ETV Bharat / bharat

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌- మావోయిస్టు అగ్రనేతలు మృతి - CHHATTISHGARH ENCOUNTER

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు కీలక నక్సలైట్లు మృతి

Chhattishgarh Encounter
Chhattishgarh Encounter (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 16, 2025 at 8:58 AM IST

1 Min Read

Chhattishgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు​ అగ్రనేతలు ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరిపై రూ.13లక్షల రివార్డ్ ఉంది.

కొండగావ్‌-నారాయణ్‌పుర్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం కొండగావ్​కు చెందిన రిజర్వ్ గార్డ్, పోలీసులు సంయుక్తంగా సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిగినట్లు బస్తర్​ రేంజ్ ఐజీ ​పీ సుందర్​రాజ్​ తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతులు మావోయిస్టుల కమాండర్, తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రమేగా గుర్తించినట్లు చెప్పారు. హల్దార్, రమే తలలపై రూ.8 లక్షలు,రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

ఈ ఎన్​కౌంటర్​లో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఛత్తీస్​గఢ్​లో జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్లలో 140 మంది మావోయిస్ట్​లు మరణించారు. వారిలో నారాయణపుర్, కొండగావ్​లతో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్​ డివిజన్​లోనే 123మంది ఉన్నారు.

Chhattishgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు​ అగ్రనేతలు ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరిపై రూ.13లక్షల రివార్డ్ ఉంది.

కొండగావ్‌-నారాయణ్‌పుర్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం కొండగావ్​కు చెందిన రిజర్వ్ గార్డ్, పోలీసులు సంయుక్తంగా సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిగినట్లు బస్తర్​ రేంజ్ ఐజీ ​పీ సుందర్​రాజ్​ తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతులు మావోయిస్టుల కమాండర్, తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రమేగా గుర్తించినట్లు చెప్పారు. హల్దార్, రమే తలలపై రూ.8 లక్షలు,రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

ఈ ఎన్​కౌంటర్​లో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఛత్తీస్​గఢ్​లో జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్లలో 140 మంది మావోయిస్ట్​లు మరణించారు. వారిలో నారాయణపుర్, కొండగావ్​లతో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్​ డివిజన్​లోనే 123మంది ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.