ETV Bharat / state

రెండురోజుల్లో ఎన్ని"కోట్లు" తాగేశారో తెలుసా?

author img

By

Published : Jan 1, 2020, 5:37 PM IST

Updated : Jan 1, 2020, 7:57 PM IST

మద్యం ప్రియులు తమ ప్రేమను చాలా ఘాటుగా చూపించారు. రెండ్రోజుల్లోనే 380 కోట్ల విలువైన మద్యం తాగి కిక్కెక్కించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం ప్రియులు మద్యాన్ని మంచినీళ్లలా తాగారు.

రెండ్రోజుల్లో 380 కోట్ల మద్యం విక్రయం
రెండురోజుల్లో ఎన్ని"కోట్లు" తాగేశారో తెలుసా?

రెండురోజుల్లో ఎన్ని"కోట్లు" తాగేశారో తెలుసా?
రాష్ట్రంలో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల సంద‌ర్భంగా మ‌ద్యం ప్రియులు మ‌ద్యంలో మునిగి తేలారు. డిసెంబ‌రు 30, 31 తేదీల్లో రూ.380 కోట్లు విలువైన మ‌ద్యాన్ని మంచినీళ్ల ప్రాయంలా మందుబాబులు తాగేశారు. సాధార‌ణంగా రోజుకు రూ.60 నుంచి 70 కోట్లు మ‌ద్యం విక్ర‌యాలు జ‌రుగుతాయి. అయితే 30, 31 తేదీలల్లో ఏకంగా దాదాపు రూ.380 కోట్ల విలువైన మ‌ద్యం విక్రయం జరిగింది.

ఈ రెండు రోజుల్లో ఏకంగా రూ. 380 కోట్లు విలువైన 4.85 లక్షల కేసుల లిక్కర్, 5.10 కేసుల బీరు మద్యం అమ్మ‌కాలు జ‌రిగాయ‌ని ఆబ్కారీ శాఖ లెక్క‌లు వెల్ల‌డించాయి. ఇందులో హైదారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ ఈ మూడు జిల్లాల్లో సింహ‌భాగం మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ్గా.. మిగిలిన మద్యం తదితర జిల్లాల్లో విక్ర‌యాలు జ‌రిగిన‌ట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

డిసెంబ‌రు నెల‌లో రూ. 2050 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 30.80 ల‌క్ష‌ల లిక్క‌ర్, 35 ల‌క్ష‌ల కేసులు బీరు అమ్మ‌కాలు జ‌రిగాయ‌న్నారు. స‌గ‌టున రోజుకు రూ. 66 కోట్లు మ‌ద్యాన్ని రాష్ట్రంలోని మ‌ద్యం ప్రియులు తాగేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో రూ.270 కోట్లు, రంగారెడ్డి జిల్లా ప‌రిధిలో రూ.540 కోట్లు, మేడ్చ‌ల్ జిల్లాలో దాదాపు 250 కోట్లు లెక్క‌న మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 3148 డ్రంక్​ అండ్ డ్రైవ్​ కేసులు

TG_HYD_34_01_NEWYEAR_LIQUOR_SALES_AV_3038066 Reporter: M.Tirupal Reddy NOTE: రాత్రి మ‌ద్యం దుకాణాల వ‌ద్ద ర‌ద్దీ పేరుతో...ఐట‌మ్ వ‌చ్చింది. ఆ విజువ‌ల్‌స్‌తోపాటు ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం విజువ‌ల్స్‌ ఇక్క‌డ వాడుకోగ‌ల‌రు. ()తెలంగాణ రాష్ట్రంలో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల సంద‌ర్భంగా మ‌ద్యం ప్రియులు మ‌ద్యంలో మునిగి తేలారు. డిసెంబ‌రు 30, 31 తేదీల్లో రూ.380 కోట్లు విలువైన మ‌ద్యాన్ని మంచినీళ్ల ప్రాయంలా మందుబాబులు తాగేశారు. సాధార‌ణ రోజుల్లో రోజుకు రూ.60 నుంచి 70 కోట్లు మ‌ద్యం విక్ర‌యాలు జ‌రుగుతాయి..కాని 30, 31 తేదీలల్లో ఏకంగా దాదాపు రూ.200 కోట్లు విలువైన మ‌ద్యం తాగేశారు మ‌ద్యం ప్ర‌యులు. ఈ రెండు రోజుల‌ల్లో ఏకంగా రూ. 380 కోట్లు విలువైన 4.85 లక్షల కేసులు లిక్కర్, 5.10 కేసుల బీరు మద్యం అమ్మ‌కాలు జ‌రిగాయ‌ని అబ్కారీ శాఖ లెక్క‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఇందులో హైదారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ ఈ మూడు జిల్లాల్లో సింహ‌భాగం మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ్గా.... మిగిలిన మ‌ద్యం జిల్లాల్లో విక్ర‌యాలు జ‌రిగిన‌ట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డిసెంబ‌రు నెల‌లో జ‌రిగిన మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప‌రిశీలించిన‌ట్ల‌యితే 31 రోజుల్లో రూ. 2050 కోట్లు విలువైన 30.80 ల‌క్ష‌ల లిక్క‌ర్, 35ల‌క్ష‌ల కేసులు బీరు అమ్మ‌కాలు జ‌రిగాయ‌ని అధికారులు తెలిపారు. స‌గ‌టున రోజుకు రూ.66 కోట్లు మ‌ద్యాన్ని రాష్ట్రంలోని మ‌ద్యం ప్రియులు తాగేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో రూ.270 కోట్లు, రంగారెడ్డి జిల్లా ప‌రిధిలో రూ.540 కోట్లు, మేడ్చ‌ల్ జిల్లాలో దాదాపు 250 కోట్లు లెక్క‌న మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Jan 1, 2020, 7:57 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.