National Security Advisory Board Revamped : పహల్గామ్ దాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాతున్న వేళ జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం పునరుద్ధరించింది. బోర్డు ఛైర్మన్గా రా మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ బోర్డులో విశ్రాంత మిలిటరీ, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారు. బోర్డు సభ్యులుగా PM సిన్హా, AK సింగ్, మోంటీ ఖన్నా, మాజీ IASలు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ IFS అధికారి B. వెంకటేశ్ వర్మలకు చోటు కల్పించింది.
మోదీ నివాసంలో కీలక సమావేశాలు
మరోవైపు పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS), రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCPA), ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సమావేశాలు జరిగాయి. పాక్తో ఉద్రిక్త పరిస్థతుల నేపథ్యంలో మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
రెండో సారి సీసీఎస్ సమావేశం
భారత పర్యటకులపై పహల్గాంలో ముష్కరులు రెచ్చిపోయిన తర్వాత రెండోసారి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం జరిగింది. అంతకుముందు ఏప్రిల్ 23న ఓసారి జరిగింది. జమ్ముకశ్మీర్లో విజయంతంగా ఎన్నికలు నిర్వహించడం, అక్కడ అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, స్థిరమైన పురోగతిని ఓర్వలేకే ముష్కరులు పహల్గాంలో రెచ్చిపోయారని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని, సింధూ జలాల ఒప్పందాల రద్దు సహా పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
కీలక భద్రతా సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం కీలక భద్రత సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్తో పాటు త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో భారత సాయుధ దళాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రకటించారు.ట
పాక్ మరోసారి కవ్వింపు- 6వ రోజూ భారత సైన్యంపై కాల్పులు
భద్రతా సంస్థల అధిపతులతో కేంద్ర హోంశాఖ హై-లెవెల్ సెక్యూరిటీ మీటింగ్