ETV Bharat / state

రేపే పుర పోలింగ్.. నేటి సాయంత్రానికల్లా ఏర్పాట్లు ​పూర్తి

author img

By

Published : Jan 21, 2020, 5:02 AM IST

Updated : Jan 21, 2020, 7:20 AM IST

పురపాలక ఎన్నికల పోలింగ్​ సమయం దగ్గర పడుతోంది. తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థల్లో రేపటి పోలింగ్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 7,626 పోలింగ్ కేంద్రాల్లో 50 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని డబీర్ పురా డివిజన్​కు కూడా రేపే ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది.

రేపే పుర పోలింగ్.. నేటి సాయంత్రానికల్లా ఏర్పాట్లు ​పూర్తి
రేపే పుర పోలింగ్.. నేటి సాయంత్రానికల్లా ఏర్పాట్లు ​పూర్తి

రేపే పుర పోలింగ్.. నేటి సాయంత్రానికల్లా ఏర్పాట్లు ​పూర్తి

రాష్ట్రంలో మొదటి పురపాలక ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది. తొమ్మిది నగరపాలకసంస్థలు, 120 పురపాలక సంస్థల్లో రేపు పోలింగ్ జరగనుంది. కార్పొరేషన్లలో 325 డివిజన్లకు గానూ ఒక వార్డు ఇప్పటికే ఏకగ్రీవమైంది. మున్సిపాలిటీల్లో 2,727 వార్డులకు 80 ఏకగ్రీవమయ్యాయి. ఓటింగ్​ కోసం నగరపాలక సంస్థల్లో 1,438, పురపాలక సంస్థల్లో 6,188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్​తో కలిపితే రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 53,55,942. ఇందులో పురుషులు 26,81,591 కాగా... మహిళలు 26,73,994. ఇతరులు 357 మంది ఉన్నారు.

45 వేల మంది సిబ్బంది

కరీంనగర్ కార్పొరేషన్లో పోలింగ్ ఈ నెల 24న జరగనుంది. అక్కడ రెండు లక్షల 72వేలకు పైగా ఓటర్లున్నారు. బుధవారం జరగనున్న పోలింగ్​లో 50 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ విధుల కోసం దాదాపు 45 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఓటింగ్ దృష్ట్యా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే స్థానికంగా సెలవు ప్రకటించారు. కర్మాగారాలు, కంపెనీల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక ప్రాంతాల్లో నివసిస్తూ ఇతర చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా మూడు గంటల పాటు సమయం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆయా సంస్థలు, కంపెనీల యాజమాన్యాలను ఆదేశించింది. పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేస్తోంది.

వెబ్​కాస్టింగ్​ ద్వారా పర్యవేక్షణ

నేటి సాయంత్రానికల్లా సిబ్బంది, ఎన్నికల సామగ్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,355 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్​ను పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి అనుసంధానించి పోలింగ్ తీరుతెన్నులను పరిశీలిస్తారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫి చేస్తారు. ఓటర్ల గుర్తింపు కోసం మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కొంపల్లి పురపాలికలోని పది పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు.

పోటీలో 12,898 మంది అభ్యర్థులు

రేపు ఓటింగ్​ జరగనున్న 3,052 వార్డుల్లో 12,898 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే తెరాస తరఫున 2,972 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున 2,616 మంది, భాజపా నుంచి 2,313 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తెలుగుదేశం అభ్యర్థులు 347 మంది, మజ్లిస్ అభ్యర్థులు 276 మంది పోటీలో ఉన్నారు. సీపీఐ నుంచి 177, సీపీఎం నుంచి 166 మంది పురపోరులో నిలిచారు. ఇతర పార్టీల వారు 282 మంది ఎన్నికల్లో పోటీ చేస్తుండగా... 3,749 మంది స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డబీర్ పురా డివిజన్ ఉపఎన్నికకు కూడా రేపే పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఇవీ చూడండి: రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు

File : TG_Hyd_08_21_Muncipolls_Pkg_3053262 From : Raghu Vardhan ( ) పురపాలక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. మరో 24 గంటల్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థల్లో రేపటి పోలింగ్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 7626 పోలింగ్ కేంద్రాల్లో 50లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని డబీర్ పురా డివిజన్ కు కూడా రేపే ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది...లుక్ వాయిస్ ఓవర్ - తెలంగాణ రాష్ట్రంలో మొదటి పురపాలక ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది. తొమ్మిది నగరపాలకసంస్థలు, 120 పురపాలక సంస్థల్లో రేపు పోలింగ్ జరగనుంది. కార్పోరేషన్లలో 325 డివిజన్లకు గాను ఒక వార్డు ఇప్పటికే ఏకగ్రీవమైంది. మున్సిపాల్టీల్లో 2727 వార్డులకు గాను 80 ఏకగ్రీవమయ్యాయి. రేపటి పోలింగ్ కోసం నగరపాలక సంస్థల్లో 1438, పురపాలక సంస్థల్లో 6188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ కార్పోరేషన్ తో కలిపితే రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 53 లక్షలా 55వేలా 942. ఇందులో పురుషులు 26లక్షలా 81వేలా 591 కాగా... మహిళలు 26 లక్షలా 73వేలా 994. ఇతరులు 357 మంది ఉన్నారు. కరీంనగర్ కార్పోరేషన్లో పోలింగ్ ఈ నెల 24వ తేదీన జరగనుంది. అక్కడ రెండు లక్షలా 72వేలకు పైగా ఓటర్లున్నారు. దీంతో రేపు జరగనున్న పోలింగ్ లో 50లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ విధుల కోసం దాదాపు 45 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఓటింగ్ దృష్ట్యా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే స్థానికంగా సెలవు ప్రకటించారు. కర్మాగారాలు, కంపెనీల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక ప్రాంతాల్లో నివసిస్తూ ఇతర చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా మూడు గంటల పాటు సమయం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆయా సంస్థలు, కంపెనీల యాజమాన్యాలను ఆదేశించింది. పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేస్తోంది. ఈ సాయంత్రానికల్లా సిబ్బంది, ఎన్నికల సామాగ్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2355 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ను పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి అనుసంధానించి పోలింగ్ తీరుతెన్నులను పరిశీలిస్తారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ చేస్తారు. ఓటర్ల గుర్తింపు కోసం మేడ్చెల్ - మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లి పురపాలికలోని పది పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. రేపు పోలింగ్ జరగనున్న 3052 వార్డుల్లో 12వేలా 898 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే తెరాస తరపున 2972 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున 2616 మంది, భాజపా తరపున 2313 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తెలుగుదేశం అభ్యర్థులు 347 మంది, మజ్లిస్ అభ్యర్థులు 276 మంది పోటీలో ఉన్నారు. సీపీఐ నుంచి 177, సీపీఎం నుంచి 166 మంది పురపోరులో నిలిచారు. ఇతర పార్టీల వారు 282 మంది ఎన్నికల్లో పోటీ చేస్తుండగా... 3749 మంది స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని డబీర్ పురా డివిజన్ ఉపఎన్నికకు కూడా రేపే పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Last Updated : Jan 21, 2020, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.