ETV Bharat / state

విద్యాధికారి ఇంట్లో దొంగల బీభత్సం

author img

By

Published : Nov 11, 2019, 5:54 PM IST

ఇంటికి తాళం వేసి ఓ విద్యాధికారి కుటుంబంతో సహా ఊరికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు... చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో చోటుచేసుకుంది.

విద్యాధికారి ఇంట్లో దొంగల బీభత్సం

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలోని ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మండల విద్యాధికారి బిక్షపతి గత రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్​ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు నిన్న రాత్రి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.

ఉదయం తాళాలు పగులగొట్టి ఉండటం చూసిన స్థానికులు... యజమానులకు సమాచారం అందించారు. యజమానలు పోలీసులకు సమాచారం అందించగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవడం వల్ల ఎంత సొమ్ము చోరీకి గురైందని తెలియదని పోలీసులు పేర్కొన్నారు.

విద్యాధికారి ఇంట్లో దొంగల బీభత్సం

ఇదీ చూడండి: జగన్..​ కేసీఆర్​ను చూసి నేర్చుకో: పవన్​ ట్వీట్​

Intro:filename

tg_adb_16_11_kzr_chori_vo_ts10034


Body:కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణం సర్సిల్క్ కాలనీలో ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారు గుర్తుతెలియని వ్యక్తులు. మండల విద్యాధికారి అయిన బిక్షపతి గత రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు నిన్న రాత్రి తాళాలు పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. ఉదయం తాళాలు పగలగొట్టి ఉండడం చూసిన పొరుగువారు ఇంటికి యజమానులకు సమాచారం అందించారు. యజమానులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్.ఎచ్.ఓ. కిరణ్ విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం ఆధారాలు సేకరిస్తున్నారు. యజమానులు అందుబాటులో లేనందున ఎంత సొత్తు చోరీకి గురైందని తెలియరాలేదని, వారు వచ్చాక పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్.ఎచ్.ఓ. కిరణ్ తెలిపారు.


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.