ETV Bharat / bharat

ఆన్​లైన్ గేమ్స్​ ఆడి రూ.24 లక్షలు పోగొట్టిన చిన్నారి! కూడబెట్టిన సొమ్మంతా ఒక్క 'క్లిక్​'తో హుష్​​కాకి! - COUPLE LOSES RS 24 LAKH CYBER CRIME

ఆన్​లైన్​ గేమ్​ డౌన్​లోడ్​ చేసి రూ.24 లక్షలు పోగొట్టిన చిన్నారి! ఒక్క 'క్లిక్​'తో కష్టపడి సంపాదించిన సొమ్మంతా హుష్​​కాకి!

Couple loses Rs 24 Lakh Due To Cyber Crime Tamilnadu
Couple loses Rs 24 Lakh Due To Cyber Crime Tamilnadu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : March 13, 2025 at 3:55 PM IST

2 Min Read

Couple loses Rs 24 Lakh Due To Cyber Crime Tamilnadu : పిల్లలకు ఆడుకోవడానికి మొబైల్​ ఫోన్లు ఇస్తే అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు మీకు భారీ ఆర్థిక నష్టం కూడా తెచ్చిపెట్టొచ్చు! ఇలాంటి ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో జరిగింది. ఓ పిల్లాడు పొరపాటున చేసిన పనివల్ల రూ.24 లక్షలు కోల్పోయారు వారి తల్లిదండ్రులు. చిన్నారి సెల్​ఫోన్​లో ఆన్​లైన్​ గేమ్స్​ ఆడటం వల్ల క్రమంగా డబ్బులు పోగొట్టుకున్నారు.

ఇదీ జరిగింది
జిల్లాలోని తేవరం ప్రాంతానికి చెందిన శివనేసన్(42) స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆతడి భార్య నగలు తాకట్టు వ్యాపారం చేస్తోంది. ఇద్దరు తాము సంపాదించిన డబ్బును బ్యాంకులో దాచుకున్నారు. ప్రతి మూడు నెలలకొకసారి బ్యాంకుకు వెళ్లి తమ డబ్బు భద్రంగా ఉందో లేదో చెక్​ చేసుకునేవారు. అలాగే ఇటీవల తమ ఖాతాలను తనిఖీ చేయడానికి బ్యాంకుకు వెళ్లాడు శివనేసన్. తన సెల్​ఫోన్‌ నంబర్​కు లింక్ చేసిన మూడు బ్యాంకు ఖాతాల నుంచి తనకు తెలియకుండానే రూ.24.69 లక్షలు (రూ.24,69,600) విత్‌డ్రా అయినట్లు శివనేసన్ కనుగొన్నాడు. ఈ విషయపై బ్యాంకు మేనేజర్​ను సంప్రదించాడు. తన బ్యాంకు ఖాతా నుంచి వేర్వేరు అకౌంట్లకు విడతల వారిగా డబ్బులు ట్రాన్స్​ఫర్ అయినట్లు తెలుసుకున్నాడు. అనంతరం సైబర్​ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

శివనేసన్​ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా దంపతుల మొబైల్ చెక్​ చేయగా, వారి పిల్లాడు ఫోన్​లో తరచూ వీడియో గేమ్​లు ఆడేవాడని తెలిసింది. అతడు అనుకోకుండా డౌన్​లోడ్​ చేసిన యాప్​ ద్వారా సైబర్ మోసగాళ్లు బ్యాంకు ఖాతా వివరాలను పొందినట్లు తేలింది.

దంపతుల అకౌంట్​ నుంచి మొత్తం 9 వేర్వేరు అకౌంట్లకు డబ్బులు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఓ ఖాతా పట్నా(బిహార్​)కు చెందిన అర్జున్ కుమార్​(22) పేరు మీద ఉన్నట్లు తెలిసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రైమ్ ఇన్​స్పెక్టర్ వెంకటాచలం నేతృత్వంలోని ప్రత్యేక బృందం అర్జున్ బెంగళూరులో ఉన్నట్లు గుర్తించింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Couple loses Rs 24 Lakh Due To Cyber Crime Tamilnadu
నిందితుడు అర్జున్ కుమార్ (ETV Bharat)

విచారణలో ఈ డబ్బు దొంగతనానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని అర్జున్ కుమార్ చెప్పాడు. కొందరు దుండగులు తన బ్యాంక్​ అకౌంట్​ వివరాలు, మొబైల్​ నంబర్ ఇస్తే డబ్బులు ఇస్తానన్నారని, అందుకే వారికి తన వివరాలు ఇచ్చినట్లు తెలిపాడు. తన స్నేహితులు చాలా మంది ఇలా మోసగాళ్లకు వివరాలు ఇచ్చినట్లు చెప్పాడు. విచారణ తర్వాత అర్జున్ కుమార్​ను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్​ కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించారు.

