ETV Bharat / bharat

'కిరానా హిల్స్'లో అణుధార్మికత లీకేజీపై పాకిస్థాన్​ నోరు మెదపదేంటి? దాయాది ఏమైనా దాచి పెడుతోందా? - KIRANA HILLS NUCLEAR LEAK

పాక్​ కిరానా హిల్స్​లో న్యూక్లియర్ లీక్ జరిగిందా? అమెరికా న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం ఎందుకొచ్చినట్టు? పాకిస్థాన్​ ఏమైనా దాచిపెడుతోందా?

Pakistan Silence On Kirana Hills Nuclear Leak
Pakistan Silence On Kirana Hills Nuclear Leak (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2025 at 5:26 PM IST

5 Min Read

Pakistan Silence On Kirana Hills Nuclear Leak : పాకిస్థాన్ అణుస్థావరం అని చెబుతున్న కిరానా హిల్స్​లో అణుధార్మికత లీకేజీ అంశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతోంది. తాజాగా లీకేజీ అంశంపై 'ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఎమర్జెన్సీ-IAEA' స్పందించింది. కిరానా హిల్స్​లో ఎలాంటి లీకేజీ జరగలేదని చెబుతోంది. మరి అణుధార్మికత లీకేజీ కాకుంటే అమెరికా నుంచి న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం ఎందుకొచ్చింది? ఈజిప్టు నుంచి రేడియేషన్​ను కట్టిడి చేయడానికి ఉపయోగించే బోరాన్​తో మరో విమానం పాక్ గగనతలంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు కిరానా హిల్స్​పై వస్తున్న వార్తలపై పాకిస్థాన్ ఎందుకు మౌనం పాటిస్తోంది? దాయాది దేశం కిరానా హిల్స్ విషయంలో ఏమైనా దాచిపెడుతుందా?

పాకిస్థాన్ సర్గోదా జిల్లాలో కిరానా హిల్స్​ ఉన్నాయి. ఇక్కడే పాకిస్థాన్ అణు దాడులకు ఉపయోగించే​ టాక్టికల్ న్యూక్లియర్ వార్​హెడ్​లను ఉంచినట్లు వార్తలు వచ్చాయి. దీనికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోనే ముసఫ్​ ఎయిర్​బేస్ ఉంది. భారత్​ దాడి చేసిన ఎయిర్​బేస్​లలో ఇది ఒకటి. ఇక్కడి నుంచి కిలారీ హిల్స్​కు కనెక్షన్​ ఉందని అంటున్నారు. దీంతో ఇక్కడే వార్​హెడ్​లకు నష్టం జరిగి- రేడియోయాక్టివ్ రిలీజ్ అయ్యి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

భారత్​ దాడి చేసిన 11ఎయిర్​బేస్​ల్లో(నూర్​ఖాన్, రఫీకి, సుక్కుర్, సియాల్​కోట్​, మురిద్, పర్సుర్, చునియన్, స్కర్దు, భొలారి, జకోబాబాద్, సర్గోదా) రావల్పిండి సమీపంలోని నూర్​ఖాన్​ ఎయిర్​బేస్ కూడా ఒకటి . ఇక్కడే భారీ విధ్వంసం సృష్టించే అణు దాడులు చేసే స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్​హెడ్​లను పాక్​ నిల్వచేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలవరించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ అణుధార్మికత వెలువడి ఉండవచ్చన్నది ఆ కథనాల సారాంశం. అమెరికాకు చెందిన సీఐఏ మాజీ అధికారి డెరెక్ గ్రాస్​మన్​ కూడా ఈ వాదనను బలపర్చారు.

న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం ఎందుకొచ్చింది?

