ETV Bharat / state

విద్యార్థుల అదృశ్యం: ప్రయోజకులమై తిరిగొస్తాం...

author img

By

Published : Jan 23, 2020, 3:56 PM IST

మేడ్చల్​ జిల్లాలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చయనే మనస్తాపంతో వారు ఇంట్లో నుంచి పరారయ్యారు.

three students of same school missing update
'మార్కులు తక్కువైనా ప్రయోజకులమవుతాం.. తర్వాతే వస్తాం'

మేడ్చల్‌ జిల్లాలో నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముగ్గురు విద్యార్థుల కోసం కుషాయిగూడ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇటీవల పదో తరగతి పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చాయనే మనస్తాపంతో ఒకే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

తల్లిదండ్రులు తమను కష్టపడి చదివిస్తున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందిన ముగ్గురు విద్యార్థులు... ప్రయోజకులుగా తిరిగి రావాలని నిర్ణయించుకుని ఎవరకి చెప్పకుండా పరారయ్యారు. తమ గురించి ఎవరూ బెంగ పెట్టుకోవద్దని.. ముగ్గురు తమ ఇళ్లల్లో లేఖలు రాశారు.

విద్యార్థులు చరణ్‌, సామ్యూల్‌, హేమంత్‌ సాయికృష్ణ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ముగ్గురు మీర్‌పేట్‌ హెచ్​బీ కాలనీ నుంచి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు గుర్తించారు.

'ప్రయోజకులమవుతాం.. తిరిగొస్తాం'

ఇదీ చూడండి : 'డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కాడు..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.