ETV Bharat / bharat

ఆస్పత్రి బయట డెడ్​బాడీ- గోళ్లతో గీక్కుతిన్న కుక్క! సోషల్ మీడియాలో వీడియో వైరల్! - DEAD BODY OUTSIDE HOSPITAL

పోస్ట్​మార్టం అయ్యాక ఆస్పత్రి బయట మృతదేహాం- గోళ్లతో గోకుతున్న కుక్క- సోషల్ మీడియాలో వీడియో వైరల్

Dead Body Outside Hospital
Dead Body Outside Hospital (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 17, 2025 at 6:38 PM IST

Updated : April 17, 2025 at 7:12 PM IST

1 Min Read

Dead Body Outside Hospital : ఆస్పత్రి బయట మృతదేహం- గోళ్లతో గీక్కుతిన్న- దూరంగా మాట్లాడుకుంటున్న పోలీసులు- ఆస్పత్రి సిబ్బంది లేకుండా నిర్మానుష్యం- ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో పోలీసులు రంగంలో దిగి విచారణ ప్రారంభించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయూ జిల్లాలో జరిగిందీ ఘటన.

అసలేం జరిగిందంటే?
స్థానికుల వివరాల ప్రకారం, నాలుగు రోజుల క్రితం కాచ్లా గంగా ఘాట్​ వద్ద ఓ మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం మార్చురీకి తరలించారు. అది ఎవరి మృతదేహమనేది గుర్తించలేకపోయారు. ఆ తర్వాత శవపరీక్షలు చేయించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీ సిబ్బంది పోలీసులకు అప్పగించారట. ఆ మృతదేహం చాలా రోజుల నాటిది కాబట్టి దుర్వాసన వచ్చిందట.

ముఖ్యంగా ఫ్రీజర్స్ పనిచేయకపోవడం వల్ల దుర్వాసన వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో వదిలి దూరంగా నిలబడి మాట్లాడటం ప్రారంభించారు. ఏం చేయాలో అన్న విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక కుక్క అక్కడికి వచ్చి మృతదేహాన్నిపై కాళ్ల గోళ్లతో తాకి తినేందుకు ప్రయత్నించింది. అక్కడ ఆస్పత్రి సిబ్బంది లేకపోవడం వల్ల కుక్క దాని పని అది చేసింది. ఆ వీడియోనే వైరల్​గా మారగా, ఎస్ఎస్​ఎపీ డా. బ్రిజేష్ కుమార్ సింగ్​కు చేరింది. ఆయన కేసు దర్యాప్తును CO ఉజానీ శక్తి సింగ్‌కు అప్పగించారు. దర్యాప్తు తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆరోగ్య శాఖ తీవ్ర నిర్లక్ష్యం కనబడుతుందని అంతా అంటున్నారు.

Dead Body Outside Hospital : ఆస్పత్రి బయట మృతదేహం- గోళ్లతో గీక్కుతిన్న- దూరంగా మాట్లాడుకుంటున్న పోలీసులు- ఆస్పత్రి సిబ్బంది లేకుండా నిర్మానుష్యం- ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో పోలీసులు రంగంలో దిగి విచారణ ప్రారంభించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయూ జిల్లాలో జరిగిందీ ఘటన.

అసలేం జరిగిందంటే?
స్థానికుల వివరాల ప్రకారం, నాలుగు రోజుల క్రితం కాచ్లా గంగా ఘాట్​ వద్ద ఓ మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం మార్చురీకి తరలించారు. అది ఎవరి మృతదేహమనేది గుర్తించలేకపోయారు. ఆ తర్వాత శవపరీక్షలు చేయించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీ సిబ్బంది పోలీసులకు అప్పగించారట. ఆ మృతదేహం చాలా రోజుల నాటిది కాబట్టి దుర్వాసన వచ్చిందట.

ముఖ్యంగా ఫ్రీజర్స్ పనిచేయకపోవడం వల్ల దుర్వాసన వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో వదిలి దూరంగా నిలబడి మాట్లాడటం ప్రారంభించారు. ఏం చేయాలో అన్న విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక కుక్క అక్కడికి వచ్చి మృతదేహాన్నిపై కాళ్ల గోళ్లతో తాకి తినేందుకు ప్రయత్నించింది. అక్కడ ఆస్పత్రి సిబ్బంది లేకపోవడం వల్ల కుక్క దాని పని అది చేసింది. ఆ వీడియోనే వైరల్​గా మారగా, ఎస్ఎస్​ఎపీ డా. బ్రిజేష్ కుమార్ సింగ్​కు చేరింది. ఆయన కేసు దర్యాప్తును CO ఉజానీ శక్తి సింగ్‌కు అప్పగించారు. దర్యాప్తు తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆరోగ్య శాఖ తీవ్ర నిర్లక్ష్యం కనబడుతుందని అంతా అంటున్నారు.

Last Updated : April 17, 2025 at 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.