పాకిస్థాన్​లోని ఎయిర్ బేస్​లపై భారత్ దాడి చేసిన తర్వాత అమెరికా డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎనర్జీకి చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్​క్రాఫ్ట్- B350 AMS పాక్​ గగనతలంలోకి వచ్చినట్లు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. B350 AMS విమానం ద్వారా రేడియోధార్మిక యాక్టివిటీని అంచనా వేస్తారు. అణు కర్మాగార ప్రమాదాల తర్వాత రేడియేషన్ లీక్‌లను పర్యవేక్షించడం, రేడియోలాజికల్ సంఘటనల సమయంలో అత్యవసర సేవలకు ఈ విమానాన్ని మోహరిస్తారు. అందుకే దీనిని 'రేడియేషన్ స్నిప్పర్' అని కూడా అంటారు. ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ 'ఫ్లైట్ రాడార్​ 24'లో ట్రాక్​ చేసిన వివరాల ప్రకారం ఈ విమానం పాక్​ గగనతలంలో ప్రయాణించినట్లు చూపిస్తోంది. వాస్తవానికి అమెరికాకు చెందిన ఈ విమానాన్ని 2010లో పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు అమెరికా అప్పగించినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ విమానం పాకిస్థాన్ వద్దే ఉన్నది కాబట్టి భారత్ ఎయిర్ బేస్​పై దాడి తర్వాత రేడియేషన్ లీక్ అయిందని పాక్ అనుమానించిందా? లేక ముందు జాగ్రత్త చర్యగా B350 AMS విమానాన్ని మోహరించిందా? అనే ప్రశ్న సోషల్ మీడియాను తొలుస్తోంది.

ఈజిప్టు నుంచి మరో విమానం?

న్యూక్లియర్​ ఎమర్జెన్సీ విమానం వచ్చిన రీతిలోనే ఈజిప్టుకు చెందిన మరో విమానం కూడా బోరాన్​ నిల్వలతో పాకిస్థాన్​లోకి వచ్చినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. బోరాన్​ న్యూట్రాన్లను అబ్సార్బ్​ చేసుకుంటుంది. ముఖ్యంగా బోరాన్​-10 ఐసోటోప్​లలో అణు ధార్మికతకు సంబంధించిన న్యూట్రాన్లు విలీనం అవుతాయి. దీంతో రేడియేషన్​ ప్రభావం తగ్గుతుంది. అందుకోసమే ఈజిప్టు నుంచి బోరాన్​ తీసుకువచ్చారని వాదనలు వినిపిస్తున్నాయి.

Pakistan Silence On Kirana Hills Nuclear Leak
బీ-350 ఏఎమ్​ఎస్​ ఫీచర్స్ (ETV Bharat)

పాకిస్థాన్​ మౌనరాగం వీడదెందుకు?

మొదటి కారణం: కిరానా హిల్స్​లో అణుధార్మికత లీకేజీ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆఖరికి IAEA కూడా స్పందించింది. కానీ తమ దేశంపై వస్తున్న వార్తలపై మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు. అయితే దాయాది దేశం మౌన వ్రతం పాటించడానికి పలు కారణాలు ఉన్నాయి. పాక్​కు చెందిన 11 ఎయిర్​బేస్​లపై భారత్ క్షిణపణులతో దాడి చేసింది. అందులో రెండు ఎయిర్ బేస్​లు పాక్ అణు స్థావరాల సమీపంలో ఉన్నాయని వరల్డ్ మీడియా కోడై కూస్తోంది. తమ వద్ద అణ్వాయూదాలు ఉన్నాయని పదేపదే చెబుతున్న పాకిస్థాన్ గర్వాన్ని ఈ దాడితో భారత్ పటాపంచలు చేసింది. అణ్వాయూదాల నిల్వలను ఉంచిన కిరాణా హిల్స్, నూర్​ఖాన్ ప్రాంతాల్లో క్షిపణులతో విరుచుకపడింది. పాకిస్థాన్​కు అణుదాడి ఆలోచన వచ్చే లోపే ఆ స్థావరాలను నామ రూపాల్లేకుండా చేస్తామన్న సంకేతాలను భారత్ ఇచ్చింది. భారత్ చేసిన ఈ హెచ్చరికను పాకిస్థాన్ బహిరంగంగా ఒప్పుకునే పరిస్థితి ఇప్పుడు లేదు.

