ETV Bharat / bharat

భద్రతా సంస్థల అధిపతులతో కేంద్ర హోంశాఖ హై-లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ - CENTRE HIGH LEVEL SECURITY MEETING

కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి సెక్యూరిటీ మీటింగ్ - పాల్గొన్న భద్రతా సంస్థల అధిపతులు

Centre High Level Security Meeting
Centre High Level Security Meeting (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 29, 2025 at 8:47 PM IST

2 Min Read

Centre High Level Security Meeting : పహల్గాం ఉగ్రదాడితో భారత్​, పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఉన్నతస్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మూడు పారామిలిటరీ దళాల అధిపతులతో పాటు మరో రెండు భద్రతా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ఏ అంశంపై చర్చించారనే దానిపై స్పష్టత లేదు.

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్​- బీఎస్​ఎఫ్​ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ బ్రిఘు శ్రీనివాసన్, అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్- లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా ఈ సమావేశానికి హాజరైనట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. సశస్త్ర సీమా బల్-ఎస్​ఎస్​బీ అదనపు డైరెక్టర్ జనరల్ అనుపమ నీలేకర్ చంద్ర కూడా ఈ మీటింగ్​లో పాల్గొన్న వారిలో ఉన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో భారతదేశ అంతర్జాతీయ సరిహద్దులను బీఎస్​ఎఫ్​ కాపలా కాస్తుంది. నేపాల్, బంగ్లాదేశ్‌తో సరిహద్దులను ఎస్​ఎస్​బీ పహారా కాస్తుంది. అసోం రైఫిల్స్ మయన్మార్‌తో సరిహద్దును రక్షిస్తుంది. ఎన్ఎస్​జీ అనేది ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు చేసే ప్రత్యేక కమాండో దళం.

అందుకేనా?
ఇదిలా ఉండగా, తాజాగా పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ అసీఫ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి భారత్‌ సైన్యం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదే విషయాన్ని పాక్ ప్రభుత్వానికి ఆర్మీ నివేదించినట్టు మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. భారత్ దాడి చేసే అవకాశం ఉన్నందున సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ, కీలకమైన భద్రతా సంస్థలతో భేటీ అవడం గమనార్హం.

ఏప్రిల్ 22 జమ్ముకశ్మీర్​లోని ప్రముఖ పర్యటక ప్రదేశం పహల్గాంలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ పాశవిక దాడిలో 26మంది టూరిస్టులు చనిపోయారు. దీంతో భద్రతా వ్యవహారాల కమిటీ-సీసీఎస్ పాకిస్థాన్​పై తీవ్ర స్థాయిలో స్పందించింది. పాక్​పై పలు ఆంక్షలు వేసింది. 1960లో ఏర్పాటైన సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షిణమే నిలిపివేలాని నిర్ణయించింది. అంతేకాకుండా, దీర్ఘకాలిక వీసా, దౌత్య, అధికారిక వీసా ఉన్నవారు మినహా పాకిస్థానీయులందరూఏప్రిల్ 29 నాటికి భారత్​ విడిచి వెళ్లాలని కేబినెట్ కమిటీ నిర్ణయించింది. దౌత్యపరమైన చర్యలతో పాటు మిలిటిరీ పరంగా కూడా పాకిస్థాన్​కు బుద్ధి చెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జమ్ముకశ్మీర్​లో 48పర్యటక ప్రాంతాల మూసివేత- ఉగ్రదాడులు జరగొచ్చని వార్నింగ్​

పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే- ప్రపంచం కళ్లు మూసుకుని కూర్చోదు: యూఎన్​లో భారత ప్రతినిధి

Centre High Level Security Meeting : పహల్గాం ఉగ్రదాడితో భారత్​, పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఉన్నతస్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మూడు పారామిలిటరీ దళాల అధిపతులతో పాటు మరో రెండు భద్రతా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ఏ అంశంపై చర్చించారనే దానిపై స్పష్టత లేదు.

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్​- బీఎస్​ఎఫ్​ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ బ్రిఘు శ్రీనివాసన్, అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్- లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా ఈ సమావేశానికి హాజరైనట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. సశస్త్ర సీమా బల్-ఎస్​ఎస్​బీ అదనపు డైరెక్టర్ జనరల్ అనుపమ నీలేకర్ చంద్ర కూడా ఈ మీటింగ్​లో పాల్గొన్న వారిలో ఉన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో భారతదేశ అంతర్జాతీయ సరిహద్దులను బీఎస్​ఎఫ్​ కాపలా కాస్తుంది. నేపాల్, బంగ్లాదేశ్‌తో సరిహద్దులను ఎస్​ఎస్​బీ పహారా కాస్తుంది. అసోం రైఫిల్స్ మయన్మార్‌తో సరిహద్దును రక్షిస్తుంది. ఎన్ఎస్​జీ అనేది ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు చేసే ప్రత్యేక కమాండో దళం.

అందుకేనా?
ఇదిలా ఉండగా, తాజాగా పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ అసీఫ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి భారత్‌ సైన్యం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదే విషయాన్ని పాక్ ప్రభుత్వానికి ఆర్మీ నివేదించినట్టు మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. భారత్ దాడి చేసే అవకాశం ఉన్నందున సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ, కీలకమైన భద్రతా సంస్థలతో భేటీ అవడం గమనార్హం.

ఏప్రిల్ 22 జమ్ముకశ్మీర్​లోని ప్రముఖ పర్యటక ప్రదేశం పహల్గాంలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ పాశవిక దాడిలో 26మంది టూరిస్టులు చనిపోయారు. దీంతో భద్రతా వ్యవహారాల కమిటీ-సీసీఎస్ పాకిస్థాన్​పై తీవ్ర స్థాయిలో స్పందించింది. పాక్​పై పలు ఆంక్షలు వేసింది. 1960లో ఏర్పాటైన సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షిణమే నిలిపివేలాని నిర్ణయించింది. అంతేకాకుండా, దీర్ఘకాలిక వీసా, దౌత్య, అధికారిక వీసా ఉన్నవారు మినహా పాకిస్థానీయులందరూఏప్రిల్ 29 నాటికి భారత్​ విడిచి వెళ్లాలని కేబినెట్ కమిటీ నిర్ణయించింది. దౌత్యపరమైన చర్యలతో పాటు మిలిటిరీ పరంగా కూడా పాకిస్థాన్​కు బుద్ధి చెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జమ్ముకశ్మీర్​లో 48పర్యటక ప్రాంతాల మూసివేత- ఉగ్రదాడులు జరగొచ్చని వార్నింగ్​

పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే- ప్రపంచం కళ్లు మూసుకుని కూర్చోదు: యూఎన్​లో భారత ప్రతినిధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.