ETV Bharat / bharat

16 పాకిస్థాన్‌ యూట్యూబ్‌ ఛానెళ్లను బ్యాన్ చేసిన కేంద్రం - PAKISTAN YOUTUBE CHANNEL BAN

కేంద్ర హోంశాఖ సిఫార్సు మేరకు పాక్‌ యూట్యూబ్‌ ఛానెళ్లపై నిషేధం- ఉగ్రవాదులను మిలిటెంట్లుగా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం బీబీసీకి లేఖ రాసిన కేంద్రం

Pakistan Youtube Channel Ban In India
Pakistan Youtube Channel Ban In India (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : April 28, 2025 at 10:28 AM IST

2 Min Read

Pakistan Youtube Channel Ban In India : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్​, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్​ను సంబంధించిన పలు యూట్యూబ్​ ఛానళ్లపై నిషేధం విధించింది. పాక్ న్యూస్, ఎంటర్​టైన్​మెంట్​కు చెందిన మొత్తం 16 ఛానళ్లను బ్యాన్ చేసింది. అంతేకాకుండా పహల్గాం ఉగ్రదాడి కవరేజీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీబీసీ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం ఓ లేఖ రాసింది.

కేంద్రం నిషేధం విధించిన వాటిల్లో డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సామా టీవీ, ఏఆర్​వై, పలు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత రెచ్చగొట్టే ప్రచారం చేయటమే కాకుండా మతపరంగా సున్నితమైన కంటెంట్‌తోపాటు తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయటం, భారత్‌, సైనిక బలగాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ ఆరోపణల కారణంగానే ఈ యూట్యూబ్​ ఛానళ్లను నిషేధం విధించినట్లు తెలిపింది. నిషేధించిన యూట్యూబ్​ ఛానళ్లను క్లిక్​ చేస్తే, ప్రస్తుతం ఇందులోని కంటెంట్ అందుబాటులో లేదనే సందేశం కనిపిస్తోంది. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అదేశాలను మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వస్తోంది. ఇక ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన రిపోర్టింగ్‌పై బీబీసీకి కేంద్రం పలు సూచనలు చేసింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా పేర్కొనటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. బీబీసీ ప్రసారాలను పర్యవేక్షించనున్నట్లు కేంద్రం లేఖలో పేర్కొంది.

ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఇరు దేశాల​ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇప్పటికే భారత్‌ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలుచర్యలు చేపట్టింది. పాక్‌ పౌరులను భారత్​ నుంచి వెళ్లగొట్టింది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం, పాక్‌ వీసాలను రద్దు చేయడం వంటివి చేసింది. అంతేకాకుండా పాక్‌ దౌత్యవేత్తలకు సమన్లు పంపింది. అటారీ-వాఘా సరిహద్దు గేట్లను మూసివేసింది. ఇప్పటికే పాకిస్థాన్​ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్​ ఖాతాను ఇండియాలో నిలిపివేసింది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన 16యూట్యూబ్‌ ఛానళ్లపై కొరఢా ఝుళిపించింది.

పాకిస్థాన్​కు 537మంది- ఇండియాకు 850మంది- స్వదేశాలకు ఇరు దేశాల పౌరులు

NIA చేతికి ఉగ్రదాడి కేసు- కేంద్ర హోం శాఖ ఆదేశం- పర్యటకులను విచారిస్తున్న అధికారులు

Pakistan Youtube Channel Ban In India : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్​, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్​ను సంబంధించిన పలు యూట్యూబ్​ ఛానళ్లపై నిషేధం విధించింది. పాక్ న్యూస్, ఎంటర్​టైన్​మెంట్​కు చెందిన మొత్తం 16 ఛానళ్లను బ్యాన్ చేసింది. అంతేకాకుండా పహల్గాం ఉగ్రదాడి కవరేజీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీబీసీ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం ఓ లేఖ రాసింది.

కేంద్రం నిషేధం విధించిన వాటిల్లో డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సామా టీవీ, ఏఆర్​వై, పలు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత రెచ్చగొట్టే ప్రచారం చేయటమే కాకుండా మతపరంగా సున్నితమైన కంటెంట్‌తోపాటు తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయటం, భారత్‌, సైనిక బలగాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ ఆరోపణల కారణంగానే ఈ యూట్యూబ్​ ఛానళ్లను నిషేధం విధించినట్లు తెలిపింది. నిషేధించిన యూట్యూబ్​ ఛానళ్లను క్లిక్​ చేస్తే, ప్రస్తుతం ఇందులోని కంటెంట్ అందుబాటులో లేదనే సందేశం కనిపిస్తోంది. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అదేశాలను మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వస్తోంది. ఇక ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన రిపోర్టింగ్‌పై బీబీసీకి కేంద్రం పలు సూచనలు చేసింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా పేర్కొనటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. బీబీసీ ప్రసారాలను పర్యవేక్షించనున్నట్లు కేంద్రం లేఖలో పేర్కొంది.

ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఇరు దేశాల​ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇప్పటికే భారత్‌ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలుచర్యలు చేపట్టింది. పాక్‌ పౌరులను భారత్​ నుంచి వెళ్లగొట్టింది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం, పాక్‌ వీసాలను రద్దు చేయడం వంటివి చేసింది. అంతేకాకుండా పాక్‌ దౌత్యవేత్తలకు సమన్లు పంపింది. అటారీ-వాఘా సరిహద్దు గేట్లను మూసివేసింది. ఇప్పటికే పాకిస్థాన్​ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్​ ఖాతాను ఇండియాలో నిలిపివేసింది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన 16యూట్యూబ్‌ ఛానళ్లపై కొరఢా ఝుళిపించింది.

పాకిస్థాన్​కు 537మంది- ఇండియాకు 850మంది- స్వదేశాలకు ఇరు దేశాల పౌరులు

NIA చేతికి ఉగ్రదాడి కేసు- కేంద్ర హోం శాఖ ఆదేశం- పర్యటకులను విచారిస్తున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.