ETV Bharat / state

వావి వరసలు మరిచి.. కూతురిపై అఘాయిత్యం

author img

By

Published : Dec 5, 2019, 11:43 PM IST

ఆ మహిళకు అప్పటికే పెళ్లయి ముగ్గురు పిల్లలున్నారు. భర్త చనిపోయాడు. సదురు స్త్రీని వివాహమడటానికి ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. మహిళను పెళ్లి చేసుకుని సమాజంలో పెద్ద మనసున్న వ్యక్తిగా గుర్తించబడ్డాడు. మారు తండ్రిగా పిల్లలను ఆదరించాడు. కొన్ని రోజుల తర్వాత తనలో ఉన్న కీచకుడు బయటకొచ్చాడు. కూతురిపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడో నీచుడు. మళ్లీ అఘాయిత్యానికి ఒడిగట్టాలని ప్రయత్నించగా... ప్రతిఘటించిన అమ్మాయి తల్లికి విషయం చెప్పగా తండ్రి రూపంలో ఉన్న కిరాతకుడి అసలు రూపు బయటపడింది.

father
వావి వరసలు మరిచి

స్త్రీలపై రోజురోజుకు జరుగుతున్న లైంగిక దాడులు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. వావి వరుసలు మరిచిన కామాంధులు నైతిక విలువలకు పాతరేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ మారు తండ్రి బిడ్డపై అత్యాచారం జరిపాడు. కన్న తండ్రిలా గుండెల్లో దాచుకోవలసిన వాడే.. విషనాగులా కూతురిని కాటేశాడు.

కూతురిపై అఘాయిత్యం..

చివ్వెంల మండలం మూన్యానాయక్ తండాకు చెందిన బానోతు శ్రీను పదేళ్ల కిందట సూర్యాపేటకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. భర్త మృతి చెంది అప్పటికే ముగ్గురు పిల్లలున్న మహిళను వివాహం చేసుకున్న శ్రీనును అప్పట్లో పెద్దమనసున్న వ్యక్తిగా భావించారు. కుటుంబం అంతా కలిసి నివాసం ఉంటున్నారు. బాలిక తల్లి కూలినాలి చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. కూతురుపై కన్నేసిన మారు తండ్రి పదిరోజుల కిందట ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం జరిపాడు. ఎవరికైనా చెబితే ఇద్దరు తమ్ముళ్లు, అమ్మను చంపేస్తానని బెదిరించాడు. పొరపాటు జరిగిందని మరోమారు ఇలా చెడుగా వ్యవహరించనని బాలికకు సర్ధి చెప్పాడు.

మారోమారు వక్రబుద్ధి...

అమ్మ, తమ్ముళ్లను ఏమైనా చేస్తాడని భయపడిన బాలిక తనపై జరిగిన దారుణాన్ని మనసులో దాచుకుంది. మళ్లీ మారు తండ్రి వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఒంటరిగా ఉన్న బాలికపై మరోమారు అత్యాచారం జరిపేందుకు యత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పి విలపించింది. తల్లిని వెంట పెట్టుకుని పోలీస్​ స్టేషన్​కువచ్చి ఫిర్యాదు చేసింది. ప్రబుద్ధుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వావి వరసలు మరిచి.. కూతురిపై

ఇదీ చూడండి: బంగారం జోరుకు బ్రేకులు.. నేటి ధరలు ఇవే...

Intro:Slug : TG_NLG_21_05_DOUGHTER_PAI_RAPE_AV_TS10066

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , కం , సూర్యాపేట.
సెల్ : 9394450205.

( ) నాన్న కానీ నాన్న తమకు తోడుంటాడాని నమ్మారు. కాంటిరెప్పల మాటున దాచుకోవాల్సిన బిడ్డపైనే కన్నేశాడు. అదను చూసి కాటేశాడు. జరిగిన విషయాన్ని చెపితే అందరిని చంపేస్తానని బెదిరించాడు. తిరిగి మరోసారి అత్యాచారానికి యత్నించడంతో అమ్మకు చెప్పిన మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వాయిస్ ఓవర్ :

స్త్రీల పై రోజురోజుకు జరుగుతున్న లైంగిక దాడులు సభ్యసమాజాన్ని
తలదించుకునేలా చేస్తున్నాయి. వావి వరుసలు మరిచిన కామాంధులు నైతిక విలువలకు పాతరేస్తున్నారు. నేటి సమాజ పోకడలకు ప్రతి ఒక్కరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి దాపురించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ మారు తండ్రి పెంపుడు బిడ్డ పై అత్యాచారం జరిపాడు. కన్న తండ్రిలా గుండెల్లో దాచుకోవలసిన మారు తండ్రి విష నాగులా కూతురిని కాటేశాడు. చివ్వెంల మండలం మూన్యా నాయక్ తండాకు చెందిన బానోతు శ్రీను అనే వ్యక్తి గత పదేళ్ల కిందట సూర్యాపేటకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. భర్త మృతి చెంది అప్పటికే ముగ్గురు పిల్లలున్న మహిళను వివాహం చేసుకున్న శ్రీను ను అప్పట్లో పెద్దమనసున్న వ్యక్తిగా భావించారు. కుటుంభం అంతా కలిసి నివాసం ఉంటున్నారు.బాలిక తల్లి కూలినాలి చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. మారు కూతురు పై కన్నేసిన మారు తండ్రి గత పదిరోజుల కిందట ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం జరిపాడు. ఎవరికైనా చెపితే ఇద్దరు తమ్ముళ్లు , అమ్మను చంపేస్తానని బెదిరించాడు. పొరపాటు జరిగిందని మరోమారు ఇలా చెడుగా వ్యవహరించనని చెప్పాడు. అమ్మను తమ్ములను ఏమైనా చేస్తాడని భయపడిన బాలిక తనపై జరిగిన అత్యాచారానికి మనసులో కుమిలిపోతుడు గడిపింది. బుద్ధి మారని మారు తండ్రి వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఒంటరిగా ఉన్న బాలిక పై మరోమారు అత్యాచారం జరిపేందుకు యత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పి విలపించింది. తల్లిని వెంటపెట్టుకుని స్టేషన్ కువచ్చిన బాలిక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నింధితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు...Vis
Body:....nConclusion:Nnn

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.