Man gets Divorce After 45 FIRs : భార్య వేధింపులు తట్టుకోలేక ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి విడాకుల కోసం సుదీర్ఘ పోరాటం చేశాడు. దాదాపు 15ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగి చివరకు విడాకులు సాధించాడు. అనేక దాడులతో పాటు మానసిక ప్రశాంతతకు దూరమయ్యాడు. ఇంకా అతడిపై దాదాపు 45ఎఫ్ఐఆర్లు సైతం నమోదయ్యాయి. చివరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగం సైతం మానేశాడు.
అసలేం జరిగిందంటే?
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తికి 2003లో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. LIC పాలసీలో నామినీగా తననే పెట్టాలని, భువనేశ్వర్లో ఉన్న ఇల్లును తన పేరిట రాయాలని, తల్లిదండ్రులతో సంబంధాలను తెంచుకోని ఇంటి హక్కుల తనకే ఉండాలంటూ భార్య వేధిస్తోంది. ఈ క్రమంలోనే వృత్తి రీత్యా హరిపుర్తో పాటు భువనేశ్వర్, బెంగళూరు, అమెరికా, బ్యాంకాక్, జపాన్ ప్రాంతాలకు వెళ్లినా భార్య వేధింపులు ఆగలేదు. మాటమాట పెరిగి అనేక సార్లు భర్తపై దాడి చేసింది. డల్లాస్లో ఉండే సమయంలో ఓసారి వాగ్వాదం పెరిగి మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్తో భర్త తలపై కొట్టింది. దీంతో ఎమెర్జెన్సీ వార్డులో చేరి కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి ఒడిశాకు వచ్చాక.. ఇంటికి గుండాలను పంపి బెదిరించింది. అత్తమామలను ఇంటి నుంచి ఖాలీ చేసి వెళ్లాలని హెచ్చరించింది. ఇంటికి తాళం వేసి వారి నడి రోడ్డుపైనే ఉంచగా, పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిచారు.
ఇక భార్య వేధింపులు తాళలేక చివరకు 2009లో భర్త విడాకుల కోసం కటక్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ, ఆమె దీనిని వ్యతిరేకిస్తూ భర్తతో కలిసి ఉంటానని కోర్టుకు చెప్పింది. ఆ తర్వాత భర్తపైనే పోలీస్ స్టేషన్లో సుమారు 45 సార్లు ఫిర్యాదు చేసింది. అయితే, 2009లో దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు, 2023 ఆగస్టు 7 విడాకులు మంజూరు చేసింది. అయితే, భార్యకు రూ.63 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. కానీ కటక్ ఫ్యామిలీ కోర్టు తీర్పును అంగీకరించకుండా ఒడిశా హైకోర్టులో అప్పీలు చేసింది భార్య.
అయితే, విచారణ జరుగుతున్న సమయంలోనూ భర్తపై వేధింపులు ఆపలేదు భార్య. దీంతో చివరకు చేస్తున్న ఉద్యోగానికి సైతం రాజీనామా చేశాడు. తన భార్య వేధింపులతో పని పట్ల దృష్టి సారించలేకపోతునున్నాంటూ లేఖలో పేర్కొన్నాడు. ఇటీవలే విచారణ చేపట్టిన ఒడిశా హైకోర్టు, కటక్ ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్ధించింది. ఆమె చర్యలు దారుణంగా ఉన్నాయని, ఇలాంటి విషపూరిత వివాహం బంధంలో ఉండాలంటూ చట్టం బలవంతం చేయకూడదని వ్యాఖ్యానించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం భర్తకు కూడా మానసిక శాంతి ఉండాలని తెలిపింది. చివరకు 2025 మార్చి 19న విడాకులు మంజూరు చేస్తూ తీర్పును ఇచ్చింది. రూ. 63లక్షల భరణం ఇవ్వాలంటూ కటక్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకభవించింది. ఇలా అనేక సంవత్సరాల పాటు పోరాడి విడాకులను పొందాడు.
నేవీ అధికారి హత్య కేసులో మరో ట్విస్ట్- గర్భం దాల్చిన నిందితురాలు
రూ.500 ఆదాయం- రూ.38 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు! అలా చేసినందుకేనా?