Kedarnath Helicopter Booking 2025 : మీరు చార్ధామ్ యాత్రకు వెళ్తున్నారా? జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్కు ప్లాన్ చేస్తున్నారా? ఎంతో కష్టమైన ఈ యాత్రకు ఇకపై హెలీకాప్టర్లో హాయిగా వెళ్లొచ్చు. త్వరలోనే ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ సందర్శనకు ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే, కేదార్నాథ్ వెళ్లేందుకు గౌరీ కుండ్ వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మరో 18 కి.మీ యాత్ర అతికష్టంగా చేరుకోవాల్సి ఉంటుంది. హిమాలయాల్లో 3,553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అనేక మంది వృద్ధులు, చిన్న పిల్లలు, ఆరోగ్యం సహకరించనివారు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఈ క్రమంలోనే అలాంటి వారి కోసం 2023లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించింది. దీంతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది వినియోగించుకుంటున్నారు.
కేదార్నాథ్ ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుంది?
చార్ధామ్ యాత్రలో భాగంగా మొదటగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయను పురస్కరించుకుని ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. ఆ తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని మే 2 ఉదయం 7గంటలకు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. బద్రీనాథ్ ఆలయాన్ని మే 4న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ సీఈఓ విజయ్ ప్రసాద్ తపిల్యాల్ వివరించారు. ఈ నేపథ్యంలోనే భక్తుల సౌకర్యం కోసం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎలా బుక్ చేసుకోవాలి?
కేదార్నాథ్కు హెలికాప్టర్లో వెళ్లాలనుకునేవారు భారతీయ రైల్వేకు చెందిన టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఐఆర్సీటీసీ (IRCTC) నుంచి టికెట్ బుక్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా ఐఆర్సీటీసీ హెలియాత్ర పేరిట ప్రత్యేక పోర్టల్లోకి (https://heliyatra.irctc.co.in/) వెళ్లి వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 8 మధ్యాహ్నం 12 నుంచి బుకింగ్లు ప్రారంభమైనట్లు అధికారులు ప్రకటించారు. మే 2 నుంచి 31వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది. సర్సీ హెలిప్యాడ్ ఆలయం నుంచి కేవలం 23 కి.మీ దూరంలోనే ఉండగా.. ఇక్కడి నుంచి 12 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీంతో పాటు ఫటా, గుప్తకాశీ ప్రాంతాల నుంచి కూడా హెలికాప్టర్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ సారి ధరలు పెరిగాయ్!
అయితే, గతేడాదితో పోలిస్తే ఈ సారి హెలికాప్టర్ ధరలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. 2023 చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ప్రతి ఏటా 5శాతం ధరలు పెంచుకోవచ్చు. ఫలితంగా గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రేట్లు కొద్దిగా పెరిగాయి. దీంతో సిర్సి నుంచి కేదార్నాథ్ వెళ్లి రావడానికి రూ. 6,063 కాగా ఫటా నుంచి కేదార్నాథ్ రాకపోకలకు రూ.8,533 అవుతుందని వివరించారు. అయితే, హెలికాప్టర్ సేవలను బుకింగ్ చేసుకోవడానికి ట్రావెల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు.
హెలికాప్టర్లో వధువును అత్తారింటికి పంపడం అక్కడి ఆనవాయితీ! కొత్త ట్రెండ్ ఎక్కడో తెలుసా?
పాన్ కార్డ్ తెచ్చిన తంటా- సాధారణ రైతుకు రూ.143 కోట్ల IT నోటీస్