ETV Bharat / bharat

'బాలికలకు ప్రెగ్నెన్సీ కిట్లు పంపిణీ- శానిటరీ ప్యాడ్స్ తనిఖీ'- సర్కార్​ స్కూల్​లో షాకింగ్​ ఘటన! - PREGNANCY KITS DISTRIBUTED

బాలికల ఆశ్రమ పాఠశాలలో గర్భం దాల్చిన విద్యార్థినులు- గర్భధారణ కిట్లు పంపిణీ- తమ శానిటరీ ప్యాడ్‌లనూ తనిఖీ చేశారంటూ బాలికల ఆవేదన

Pregnancy kits Distributed In School
Pregnancy kits Distributed In School (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 19, 2025 at 8:38 PM IST

2 Min Read

అది జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ బాలికల ఆశ్రమ పాఠశాల. ఉత్తర్​ప్రదేశ్‌లోని మీర్జాపుర్ జిల్లా మదిహాన్ తహసీల్ పరిధిలో ఉంది. ఆ పాఠశాలలో జరిగిన ఉదంతాల గురించి తెలిస్తే మీరు షాకవుతారు. ఆ విషయాలన్నీ సాక్షాత్తూ విద్యార్థినులే దర్యాప్తు అధికారుల ఎదుట చెప్పారు. వారి కథనం ప్రకారం "మా పాఠశాలలోని కొందరు బాలికలు గర్భవతులు కూడా అయ్యారు. వారికి గర్భధారణ కిట్లను పంపిణీ చేశారు. కొందరు పాఠశాల సిబ్బందైతే విద్యార్థినుల శానిటరీ ప్యాడ్‌లనూ తనిఖీ చేస్తుంటారు" అని విద్యార్థినులు సంచలన ఆరోపణలు చేశారు. "మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి విద్యార్థినులపై మంచి ఉద్దేశం లేదు. ఆయన బయటి నుంచి పాన్ మసాలా, గుట్కా తిని వస్తారు. సిగరెట్ తాగి అమ్మాయిలపై పొగ ఊదుతారు" అని చెప్పుకొచ్చారు.

టీచర్లు మద్యం తాగి!
"మా పాఠశాలలోని ఉపాధ్యాయినులు విద్యార్థినులతో హిట్లర్‌లా ప్రవర్తిస్తారు. మాట వినని విద్యార్థులకు తిట్లు, దెబ్బలు తప్పవు. కొందరు ఉపాధ్యాయినులైతే స్కూల్‌లోని ఎయిర్ కండీషన్డ్ స్మార్ట్ క్లాస్‌రూంలో కూర్చొని మద్యం తాగుతారు. అక్కడే నిద్రపోతారు. క్లాస్ చెప్పడానికి రండి అని అడగడానికి ఎవరైనా విద్యార్థినులు వెళితే వాళ్లను అక్కడి నుంచి తన్ని తరిమేస్తారు’’ అని విద్యార్థినులు చెప్పుకొచ్చారు.

మీర్జాపుర్ జిల్లా ప్రొబేషన్ అధికారి(పీఓ), మదిహాన్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (SDM), జమాల్‌పూర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO)లతో కూడిన దర్యాప్తు టీమ్‌కు ఈవివరాలను బాలికలు తెలియజేశారు. ఈ సమాచారంతో జిల్లా ప్రొబేషన్ అధికారి నివేదికను రూపొందించి సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈ నివేదికపై ఇప్పుడు యావత్ యూపీలో చర్చ జరుగుతోంది.

విద్యార్థినుల ఇతర ఆరోపణలు ఏమిటి?
"మాకు టూత్ బ్రష్, చెప్పులు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. 2 సంవత్సరాలుగా బ్యాగులు, టవల్స్ ఇవ్వలేదు. చాలామంది విద్యార్థినులు చిరిగిన దుస్తులు వేసుకోవాల్సి వస్తోంది. పాలు ఎప్పుడూ ఇవ్వరు. డబ్బు ఆధారంగా విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో మార్కులు వేస్తారు. సైన్స్, ఆర్ట్స్ విద్యార్థుల మధ్య వివక్ష ఉంటుంది. కనీసం ఆప్షనల్స్ సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వరు. కనీసం తల్లిదండ్రులను కలిసేందుకూ మాకు అవకాశం ఇవ్వరు" అని దర్యాప్తు కమిటీకి విద్యార్థినులు తెలిపారు.

పాఠశాలలో రెండు గ్రూపులు- అదే అసలు సమస్య : శక్తి త్రిపాఠి, జిల్లా ప్రొబేషన్ అధికారి
ఈ ఘటనపై మీర్జాపుర్ జిల్లా ప్రొబేషన్ అధికారి శక్తి త్రిపాఠి మాట్లాడుతూ, "మదిహాన్ తహసీల్‌లో ఉన్న జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ బాలికల ఆశ్రమ పాఠశాలను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు నీలం ప్రభాత్ తనిఖీ చేశారు. ఆసందర్భంగా ఆమెకు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. వాటిపై దర్యాప్తు చేయమని ఆమె జిల్లా అధికారిని ఆదేశించారు. ఈక్రమంలో ముగ్గురు సభ్యుల దర్యాప్తు టీమ్‌ను ఏర్పాటు చేశారు. నేను దానికి సారథ్యం వహిస్తున్నాను" అని ఆయన వివరించారు. "దర్యాప్తులో భాగంగా మాకు సమాచారమిచ్చిన విద్యార్థుల వివరాలను రహస్యంగా ఉంచుతాం. అసలు విషయం ఏమిటంటే ఆ పాఠశాలలో రెండు వర్గాలు ఉన్నాయి. ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణ వల్లే పాఠశాల నిర్వహణ వ్యవస్థ దిగజారిపోయింది. ఆ పాఠశాల నిర్వహణ వ్యవస్థలో సమూల మార్పులు చేయమని మదిహాన్ ఉప-జిల్లా అధికారిని మేం కోరాం" అని శక్తి త్రిపాఠి చెప్పారు.