Pakistan Silence On Kirana Hills Nuclear Leak
పాకిస్థాన్​ మౌనరాగం వీడదెందుకు? (ETV Bharat)

రెండో కారణం: ఒక దేశం మరో దేశ అణు స్థావరాలపై దాడి చేయడం అంత సులభమైన విషయం కాదు. అయితే భారత్ నేరుగా దాడి చేయకపోయినా చేసినంత పని చేసింది. ఈ క్రమంలో భారత్ తమ దేశ అణ్వస్త్రాలపై భారత్ దాడి చేసిందని ఒప్పుకుంటే అంతర్జాతీయ వేదికపై తమ పరువు పోతుందన్న ఆలోచనలో దాయాది దేశం ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ఈ అంశంపై దేశ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని పాకిస్థాన్​ భయపడి ఉండొచ్చని విశ్లేషణలు వెలువుడుతున్నాయి. ఎందుకంటే, న్యూక్లియర్ వార్​హెడ్స్​ కూడా రక్షించుకోలేనంత శక్తిహీనంగా పాలకులు తయారయ్యారని స్వదేశంలోనే ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.

మూడో కారణం: పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన దేశమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అయితే ఆ దేశంలో ఉన్న అణ్వస్త్రాలు నిల్వ ఉంచిన ప్రదేశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ దాడి తర్వాత ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. భారత్ ఎయిర్ బేస్​లపై దాడి చేస్తే, అణ్వాయుధ నిల్వ ఉన్న ప్రదేశాల్లో అలజడి రేగడం ఆందోళన కలిగించే అంశమే. తాజాగా భారత రక్షణమంత్రి రాజ్​నాథ్ కూడా పాకిస్థాన్ అణ్వస్త్రాలపై అనుమానం వ్యక్తం చేశారు. వాటిని అంతర్జాతీయ సంస్థలు స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో తమ దేశంలో అణుధార్మికత లీక్ అయ్యిందని పాకిస్థాన్ ఒప్పుకుంటే, అణ్వాయుధాలను నిర్వహించగల సామర్థ్యం పాకిస్థాన్​కు ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలాంటి కారణాలతో అణుధార్మికత లీక్ అంశంపై ఏం మాట్లడలేక, ఒకవేళ మాట్లాడితే ఏం అవుతుందన్న భయంతో 'అటు కక్కలేక, ఇటు మింగలేక' అన్న చందంగా పాకిస్థాన్ పరిస్థతి తయారైంది. అలాగే, కిరానా హిల్స్​లో వాస్తవ పరిస్థతిని ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్నట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్​లోని అణ్వాయుధాల భద్రతపై అనుమానం: రక్షణ మంత్రి రాజ్​నాథ్​

పాక్‌ అణు స్థావరాలను భారత్‌ క్షిపణులు తాకాయా? అందుకే కాళ్ల బేరానికి వచ్చిందా?

Pakistan Silence On Kirana Hills Nuclear Leak : పాకిస్థాన్ అణుస్థావరం అని చెబుతున్న కిరానా హిల్స్​లో అణుధార్మికత లీకేజీ అంశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతోంది. తాజాగా లీకేజీ అంశంపై 'ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఎమర్జెన్సీ-IAEA' స్పందించింది. కిరానా హిల్స్​లో ఎలాంటి లీకేజీ జరగలేదని చెబుతోంది. మరి అణుధార్మికత లీకేజీ కాకుంటే అమెరికా నుంచి న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం ఎందుకొచ్చింది? ఈజిప్టు నుంచి రేడియేషన్​ను కట్టిడి చేయడానికి ఉపయోగించే బోరాన్​తో మరో విమానం పాక్ గగనతలంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు కిరానా హిల్స్​పై వస్తున్న వార్తలపై పాకిస్థాన్ ఎందుకు మౌనం పాటిస్తోంది? దాయాది దేశం కిరానా హిల్స్ విషయంలో ఏమైనా దాచిపెడుతుందా?

పాకిస్థాన్ సర్గోదా జిల్లాలో కిరానా హిల్స్​ ఉన్నాయి. ఇక్కడే పాకిస్థాన్ అణు దాడులకు ఉపయోగించే​ టాక్టికల్ న్యూక్లియర్ వార్​హెడ్​లను ఉంచినట్లు వార్తలు వచ్చాయి. దీనికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోనే ముసఫ్​ ఎయిర్​బేస్ ఉంది. భారత్​ దాడి చేసిన ఎయిర్​బేస్​లలో ఇది ఒకటి. ఇక్కడి నుంచి కిలారీ హిల్స్​కు కనెక్షన్​ ఉందని అంటున్నారు. దీంతో ఇక్కడే వార్​హెడ్​లకు నష్టం జరిగి- రేడియోయాక్టివ్ రిలీజ్ అయ్యి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

