BJP On Nishikant Dubey Comments : వక్ఫ్ సవరణ చట్టం, బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా సద్దుమణగకముందే బీజేపీ నేత, లోక్సభ సభ్యుడు నిశికాంత్ దుబె సర్వోన్నత న్యాయస్థానంపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ పరిమాణలపై బీజేపీ స్పందించింది. అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నాయకులను, ఇతరు సభ్యులను ఆదేశించినట్లు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.
'న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దుబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎటువంటి సంబధం లేదు. ఇవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలు. కానీ జేపీపీ వాటితో ఏకీభవించదు. అలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు. బీజేపీ వాటిని పూర్తి తిరిస్కరిస్తుంది. ప్రజాస్వామ్యంలో విడదీయరాని భాగమైన న్యాయవ్యవస్థ పట్ల అధికార పార్టీకి గౌరవం ఉంది. మా పార్టీ రాజ్యాంగ రక్షణకు బలమైన స్తంభం' అని జేపీ నడ్డా ఎక్స్లో పోస్ట్ చేశారు.
సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందేనంటూ నిశికాంత్ దుబె ఎక్స్ వేదికగా శనివారం పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని అన్నారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు.
भाजपा सांसद निशिकांत दुबे और दिनेश शर्मा का न्यायपालिका एवं देश के चीफ जस्टिस पर दिए गए बयान से भारतीय जनता पार्टी का कोई लेना–देना नहीं है। यह इनका व्यक्तिगत बयान है, लेकिन भाजपा ऐसे बयानों से न तो कोई इत्तेफाक रखती है और न ही कभी भी ऐसे बयानों का समर्थन करती है। भाजपा इन बयान…
— Jagat Prakash Nadda (@JPNadda) April 19, 2025
పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో నిశికాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గవర్నర్ పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఆ తీర్పు కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈ రెండు అంశాల్లో కోర్టు తీసుకున్న నిర్ణయాలను విపక్షాలు కొనియాడాయి.
#WATCH | BJP MP Nishikant Dubey says, " how can you give direction to the appointing authority? the president appoints the chief justice of india. the parliament makes the law of this country. you will dictate that parliament?... how did you make a new law? in which law is it… https://t.co/CjTk4wBzHA pic.twitter.com/HYNa8sxBVt
— ANI (@ANI) April 19, 2025