అది జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ బాలికల ఆశ్రమ పాఠశాల. ఉత్తర్​ప్రదేశ్‌లోని మీర్జాపుర్ జిల్లా మదిహాన్ తహసీల్ పరిధిలో ఉంది. ఆ పాఠశాలలో జరిగిన ఉదంతాల గురించి తెలిస్తే మీరు షాకవుతారు. ఆ విషయాలన్నీ సాక్షాత్తూ విద్యార్థినులే దర్యాప్తు అధికారుల ఎదుట చెప్పారు. వారి కథనం ప్రకారం "మా పాఠశాలలోని కొందరు బాలికలు గర్భవతులు కూడా అయ్యారు. వారికి గర్భధారణ కిట్లను పంపిణీ చేశారు. కొందరు పాఠశాల సిబ్బందైతే విద్యార్థినుల శానిటరీ ప్యాడ్‌లనూ తనిఖీ చేస్తుంటారు" అని విద్యార్థినులు సంచలన ఆరోపణలు చేశారు. "మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి విద్యార్థినులపై మంచి ఉద్దేశం లేదు. ఆయన బయటి నుంచి పాన్ మసాలా, గుట్కా తిని వస్తారు. సిగరెట్ తాగి అమ్మాయిలపై పొగ ఊదుతారు" అని చెప్పుకొచ్చారు.

టీచర్లు మద్యం తాగి!
"మా పాఠశాలలోని ఉపాధ్యాయినులు విద్యార్థినులతో హిట్లర్‌లా ప్రవర్తిస్తారు. మాట వినని విద్యార్థులకు తిట్లు, దెబ్బలు తప్పవు. కొందరు ఉపాధ్యాయినులైతే స్కూల్‌లోని ఎయిర్ కండీషన్డ్ స్మార్ట్ క్లాస్‌రూంలో కూర్చొని మద్యం తాగుతారు. అక్కడే నిద్రపోతారు. క్లాస్ చెప్పడానికి రండి అని అడగడానికి ఎవరైనా విద్యార్థినులు వెళితే వాళ్లను అక్కడి నుంచి తన్ని తరిమేస్తారు’’ అని విద్యార్థినులు చెప్పుకొచ్చారు.

మీర్జాపుర్ జిల్లా ప్రొబేషన్ అధికారి(పీఓ), మదిహాన్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (SDM), జమాల్‌పూర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO)లతో కూడిన దర్యాప్తు టీమ్‌కు ఈవివరాలను బాలికలు తెలియజేశారు. ఈ సమాచారంతో జిల్లా ప్రొబేషన్ అధికారి నివేదికను రూపొందించి సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈ నివేదికపై ఇప్పుడు యావత్ యూపీలో చర్చ జరుగుతోంది.

విద్యార్థినుల ఇతర ఆరోపణలు ఏమిటి?
"మాకు టూత్ బ్రష్, చెప్పులు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. 2 సంవత్సరాలుగా బ్యాగులు, టవల్స్ ఇవ్వలేదు. చాలామంది విద్యార్థినులు చిరిగిన దుస్తులు వేసుకోవాల్సి వస్తోంది. పాలు ఎప్పుడూ ఇవ్వరు. డబ్బు ఆధారంగా విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో మార్కులు వేస్తారు. సైన్స్, ఆర్ట్స్ విద్యార్థుల మధ్య వివక్ష ఉంటుంది. కనీసం ఆప్షనల్స్ సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వరు. కనీసం తల్లిదండ్రులను కలిసేందుకూ మాకు అవకాశం ఇవ్వరు" అని దర్యాప్తు కమిటీకి విద్యార్థినులు తెలిపారు.

పాఠశాలలో రెండు గ్రూపులు- అదే అసలు సమస్య : శక్తి త్రిపాఠి, జిల్లా ప్రొబేషన్ అధికారి
ఈ ఘటనపై మీర్జాపుర్ జిల్లా ప్రొబేషన్ అధికారి శక్తి త్రిపాఠి మాట్లాడుతూ, "మదిహాన్ తహసీల్‌లో ఉన్న జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ బాలికల ఆశ్రమ పాఠశాలను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు నీలం ప్రభాత్ తనిఖీ చేశారు. ఆసందర్భంగా ఆమెకు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. వాటిపై దర్యాప్తు చేయమని ఆమె జిల్లా అధికారిని ఆదేశించారు. ఈక్రమంలో ముగ్గురు సభ్యుల దర్యాప్తు టీమ్‌ను ఏర్పాటు చేశారు. నేను దానికి సారథ్యం వహిస్తున్నాను" అని ఆయన వివరించారు. "దర్యాప్తులో భాగంగా మాకు సమాచారమిచ్చిన విద్యార్థుల వివరాలను రహస్యంగా ఉంచుతాం. అసలు విషయం ఏమిటంటే ఆ పాఠశాలలో రెండు వర్గాలు ఉన్నాయి. ఆ రెండు వర్గాల మధ్య ఘర్షణ వల్లే పాఠశాల నిర్వహణ వ్యవస్థ దిగజారిపోయింది. ఆ పాఠశాల నిర్వహణ వ్యవస్థలో సమూల మార్పులు చేయమని మదిహాన్ ఉప-జిల్లా అధికారిని మేం కోరాం" అని శక్తి త్రిపాఠి చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.