Couple loses Rs 24 Lakh Due To Cyber Crime Tamilnadu : పిల్లలకు ఆడుకోవడానికి మొబైల్​ ఫోన్లు ఇస్తే అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు మీకు భారీ ఆర్థిక నష్టం కూడా తెచ్చిపెట్టొచ్చు! ఇలాంటి ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో జరిగింది. ఓ పిల్లాడు పొరపాటున చేసిన పనివల్ల రూ.24 లక్షలు కోల్పోయారు వారి తల్లిదండ్రులు. చిన్నారి సెల్​ఫోన్​లో ఆన్​లైన్​ గేమ్స్​ ఆడటం వల్ల క్రమంగా డబ్బులు పోగొట్టుకున్నారు.

ఇదీ జరిగింది
జిల్లాలోని తేవరం ప్రాంతానికి చెందిన శివనేసన్(42) స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆతడి భార్య నగలు తాకట్టు వ్యాపారం చేస్తోంది. ఇద్దరు తాము సంపాదించిన డబ్బును బ్యాంకులో దాచుకున్నారు. ప్రతి మూడు నెలలకొకసారి బ్యాంకుకు వెళ్లి తమ డబ్బు భద్రంగా ఉందో లేదో చెక్​ చేసుకునేవారు. అలాగే ఇటీవల తమ ఖాతాలను తనిఖీ చేయడానికి బ్యాంకుకు వెళ్లాడు శివనేసన్. తన సెల్​ఫోన్‌ నంబర్​కు లింక్ చేసిన మూడు బ్యాంకు ఖాతాల నుంచి తనకు తెలియకుండానే రూ.24.69 లక్షలు (రూ.24,69,600) విత్‌డ్రా అయినట్లు శివనేసన్ కనుగొన్నాడు. ఈ విషయపై బ్యాంకు మేనేజర్​ను సంప్రదించాడు. తన బ్యాంకు ఖాతా నుంచి వేర్వేరు అకౌంట్లకు విడతల వారిగా డబ్బులు ట్రాన్స్​ఫర్ అయినట్లు తెలుసుకున్నాడు. అనంతరం సైబర్​ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

శివనేసన్​ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా దంపతుల మొబైల్ చెక్​ చేయగా, వారి పిల్లాడు ఫోన్​లో తరచూ వీడియో గేమ్​లు ఆడేవాడని తెలిసింది. అతడు అనుకోకుండా డౌన్​లోడ్​ చేసిన యాప్​ ద్వారా సైబర్ మోసగాళ్లు బ్యాంకు ఖాతా వివరాలను పొందినట్లు తేలింది.

దంపతుల అకౌంట్​ నుంచి మొత్తం 9 వేర్వేరు అకౌంట్లకు డబ్బులు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఓ ఖాతా పట్నా(బిహార్​)కు చెందిన అర్జున్ కుమార్​(22) పేరు మీద ఉన్నట్లు తెలిసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రైమ్ ఇన్​స్పెక్టర్ వెంకటాచలం నేతృత్వంలోని ప్రత్యేక బృందం అర్జున్ బెంగళూరులో ఉన్నట్లు గుర్తించింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Couple loses Rs 24 Lakh Due To Cyber Crime Tamilnadu
నిందితుడు అర్జున్ కుమార్ (ETV Bharat)

విచారణలో ఈ డబ్బు దొంగతనానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని అర్జున్ కుమార్ చెప్పాడు. కొందరు దుండగులు తన బ్యాంక్​ అకౌంట్​ వివరాలు, మొబైల్​ నంబర్ ఇస్తే డబ్బులు ఇస్తానన్నారని, అందుకే వారికి తన వివరాలు ఇచ్చినట్లు తెలిపాడు. తన స్నేహితులు చాలా మంది ఇలా మోసగాళ్లకు వివరాలు ఇచ్చినట్లు చెప్పాడు. విచారణ తర్వాత అర్జున్ కుమార్​ను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్​ కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.