగా దేశం విడిచిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా గత నాలుగు రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు. మరోవైపు 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ భారత్‌లోనే తిష్ఠ వేసిన పాకిస్థానీయులను ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్‌-2025 ప్రకారం అరెస్టు చేస్తామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఈ చట్టం కింద అరెస్టైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా గరిష్ఠంగా 3 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెప్పారు.

16 పాకిస్థాన్‌ యూట్యూబ్‌ ఛానెళ్లను బ్యాన్ చేసిన కేంద్రం

LoC వెంబడి ఆగని పాక్​ కవ్వింపు చర్యలు- వరుసగా నాలుగో రోజు కాల్పులు- భారత్ స్ట్రాంగ్ కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.