ETV Bharat / state

'న్యాయస్థానాలను ధిక్కరిస్తే మూల్యం తప్పదు'

author img

By

Published : Oct 31, 2019, 11:44 PM IST

Updated : Oct 31, 2019, 11:57 PM IST

న్యాయస్థానాలను ధిక్కరిస్తే చరిత్రలో ఏం జరిగిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుంచుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో జరిగిన మహాసభలో ఆయన పాల్గొన్నారు.

జస్టిస్​ చంద్రకుమార్​

కేసీఆర్​ చరిత్రను గుర్తుంచుకోవాలి: జస్టిస్​ చంద్రకుమార్​

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్​తో హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. న్యాయస్థానాలను ధిక్కరిస్తే చరిత్రలో ఏం జరిగిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుంచుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఎవరిమాట వినకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆర్టీసి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రిలో చలనం లేకపోవడం దారుణమని కృష్ణయ్య మండిపడ్డారు.

ఇవీ చూడండి: ఆమెను చంపితేనే "సుఖం"..!

Last Updated : Oct 31, 2019, 11:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.