ETV Bharat / state

వెంటాడుతున్న కబ్జాదారులు.. పోలీసులే న్యాయం చేయాలి!

author img

By

Published : Oct 29, 2019, 1:39 PM IST

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో మల్లారెడ్డి అనే రైతు 35 ఎకరాల భూమిలో నాటిన జామాయిల్ మొక్కలను కొందరు కబ్జాదారులు తొలగించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

ములుగు జిల్లాలో జామాయిల్​ మొక్కల పెంపకం

ములుగు జిల్లాలో జామాయిల్​ మొక్కల పెంపకం

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి 15 ఏళ్ల క్రితం 1/2 సర్వే నంబర్​ గల భూమిలో 35 ఎకరాలు, 354 సర్వే నంబర్​ గల భూమిలో 35 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఆ భూమిలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి పత్తి, ఆముదం పంట సాగు చేస్తుండేవాడు. ఈ ఏడాది జామాయిల్​ సాగువైపు మొగ్గు చూపి 70 ఎకరాల్లో 20 లక్షల వ్యయంతో మొక్కలు నాటించాడు. నాటిన నెలరోజులకే కొందరు కబ్జాదారులు 10 ఎకరాల్లోని జామాయిల్​ మొక్కలను తొలగించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోకపోవడం వల్ల చేసేదేం లేక మళ్లీ ఆ పదెకరాల్లో జామాయిల్​ మొక్కలు నాటించాడు.

ఈ నెల 26న కబ్జాదారులు మరోసారి 35 ఎకరాల్లోని జామాయిల్​ మొక్కలను తొలగించారు. మల్లారెడ్డి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న తన భూమిలో కబ్జాదారులు వేములపల్లి భిక్షపతి, బంచె రాంమోహన్​రెడ్డిలు వెంటపడి మరీ పంటను నాశనం చేస్తున్నారని వాపోయాడు.

తమ ఇష్టపూర్వకంగానే మల్లారెడ్డికి తమ భూమిని అమ్ముకున్నామని.. భూమి అమ్మిన రైతులు స్థానిక ఎమ్మార్వో ముందే చెప్పారని.. అధికారులు విచారణ జరిపి భూమి తనదేనని కబ్జాకోరులకు స్పష్టంగా తేల్చి చెప్పినా పదే పదే తనను ఇబ్బంది పెడుతున్నారని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.

పోలీసులు కబ్జాకోరులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కబ్జాకోరుల నుంచి మల్లారెడ్డికి న్యాయం జరిగే పరిస్థితి కనిపించట్లేదు. తనకు పోలీసులు అండగా నిలిచి దుండగుల నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది. భూమిలో అక్రమంగా ఎవరూ రాకుండా కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని, తనకు పోలీసులు న్యాయం చేయాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు.

Intro:tg_wgl_52_28_jamail_mokkala_dvasam_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా మల్లం పల్లి గ్రామంలో మల్లారెడ్డి అనే రైతు 35 ఎకరాల భూమిలో జామాయిల్ నాటిన మొక్కలను తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు. మల్లారెడ్డి అనే రైతు 15 ఏళ్ల క్రితం 1/2 సర్వే నెంబరు గల భూమి లో 35 ఎకరాలు, 354 సర్వే నెంబరు గల భూమి లో 35 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఈ భూమిలో పిచ్చి మొక్కలు తొలగించి పత్తి, ఆముదము పంట సాగు చేస్తుండేవాడు. ఈ ఏడాది జామాయిల్ సాగు పై మొగ్గుచూపి 70 ఎకరాల్లో 20 లక్షల ఖర్చుల వ్యయంతో మొక్కలు నటించాడు. మొక్కలు నాటిన నెలరోజులకు గుర్తుతెలియని వ్యక్తులు 10 ఎకరాల్లో జామాయిల్ మొక్కలను తొలగించారు. అయినా భూ యజమాని మల్లారెడ్డి మళ్లీ ఆ పది ఎకరాల్లో జామ మొక్కలు నాటారు. శనివారం రాత్రి 35 ఎకరాల్లో గుర్తుతెలియని వ్యక్తులు కొంతమందితో మొక్కలు తొలగించారు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తొలగించిన జామాయిల్ మొక్కలను చూసి కేసు నమోదు చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో భూ కబ్జాదారులు నా వెంట పడి నేను వేసుకున్న జామాయిల్ మొక్కలను తొలగించడం బాధగా ఉందని బాధితుడు మల్లారెడ్డి అన్నాడు. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి జామాయిల్ మొక్కలు నాటితే అర్థరాత్రి వచ్చి ఈ మొక్కలను తొలగించడం సబబు కాదని ఆయన అన్నారు. పదిహేనేళ్ళ క్రితం రైతుల వద్ద రైతులు ఇష్టపూర్వకంగా అమ్మిన భూమిని కొనుగోలు చేసి పంట సాగు చేస్తుంటే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. మా ఇష్టపూర్వకంగానే పదిహేనేళ్ల క్రితం మల్లారెడ్డి కి భూమి అమ్మని కుమ్మర పల్లె రైతులు అంటున్నారు. జామాయిల్ మొక్కలు నాటి నా కొద్ది తొలగించడం పద్ధతి కాదని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను శిక్షించాలని రైతులు అంటున్నారు.




Body:ss


Conclusion:బైట్స్ 1 : మల్లారెడ్డి భూ బాధితుడు మల్లంపల్లి గ్రామం
2 : కొమరయ్య కుమ్మరిపల్లి గ్రామం
3 : రాజయ్య కుమ్మరిపల్లి గ్రామం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.