ETV Bharat / bharat

ఉగ్రదాడికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ - JAMMU KASHMIR TERRORIST ATTACK

ఏప్రిల్​ 25న దేశవ్యాప్తంగా కొవ్వుత్తుల ర్యాలీ- సంతాపం తెలుపుతూ CWC భేటీలో తీర్మానం

cwc meeting on pahalgam terror attack
cwc meeting on pahalgam terror attack (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 24, 2025 at 2:59 PM IST

2 Min Read

CWC Meeting on Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్​ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇందులో పాకిస్థాన్​ ప్రధాన సూత్రధారని దుయ్యబట్టింది. ఇది నేరుగా ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన కాంగ్రెస్​, ఉగ్రదాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఐక్యంగా ఉండాల్సిన ఇలాంటి సమయంలో విభజనను ప్రోత్సహించేలా బీజేపీ వ్యవహరిస్తుందని విమర్శించింది.

జమ్ము కశ్మీర్​ ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ అత్యున్నత విధాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఎంపీలు పాల్గొన్నారు. ఈ మేరకు సీడబ్యూసీ వివరాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ వివరించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏప్రిల్​ 25న దేశవ్యాప్తంగా కొవ్వుత్తులతో ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. త్వరలో ప్రారంభమయ్యే అమర్​నాథ్ యాత్ర నేపథ్యంలో భక్తుల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు.

"కాంగ్రెస్​ డిమాండ్​ను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ అంశం తీవ్రత దృష్ట్యా దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరు కావాలని ఆశిస్తున్నాం. ఇది నేరుగా మన ఐక్యత, భద్రతపై దాడిగా భావించాలి. ఈ క్రమంలోనే దాడిపై అన్ని కోణాలపైనా సీడబ్యూసీ సమావేశంలో చర్చించాం."

--పవన్ ఖేడా, కాంగ్రెస్ నేత

మరోవైపు జమ్మూకశ్మీర్​ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు భవనంలో ఈ భేటీ జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడి ఘటన, తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. ఉగ్రదాడి ఘటనపై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే ఈ భేటీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వివిధ పార్టీల నేతలతో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.

'ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది'- ప్రధాని మోదీ హెచ్చరిక

చార్ ధామ్ యాత్రకు 'ఉగ్ర' భయాలు- భక్తుల భద్రతపై సర్కార్ అలర్ట్!

CWC Meeting on Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్​ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇందులో పాకిస్థాన్​ ప్రధాన సూత్రధారని దుయ్యబట్టింది. ఇది నేరుగా ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన కాంగ్రెస్​, ఉగ్రదాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఐక్యంగా ఉండాల్సిన ఇలాంటి సమయంలో విభజనను ప్రోత్సహించేలా బీజేపీ వ్యవహరిస్తుందని విమర్శించింది.

జమ్ము కశ్మీర్​ ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ అత్యున్నత విధాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఎంపీలు పాల్గొన్నారు. ఈ మేరకు సీడబ్యూసీ వివరాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ వివరించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏప్రిల్​ 25న దేశవ్యాప్తంగా కొవ్వుత్తులతో ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. త్వరలో ప్రారంభమయ్యే అమర్​నాథ్ యాత్ర నేపథ్యంలో భక్తుల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు.

"కాంగ్రెస్​ డిమాండ్​ను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ అంశం తీవ్రత దృష్ట్యా దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరు కావాలని ఆశిస్తున్నాం. ఇది నేరుగా మన ఐక్యత, భద్రతపై దాడిగా భావించాలి. ఈ క్రమంలోనే దాడిపై అన్ని కోణాలపైనా సీడబ్యూసీ సమావేశంలో చర్చించాం."

--పవన్ ఖేడా, కాంగ్రెస్ నేత

మరోవైపు జమ్మూకశ్మీర్​ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు భవనంలో ఈ భేటీ జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడి ఘటన, తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. ఉగ్రదాడి ఘటనపై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే ఈ భేటీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వివిధ పార్టీల నేతలతో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.

'ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది'- ప్రధాని మోదీ హెచ్చరిక

చార్ ధామ్ యాత్రకు 'ఉగ్ర' భయాలు- భక్తుల భద్రతపై సర్కార్ అలర్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.