ETV Bharat / bharat

ఒంటి కాలు, ఒంటి చేత్తో విజయతీరాలకు- భిక్షాటన చేయకుండా, కష్టపడి సక్సెస్ అయిన యువకుడు! - HANDICAPPED YOUTH INSPIRING STORY

ఒంటి కాలు, ఒంటి చేత్తో దివ్యాంగుడి జీవన విజయం- భిక్షాటన చేయమని సలహా ఇచ్చిన గ్రామస్తులు కష్టార్జితంతో షిర్డీలో స్థిరపడిన మధ్యప్రదేశ్ యువతేజం

pawan rawat INSPIRING STORY
Handicapped Youth Inspiring Story (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 19, 2025 at 6:58 PM IST

2 Min Read

Handicapped Youth Inspiring Story : బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాల వద్ద భిక్షాటన చేసే వారిని మనం చూస్తుంటాం. భిక్షకుల్లో ఎంతో మంది దివ్యాంగులు కూడా ఉంటారు. మధ్యప్రదేశ్‌‌లోని సాత్నా జిల్లా సలాహా గ్రామానికి చెందిన గిరిజన యువకుడు పవన్ రావత్ కూడా దివ్యాంగుడే. ఈయన ప్రమాదంలో ఒక కాలు, ఒక చెయ్యిని కోల్పోయారు. అయితేనేం పవన్ అస్సలు భిక్షాటన చేయరు. శ్రమయేవ జయతే మంత్రంతో ఆయన తన జీవన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. "అడుక్కోవద్దు, సాయిబాబా లాకెట్ తీసుకోండి" అని చెబుతూ మహారాష్ట్రలోని షిర్డీ సాయినాథుడి ఆలయ ప్రాంగణంలో పవన్ రావత్ నిలబడి ఉంటారు. చేతినిండా సాయిబాబా లాకెట్లను పట్టుకొని, ఒంటికాలిపై గంటల కొద్దీ నిలబడి కష్టార్జితాన్ని ఆయన సంపాదిస్తుంటారు.

కాలు, చెయ్యి కోల్పోయాక గ్రామస్తులు ఏమన్నారంటే?
మధ్యప్రదేశ్‌‌లోని సలాహా గ్రామానికి చెందిన పవన్ రావత్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. బాల్యంలో ఇంటి బయట ఆడుకుంటుండగా, ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగి పవన్ మీద పడింది. దీంతో ఆయన ఎడమ చేయి, ఎడమ కాలులను వైద్యులు తీసేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఊరి ప్రజలంతా పవన్‌కు ఒకే ఒక సలహా ఇచ్చారు. మహారాష్ట్రలోని షిర్డీకి వెళ్లిపొమ్మని చెప్పారు. షిర్డీలో దివ్యాంగులకు ఆహారం ఉచితంగా దొరుకుతుందంటూ పవన్‌కు ఉచిత సలహాలు ఇచ్చుకున్నారు. దీంతో పవన్ నేరుగా షిర్డీకి చేరుకున్నాడు. అయితే భిక్షాటన కోసం కాదు.

ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒంటికాలిపై
సలాహా గ్రామం నుంచి షిర్డీకి చేరుకున్న తర్వాత, పవన్‌కు తల దాచుకోవడానికి గూడు కూడా లేదు. అతన్ని చూసిన షిర్డీ ప్రజలు కూడా భిక్షాటన చేయమని ఉచిత సలహా ఇచ్చుకున్నారు. అయితే వాళ్ల మాటలను పవన్ వినలేదు. కష్టపడి పనిచేసే మార్గాన్నే ఆయన ఎంచుకున్నారు. షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద సాయిబాబా లాకెట్లను అమ్మడం మొదలుపెట్టారు. రోజూ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆలయం బయట ఒంటికాలిపై పవన్ నిలబడుతారు. "సాయిబాబా లాకెట్, ఫొటో తీసుకోండి" అంటూ భక్తులను ఆయన పిలుస్తుంటారు. పవన్ ఒక లాకెట్‌ అమ్మకంపై సగటున రూ.30 దాకా సంపాదిస్తారు. ఈ విధంగా ప్రతిరోజూ రూ.700 దాకా సంపాదిస్తున్నారు.

ప్రేమ పెళ్లి చేసుకొని సెటిల్
తన సంపాదనతో పవన్ షిర్డీలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. జయకుమారి అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ దంపతులకు నైనా, దుర్గ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పవన్ కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఇంటిని నడుపుతున్నాడు. "నేను, పవన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాది నిజమైన ప్రేమ. అందుకే నేను అన్నీ వదిలేసి పవన్‌ను పెళ్లి చేసుకున్నాను. మేం సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాం" అని పవన్ భార్య జయకుమారి చెప్పుకొచ్చింది.

