ETV Bharat / state

మేయర్లు, నగరపాలికల పరిధి ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష

author img

By

Published : Sep 24, 2020, 2:54 PM IST

Updated : Sep 24, 2020, 3:54 PM IST

cm-kcr-review-with-mayors-municipalities-range-mlas
మేయర్లు, నగరపాలికల పరిధి ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష

14:34 September 24

మేయర్లు, నగరపాలికల పరిధి ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష

     గ్రేటర్ హైదరాబాద్ సహా నగరపాలికల పరిధిలోని రెవెన్యూ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. మంత్రులు, మొత్తం 13 కార్పొరేషన్ల మేయర్లు, వాటి పరిధిలోని శాసనసభ్యులతో ప్రగతిభవన్​లో సీఎం సమావేశమయ్యారు.  

    కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా ధరణి పోర్టల్​ను పూర్తి పారదర్శకంగా తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఆన్​లైన్​లో నమోదు చేయాలని నిర్ణయించారు. నోటరీ, 58, 59 జీఓల పరిధిలోని ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని, నిరుపేదల ఇళ్లను మ్యుటేషన్ చేయాలని నిర్ణయించారు.  

వీటన్నింటిపై కార్పొరేషన్ల పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ఆయా నగరాల్లో ఉన్న సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఉన్న డిమాండ్లు సహా అన్ని అంశాలను తెలుసుకోనున్నారు. వాటన్నింటి ఆధారంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇదీ చూడండి : 'సున్నితమైన మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడకండి'

Last Updated :Sep 24, 2020, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.