ETV Bharat / bharat

జనాభా లెక్కింపులో కులగణన- కేంద్రం కీలక నిర్ణయం - CENTER ON CASTE CENSUS IN INDIA

వచ్చే జన గణనలో కుల గణన అంశాన్ని చేర్చాలని కేంద్ర కేబినేట్‌ నిర్ణయం

Center on Caste Census in India
Center on Caste Census in India (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 30, 2025 at 4:55 PM IST

Updated : April 30, 2025 at 5:34 PM IST

2 Min Read

Center on Caste Census in India : దేశంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జన గణనలో కుల గణన అంశాన్ని చేర్చాలని కేంద్ర కేబినేట్‌ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. కులగణన విషయంలో కాంగ్రెస్‌ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనను ఆ పార్టీ రాజకీయంగా వాడుకున్నట్లు విమర్శలు చేశారు.

"కులగణను కాంగ్రెస్​ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. 2010లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కులగణనను కేబినెట్ పరిశీలిస్తుందని చెప్పారు. దీనిపై కేబినెట్​ సబ్ కమిటీని సైతం నియమించారు. చాలా రాజకీయ పార్టీలు ఇందుకు మద్దుతు తెలిపాయి. కాంగ్రెస్​ పార్టీ, ఇండి కూటమి కులగణను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఈ సర్వేలు బాగా చేశాయి. కానీ, మరికొన్ని రాష్ట్రాలు అటువంటి సర్వేలను పారదర్శకత లేకుండా కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చేపట్టాయి. ఈ సర్వే వల్ల సమాజంలో చాలా అనుమానాలు రేకెత్తాయి."

--అశ్వినీ వైష్ణవ్​, కేంద్ర మంత్రి

కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అయితే, ఏప్రిల్‌ 2020లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది.

దేశంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. మేఘాలయ, అసోం జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వైష్ణవ్ వెల్లడించారు. 22 వేల 846 కోట్ల రూపాయలతో షిల్లాంగ్‌ నుంచి సిల్చార్‌ వరకు హైస్పీడ్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. క్వింటా చెరకుకు అదనంగా 15 రూపాయలను చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్వింటా చెరకుకు 355 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించిందని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం- జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ

భారత్​లో ఐస్​క్రీములు అమ్ముతున్న పాకిస్థాన్ మాజీ ఎంపీ- ఎందుకో తెలుసా?

Center on Caste Census in India : దేశంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జన గణనలో కుల గణన అంశాన్ని చేర్చాలని కేంద్ర కేబినేట్‌ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. కులగణన విషయంలో కాంగ్రెస్‌ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనను ఆ పార్టీ రాజకీయంగా వాడుకున్నట్లు విమర్శలు చేశారు.

"కులగణను కాంగ్రెస్​ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. 2010లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కులగణనను కేబినెట్ పరిశీలిస్తుందని చెప్పారు. దీనిపై కేబినెట్​ సబ్ కమిటీని సైతం నియమించారు. చాలా రాజకీయ పార్టీలు ఇందుకు మద్దుతు తెలిపాయి. కాంగ్రెస్​ పార్టీ, ఇండి కూటమి కులగణను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఈ సర్వేలు బాగా చేశాయి. కానీ, మరికొన్ని రాష్ట్రాలు అటువంటి సర్వేలను పారదర్శకత లేకుండా కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చేపట్టాయి. ఈ సర్వే వల్ల సమాజంలో చాలా అనుమానాలు రేకెత్తాయి."

--అశ్వినీ వైష్ణవ్​, కేంద్ర మంత్రి

కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అయితే, ఏప్రిల్‌ 2020లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది.

దేశంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. మేఘాలయ, అసోం జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వైష్ణవ్ వెల్లడించారు. 22 వేల 846 కోట్ల రూపాయలతో షిల్లాంగ్‌ నుంచి సిల్చార్‌ వరకు హైస్పీడ్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. క్వింటా చెరకుకు అదనంగా 15 రూపాయలను చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్వింటా చెరకుకు 355 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించిందని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం- జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ

భారత్​లో ఐస్​క్రీములు అమ్ముతున్న పాకిస్థాన్ మాజీ ఎంపీ- ఎందుకో తెలుసా?

Last Updated : April 30, 2025 at 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.