'నాకు వధువు వద్దు- ఆమె చెల్లినే పెళ్లాడుతా!'- వరుడు వింత వాదన- పెళ్లి కూతురు ఆత్మహత్యాయత్నం

కూతురి మామతో మహిళ 'లవ్​ స్టోరీ'- డబ్బు, నగలతో పరార్!

Handicapped Youth Inspiring Story : బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాల వద్ద భిక్షాటన చేసే వారిని మనం చూస్తుంటాం. భిక్షకుల్లో ఎంతో మంది దివ్యాంగులు కూడా ఉంటారు. మధ్యప్రదేశ్‌‌లోని సాత్నా జిల్లా సలాహా గ్రామానికి చెందిన గిరిజన యువకుడు పవన్ రావత్ కూడా దివ్యాంగుడే. ఈయన ప్రమాదంలో ఒక కాలు, ఒక చెయ్యిని కోల్పోయారు. అయితేనేం పవన్ అస్సలు భిక్షాటన చేయరు. శ్రమయేవ జయతే మంత్రంతో ఆయన తన జీవన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. "అడుక్కోవద్దు, సాయిబాబా లాకెట్ తీసుకోండి" అని చెబుతూ మహారాష్ట్రలోని షిర్డీ సాయినాథుడి ఆలయ ప్రాంగణంలో పవన్ రావత్ నిలబడి ఉంటారు. చేతినిండా సాయిబాబా లాకెట్లను పట్టుకొని, ఒంటికాలిపై గంటల కొద్దీ నిలబడి కష్టార్జితాన్ని ఆయన సంపాదిస్తుంటారు.

కాలు, చెయ్యి కోల్పోయాక గ్రామస్తులు ఏమన్నారంటే?
మధ్యప్రదేశ్‌‌లోని సలాహా గ్రామానికి చెందిన పవన్ రావత్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. బాల్యంలో ఇంటి బయట ఆడుకుంటుండగా, ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగి పవన్ మీద పడింది. దీంతో ఆయన ఎడమ చేయి, ఎడమ కాలులను వైద్యులు తీసేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఊరి ప్రజలంతా పవన్‌కు ఒకే ఒక సలహా ఇచ్చారు. మహారాష్ట్రలోని షిర్డీకి వెళ్లిపొమ్మని చెప్పారు. షిర్డీలో దివ్యాంగులకు ఆహారం ఉచితంగా దొరుకుతుందంటూ పవన్‌కు ఉచిత సలహాలు ఇచ్చుకున్నారు. దీంతో పవన్ నేరుగా షిర్డీకి చేరుకున్నాడు. అయితే భిక్షాటన కోసం కాదు.

ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒంటికాలిపై
సలాహా గ్రామం నుంచి షిర్డీకి చేరుకున్న తర్వాత, పవన్‌కు తల దాచుకోవడానికి గూడు కూడా లేదు. అతన్ని చూసిన షిర్డీ ప్రజలు కూడా భిక్షాటన చేయమని ఉచిత సలహా ఇచ్చుకున్నారు. అయితే వాళ్ల మాటలను పవన్ వినలేదు. కష్టపడి పనిచేసే మార్గాన్నే ఆయన ఎంచుకున్నారు. షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద సాయిబాబా లాకెట్లను అమ్మడం మొదలుపెట్టారు. రోజూ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఆలయం బయట ఒంటికాలిపై పవన్ నిలబడుతారు. "సాయిబాబా లాకెట్, ఫొటో తీసుకోండి" అంటూ భక్తులను ఆయన పిలుస్తుంటారు. పవన్ ఒక లాకెట్‌ అమ్మకంపై సగటున రూ.30 దాకా సంపాదిస్తారు. ఈ విధంగా ప్రతిరోజూ రూ.700 దాకా సంపాదిస్తున్నారు.

ప్రేమ పెళ్లి చేసుకొని సెటిల్
తన సంపాదనతో పవన్ షిర్డీలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. జయకుమారి అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ దంపతులకు నైనా, దుర్గ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పవన్ కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఇంటిని నడుపుతున్నాడు. "నేను, పవన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాది నిజమైన ప్రేమ. అందుకే నేను అన్నీ వదిలేసి పవన్‌ను పెళ్లి చేసుకున్నాను. మేం సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాం" అని పవన్ భార్య జయకుమారి చెప్పుకొచ్చింది.

'నాకు వధువు వద్దు- ఆమె చెల్లినే పెళ్లాడుతా!'- వరుడు వింత వాదన- పెళ్లి కూతురు ఆత్మహత్యాయత్నం

కూతురి మామతో మహిళ 'లవ్​ స్టోరీ'- డబ్బు, నగలతో పరార్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.