ETV Bharat / bharat

భారత్​లో దిగిన జేడీ వాన్స్​ ఫ్యామిలీ- మోదీతో భేటీ కానున్న అమెరికా ఉపాధ్యక్షుడు - JD VANCE INDIA VISIT

వాన్స్​కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం- భారత దళాలు వాన్స్​కు గౌరవ వందనం

jd vance india visit
jd vance india visit (AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : April 21, 2025 at 10:45 AM IST

Updated : April 21, 2025 at 2:38 PM IST

1 Min Read

JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కుటుంబసమేతంగా భారత పర్యటనకు వచ్చారు. దిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో దిగిన వాన్స్​కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలకారు. భారత దళాలు వాన్స్​కు గౌరవ వందనం చేశాయి. అనంతరం పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఆ తర్వాత దిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం చేనేత ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సముదాయాన్ని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి ఈ నెల 24 వరకు JD వాన్స్ దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు.

సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, ముగ్గురు పిల్లలతో పాటు ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. జేడీవాన్స్ పిల్లలు సంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనువిందు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వాన్స్ చేరుకుంటారు. చర్చల తర్వాత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. మరోవైపు వాన్స్ పర్యటన నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు

24న తిరిగి అమెరికా వెళ్లనున్న వాన్స్
విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్‌ దంపతులు జయపురకు వెళ్లనున్నారు. అక్కడ విలాసవంతమైన రాంభాగ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో బస చేస్తారు. మంగళవారం ఉదయం అంబర్‌ కోటతో పాటు పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు.ఆ తర్వాత మధ్యాహ్నం రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ట్రంప్‌ హయాంలో భారత్, అమెరికా సంబంధాల విస్తృతిపై మాట్లాడతారు. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, భారత ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరు కానున్నారు. అనంతరం 23వ తేదీ ఉదయం వాన్స్‌ కుటుంబం ఆగ్రాకు వెళ్లి తాజ్‌ మహల్‌ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జయపురకు చేరుకుంటారు. 24వ తేదీన తిరిగి అమెరికా వెళ్లనున్నారు.

JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కుటుంబసమేతంగా భారత పర్యటనకు వచ్చారు. దిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో దిగిన వాన్స్​కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలకారు. భారత దళాలు వాన్స్​కు గౌరవ వందనం చేశాయి. అనంతరం పలువురు కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఆ తర్వాత దిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం చేనేత ఉత్పత్తులను విక్రయించే దుకాణాల సముదాయాన్ని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి ఈ నెల 24 వరకు JD వాన్స్ దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు.

సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, ముగ్గురు పిల్లలతో పాటు ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. జేడీవాన్స్ పిల్లలు సంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనువిందు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వాన్స్ చేరుకుంటారు. చర్చల తర్వాత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. మరోవైపు వాన్స్ పర్యటన నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు

24న తిరిగి అమెరికా వెళ్లనున్న వాన్స్
విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్‌ దంపతులు జయపురకు వెళ్లనున్నారు. అక్కడ విలాసవంతమైన రాంభాగ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో బస చేస్తారు. మంగళవారం ఉదయం అంబర్‌ కోటతో పాటు పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు.ఆ తర్వాత మధ్యాహ్నం రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ట్రంప్‌ హయాంలో భారత్, అమెరికా సంబంధాల విస్తృతిపై మాట్లాడతారు. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, భారత ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరు కానున్నారు. అనంతరం 23వ తేదీ ఉదయం వాన్స్‌ కుటుంబం ఆగ్రాకు వెళ్లి తాజ్‌ మహల్‌ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జయపురకు చేరుకుంటారు. 24వ తేదీన తిరిగి అమెరికా వెళ్లనున్నారు.

Last Updated : April 21, 2025 at 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.