ETV Bharat / bharat

అయోధ్య మందిరం పూర్తి!- నిర్మాణంలో ఎన్ని కిలోల బంగారం వాడారంటే? - AYODHYA RAM MANDIR

రామ మందిర రెండోవిడత విగ్రహ ప్రతిష్ఠ- ఎన్ని కిలోల బంగారం వాడారో తెలుసా?

Ayodhya Ram Mandir Gold
Ayodhya Ram Mandir Gold (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 7, 2025 at 12:20 AM IST

1 Min Read

Ayodhya Ram Mandir Gold : అయోధ్య రామాలయ రెండోవిడత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జూన్ 5న కనులపండువగా సాగింది. గురువారం మొదటి అంతస్తులో రామ దర్బార్​ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ రాజదర్బారులో సీతా సమేతంగా రాజు హోదాలో అయోధ్య రాముడు కొలువుదీరాడు. ఈ వేడుకల నేపథ్యంలో ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా కీలక అంశాలు వెల్లడించారు. రామ మందిర నిర్మాణంలో వినియోగించిన పసిడి విలువ పేర్కొన్నారు.

అయోధ్య రామ మందిరం నిర్మాణంలో మొత్తం 45 కిలోల మేలిమి బంగారం వినియోగించినట్లు నృపేంద్ర శర్మ తెలిపారు. ఈ ఆలయ నిర్మాణంలో వినియోగించిన పుత్తడి విలువ దాదాపు రూ.50 కోట్లు (టాక్స్​లు మినహాయించి) ఉంటుందని అన్నారు. మందిరంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ తలుపులు, రాముడి సింహాసనంలో బంగారాన్ని అధికంగా ఉపయోగించారు.

కాగా, శేషావతార్ ఆలయంలో బంగారం పని ఈ రోజుకీ జరుగుతోందని శర్మ తెలిపారు. రామాలయం ప్రధాన నిర్మాణాలు ఇప్పటికే పూర్తైనా, ఆలయ సముదాయంలోని ఆడిటోరియం, మ్యూజియం, అతిథి గృహం వంటివి ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ నిర్మాణాలు 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి కావొచ్చని భావిస్తున్నారు.

Ayodhya Ram Mandir Gold : అయోధ్య రామాలయ రెండోవిడత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జూన్ 5న కనులపండువగా సాగింది. గురువారం మొదటి అంతస్తులో రామ దర్బార్​ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ రాజదర్బారులో సీతా సమేతంగా రాజు హోదాలో అయోధ్య రాముడు కొలువుదీరాడు. ఈ వేడుకల నేపథ్యంలో ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా కీలక అంశాలు వెల్లడించారు. రామ మందిర నిర్మాణంలో వినియోగించిన పసిడి విలువ పేర్కొన్నారు.

అయోధ్య రామ మందిరం నిర్మాణంలో మొత్తం 45 కిలోల మేలిమి బంగారం వినియోగించినట్లు నృపేంద్ర శర్మ తెలిపారు. ఈ ఆలయ నిర్మాణంలో వినియోగించిన పుత్తడి విలువ దాదాపు రూ.50 కోట్లు (టాక్స్​లు మినహాయించి) ఉంటుందని అన్నారు. మందిరంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ తలుపులు, రాముడి సింహాసనంలో బంగారాన్ని అధికంగా ఉపయోగించారు.

కాగా, శేషావతార్ ఆలయంలో బంగారం పని ఈ రోజుకీ జరుగుతోందని శర్మ తెలిపారు. రామాలయం ప్రధాన నిర్మాణాలు ఇప్పటికే పూర్తైనా, ఆలయ సముదాయంలోని ఆడిటోరియం, మ్యూజియం, అతిథి గృహం వంటివి ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ నిర్మాణాలు 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి కావొచ్చని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.