Nishikant Dubey on Pakistan : భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదం కొత్త రూపాన్ని సంతరించుకుందని అన్నారు. పాకిస్థాన్ అమ్మాయిలు పెళ్లి చేసుకుని భారత్లోకి ప్రవేశించారని, కానీ ఇప్పటివరకూ వారికి పౌరసత్వం లేదని తెలిపారు. ఎక్స్ వేదికగా దూబే ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 5లక్షల మంది పాకిస్థాన్ అమ్మాయిలు భారతీయలను పెళ్లి చేసుకున్నారని, వారంతా ఇక్కడే నివసిస్తున్నారని తెలిపారు. కానీ వారికి ఇప్పటి వరకూ ఎలాంటి భారత పౌరసత్వం లేదని చెప్పారు. ఇలా దేశంలోకి ప్రవేశించిన శత్రువులను ఎలా ఎదుర్కొవాలని ప్రశ్నించారు.
"పాకిస్థాన్ అమ్మాయిలు వివాహం చేసుకుని ఇక్కడే ఉన్నారు. వారంతా అనేక ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నా భారత పౌరులు కారు. ఇంకా పాకిస్థానీ యువకులు సైతం పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నారు. ఈ పెళ్లిళ్ల వెనుక ఉద్దేశం ఏంటో విచారణ జరపాలి. వారి దేశాల్లో పెళ్లి సంబంధాలు లేవా? 1947 దేశ విభజన సమయంలో పాకిస్థాన్కు వలస వెళ్లిన వారి ఆస్తులను ప్రభుత్వం శత్రువు ఆస్తిగా ప్రకటించి స్వాధీనం చేసుకుంది. దీనర్థం పాకిస్థాన్, భారత్ దేశాల వారు పరస్పరం పెళ్లి చేసుకోవడం వల్ల శత్రువులు కాలేరా?"
--నిషికాంత్ దూబే, బీజేపీ ఎంపీ
#WATCH | Deoghar, Jharkhand | On Pakistani citizens living in India, BJP MP Nishikant Dubey says, " ... when the process of visa cancellations began, two types of visas emerged and an in-depth investigation is needed. pakistani girls have been married here, and they cannot become… pic.twitter.com/o0tbe0jI3y
— ANI (@ANI) April 28, 2025
'పాకిస్థాన్ నాలుగు ముక్కలు అవుతుంది'
అంతకుముందు ఆదివారం ఝార్ఖండ్లోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన దూబే, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025 చివరి వరకు పాకస్థాన్ ఉనికిలో లేకుండా పోతుందని అన్నారు. పాకిస్థాన్ నాలుగు ముక్కులుగా విడిపోతుందని జోస్యం చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ను తిరిగి పొందుతామని, మిగిలినది బలూచిస్థాన్, పంక్తూనిస్థాన్, పంజాబ్గా విడిపోతాయని తెలిపారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు.
జమ్ము కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పిలిచే పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగి ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో 26 మంది చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ పౌరులకు వీసాలు రద్దు చేసి 27తేదీలోగా దేశం విడిచిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా గత నాలుగు రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు. మరోవైపు 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ భారత్లోనే తిష్ఠ వేసిన పాకిస్థానీయులను ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ప్రకారం అరెస్టు చేస్తామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఈ చట్టం కింద అరెస్టైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా గరిష్ఠంగా 3 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెప్పారు.
16 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేసిన కేంద్రం
LoC వెంబడి ఆగని పాక్ కవ్వింపు చర్యలు- వరుసగా నాలుగో రోజు కాల్పులు- భారత్ స్ట్రాంగ్ కౌంటర్