Jammu Kashmir Terrorist Attack : జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని భారత్ సీరియస్గా తీసుకుంది. పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ పౌరులు వెంటనే భారత్ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. పాకిస్థాన్ పర్యటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆ దేశ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
అటు పాక్ హైకమిషనర్ను సైతం దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ చెక్పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్లు చెప్పిన కేంద్రం ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. కేబినెట్ కమిటీలో చర్చించిన అంశాలకు సంబంధించి భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ వివరాలు వెల్లడించారు.
#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, " recognising the seriousness of this terrorist attack, the cabinet committee on security (ccs) decided upon the following measures- the indus waters treaty of 1960 will be held in abeyance with immediate effect until pakistan… pic.twitter.com/PxEPrrK1G8
— ANI (@ANI) April 23, 2025