భారత్​ దాడి చేసిన 11ఎయిర్​బేస్​ల్లో(నూర్​ఖాన్, రఫీకి, సుక్కుర్, సియాల్​కోట్​, మురిద్, పర్సుర్, చునియన్, స్కర్దు, భొలారి, జకోబాబాద్, సర్గోదా) రావల్పిండి సమీపంలోని నూర్​ఖాన్​ ఎయిర్​బేస్ కూడా ఒకటి . ఇక్కడే భారీ విధ్వంసం సృష్టించే అణు దాడులు చేసే స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్​హెడ్​లను పాక్​ నిల్వచేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలవరించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ అణుధార్మికత వెలువడి ఉండవచ్చన్నది ఆ కథనాల సారాంశం. అమెరికాకు చెందిన సీఐఏ మాజీ అధికారి డెరెక్ గ్రాస్​మన్​ కూడా ఈ వాదనను బలపర్చారు.

న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం ఎందుకొచ్చింది?

పాకిస్థాన్​లోని ఎయిర్ బేస్​లపై భారత్ దాడి చేసిన తర్వాత అమెరికా డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఎనర్జీకి చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్​క్రాఫ్ట్- B350 AMS పాక్​ గగనతలంలోకి వచ్చినట్లు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. B350 AMS విమానం ద్వారా రేడియోధార్మిక యాక్టివిటీని అంచనా వేస్తారు. అణు కర్మాగార ప్రమాదాల తర్వాత రేడియేషన్ లీక్‌లను పర్యవేక్షించడం, రేడియోలాజికల్ సంఘటనల సమయంలో అత్యవసర సేవలకు ఈ విమానాన్ని మోహరిస్తారు. అందుకే దీనిని 'రేడియేషన్ స్నిప్పర్' అని కూడా అంటారు. ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ 'ఫ్లైట్ రాడార్​ 24'లో ట్రాక్​ చేసిన వివరాల ప్రకారం ఈ విమానం పాక్​ గగనతలంలో ప్రయాణించినట్లు చూపిస్తోంది. వాస్తవానికి అమెరికాకు చెందిన ఈ విమానాన్ని 2010లో పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు అమెరికా అప్పగించినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ విమానం పాకిస్థాన్ వద్దే ఉన్నది కాబట్టి భారత్ ఎయిర్ బేస్​పై దాడి తర్వాత రేడియేషన్ లీక్ అయిందని పాక్ అనుమానించిందా? లేక ముందు జాగ్రత్త చర్యగా B350 AMS విమానాన్ని మోహరించిందా? అనే ప్రశ్న సోషల్ మీడియాను తొలుస్తోంది.

ఈజిప్టు నుంచి మరో విమానం?

న్యూక్లియర్​ ఎమర్జెన్సీ విమానం వచ్చిన రీతిలోనే ఈజిప్టుకు చెందిన మరో విమానం కూడా బోరాన్​ నిల్వలతో పాకిస్థాన్​లోకి వచ్చినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. బోరాన్​ న్యూట్రాన్లను అబ్సార్బ్​ చేసుకుంటుంది. ముఖ్యంగా బోరాన్​-10 ఐసోటోప్​లలో అణు ధార్మికతకు సంబంధించిన న్యూట్రాన్లు విలీనం అవుతాయి. దీంతో రేడియేషన్​ ప్రభావం తగ్గుతుంది. అందుకోసమే ఈజిప్టు నుంచి బోరాన్​ తీసుకువచ్చారని వాదనలు వినిపిస్తున్నాయి.

Pakistan Silence On Kirana Hills Nuclear Leak
బీ-350 ఏఎమ్​ఎస్​ ఫీచర్స్ (ETV Bharat)

పాకిస్థాన్​ మౌనరాగం వీడదెందుకు?

