Kharge Letter To PM Modi : లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంటడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పదవికి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.
'లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా ఉండటం ప్రజాస్వామ్య సూత్రాలను విరుద్ధం. అలాగే రాజ్యాంగంలోని నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది. మొదటి నుంచి 16వ వరకు అన్ని లోక్సభల్లో డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తప్పనిసరి. స్పీకర్ తర్వాత లోక్సభలో రెండో అత్యున్నత స్థానం డిప్యూటీ స్పీకర్దే. కొత్తగా ఏర్పడిన లోక్సభ రెండో లేదా మూడో సమావేశంలో డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ను నియమించడం సంప్రదాయం' అని లేఖలో ఖర్గే పేర్కొన్నారు.
My letter to PM Shri @narendramodi on the urgency to initiate the process of electing a Deputy Speaker of Lok Sabha without any further delay.
— Mallikarjun Kharge (@kharge) June 10, 2025
From the First to the Sixteenth Lok Sabha, every House has had a Deputy Speaker. By and large, it has been a well-established… pic.twitter.com/WUyIPlTVqx
స్వతంత్ర భారతదేశ చరిత్రలో వరుసగా రెండు పర్యాయాలు ఈ పదవి ఖాళీగా ఉండటం ఇదే మొదటిసారి మల్లికార్జున ఖర్గే అన్నారు. 17వ లోక్సభలో ఈ పదవికి ఎన్నిక జరగలేదని, ప్రస్తుతం కొనసాగుతున్న 18వ సభలోనూ ఇదే కొనసాగుతోందని పేర్కొన్నారు. ముందుగా చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని సభ సంప్రదాయాలకు, మన పార్లమెంట్ ప్రజాస్వామ్య సూత్రాలను అనుగుణంగా వెంటనే లోక్సభ డిప్యూటీ స్పీకర్ను ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.