ETV Bharat / state

కరోనాను ఎదుర్కోవడమే మహాత్మునికి ఇచ్చే నిజమైన నివాళి: కిషన్​ రెడ్డి

author img

By

Published : Oct 2, 2020, 1:23 PM IST

జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి నివాళి అర్పించారు. చిలకలగూడ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. గాంధీ కోరిన గ్రామ స్వరాజ్యం కోసం ప్రధాని మోదీ ఎన్నో పథకాలు తెచ్చారన్నారు.

కరోనాను ఎదుర్కోవడమే మహాత్మునికి ఇచ్చే నిజమైన నివాళి: కిషన్​ రెడ్డి
కరోనాను ఎదుర్కోవడమే మహాత్మునికి ఇచ్చే నిజమైన నివాళి: కిషన్​ రెడ్డి

గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి నివాళి అర్పించారు. సికింద్రాబాద్​లోని చిలకలగూడ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీతాఫల్‌మండి పాఠశాల విద్యార్థులకు పోషకాహార కిట్లు అందజేశారు.

కరోనాను ఎదుర్కోవడమే మహాత్మునికి ఇచ్చే నిజమైన నివాళి: కిషన్​ రెడ్డి

గాంధీజీ స్ఫూర్తితో మోదీ.. దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. గాంధీజీ కోరిన గ్రామస్వరాజ్యం కోసం మోదీ ఎన్నో పథకాలు తెచ్చారని పేర్కొన్నారు. మోదీ పాలనలో ఆత్మనిర్భర్‌ భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోందన్నారు. కరోనా కష్టకాలంలోనూ దేశాన్ని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కరోనాను ఎదుర్కోవడమే మహాత్మునికి ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి అన్నారు.

ఇదీ చూడండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.