మొదటి కారణం: కిరానా హిల్స్​లో అణుధార్మికత లీకేజీ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆఖరికి IAEA కూడా స్పందించింది. కానీ తమ దేశంపై వస్తున్న వార్తలపై మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు. అయితే దాయాది దేశం మౌన వ్రతం పాటించడానికి పలు కారణాలు ఉన్నాయి. పాక్​కు చెందిన 11 ఎయిర్​బేస్​లపై భారత్ క్షిణపణులతో దాడి చేసింది. అందులో రెండు ఎయిర్ బేస్​లు పాక్ అణు స్థావరాల సమీపంలో ఉన్నాయని వరల్డ్ మీడియా కోడై కూస్తోంది. తమ వద్ద అణ్వాయూదాలు ఉన్నాయని పదేపదే చెబుతున్న పాకిస్థాన్ గర్వాన్ని ఈ దాడితో భారత్ పటాపంచలు చేసింది. అణ్వాయూదాల నిల్వలను ఉంచిన కిరాణా హిల్స్, నూర్​ఖాన్ ప్రాంతాల్లో క్షిపణులతో విరుచుకపడింది. పాకిస్థాన్​కు అణుదాడి ఆలోచన వచ్చే లోపే ఆ స్థావరాలను నామ రూపాల్లేకుండా చేస్తామన్న సంకేతాలను భారత్ ఇచ్చింది. భారత్ చేసిన ఈ హెచ్చరికను పాకిస్థాన్ బహిరంగంగా ఒప్పుకునే పరిస్థితి ఇప్పుడు లేదు.

Pakistan Silence On Kirana Hills Nuclear Leak
పాకిస్థాన్​ మౌనరాగం వీడదెందుకు? (ETV Bharat)

రెండో కారణం: ఒక దేశం మరో దేశ అణు స్థావరాలపై దాడి చేయడం అంత సులభమైన విషయం కాదు. అయితే భారత్ నేరుగా దాడి చేయకపోయినా చేసినంత పని చేసింది. ఈ క్రమంలో భారత్ తమ దేశ అణ్వస్త్రాలపై భారత్ దాడి చేసిందని ఒప్పుకుంటే అంతర్జాతీయ వేదికపై తమ పరువు పోతుందన్న ఆలోచనలో దాయాది దేశం ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ఈ అంశంపై దేశ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని పాకిస్థాన్​ భయపడి ఉండొచ్చని విశ్లేషణలు వెలువుడుతున్నాయి. ఎందుకంటే, న్యూక్లియర్ వార్​హెడ్స్​ కూడా రక్షించుకోలేనంత శక్తిహీనంగా పాలకులు తయారయ్యారని స్వదేశంలోనే ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.

మూడో కారణం: పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన దేశమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అయితే ఆ దేశంలో ఉన్న అణ్వస్త్రాలు నిల్వ ఉంచిన ప్రదేశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ దాడి తర్వాత ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. భారత్ ఎయిర్ బేస్​లపై దాడి చేస్తే, అణ్వాయుధ నిల్వ ఉన్న ప్రదేశాల్లో అలజడి రేగడం ఆందోళన కలిగించే అంశమే. తాజాగా భారత రక్షణమంత్రి రాజ్​నాథ్ కూడా పాకిస్థాన్ అణ్వస్త్రాలపై అనుమానం వ్యక్తం చేశారు. వాటిని అంతర్జాతీయ సంస్థలు స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో తమ దేశంలో అణుధార్మికత లీక్ అయ్యిందని పాకిస్థాన్ ఒప్పుకుంటే, అణ్వాయుధాలను నిర్వహించగల సామర్థ్యం పాకిస్థాన్​కు ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలాంటి కారణాలతో అణుధార్మికత లీక్ అంశంపై ఏం మాట్లడలేక, ఒకవేళ మాట్లాడితే ఏం అవుతుందన్న భయంతో 'అటు కక్కలేక, ఇటు మింగలేక' అన్న చందంగా పాకిస్థాన్ పరిస్థతి తయారైంది. అలాగే, కిరానా హిల్స్​లో వాస్తవ పరిస్థతిని ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్నట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్​లోని అణ్వాయుధాల భద్రతపై అనుమానం: రక్షణ మంత్రి రాజ్​నాథ్​

పాక్‌ అణు స్థావరాలను భారత్‌ క్షిపణులు తాకాయా? అందుకే కాళ్ల బేరానికి వచ్చిందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.