ETV Bharat / sports

IPL 2021: 'ప్రతి మ్యాచ్​ మాకు ఫైనల్ లాంటిదే'

author img

By

Published : Sep 18, 2021, 9:27 AM IST

ఐపీఎల్​ మిగిలిన ప్రతి మ్యాచ్​ను ఫైనల్​లానే ఆడుతామని రషీద్ ఖాన్ అంటున్నాడు. సన్​రైజర్సర్​ హైదరాబాద్​ తరఫున ఆడుతున్న ఇతడు.. ఆదివారం నుంచి యూఏఈ వేదికగా మొదలయ్యే రెండోదశ టోర్నీకి సిద్ధమవుతున్నాడు.

Rashid Khan
రషీద్ ఖాన్

"రెండోదశ సీజన్​లో బాగా ఆడేందుకు కృషి చేస్తాం. భారత్​లో జరిగిన ఫస్టాఫ్​లో అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయాం. ఈ సీజన్​ను మెరుగ్గా ముగించడంపై దృష్టిపెట్టాం. ప్రతి మ్యాచ్​ను ఫైనల్​లా భావించి పోరాడుతాం. గత ఏడాదిన్నర నుంచి బ్యాటింగ్​ మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నా. దీనికోసం ఎలాంటి షాట్స్ ప్రాక్టీస్ చేయడం లేదు. కానీ శక్తిమేర రాణించాలని అనుకుంటున్నా" అని రషీద్ చెప్పాడు.

తొలి దశలో ఏడు మ్యాచ్​లాడి ఒక్కటే దానిలో గెలిచిన సన్​రైజర్స్.. ఇప్పుడు ఆడాల్సిన ఏడు మ్యాచ్​ల్లోనూ కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి. లేదంటే క్వాలిఫయర్స్​కు అర్హత సాధించడం అసాధ్యం. బహుశా అందువల్లనే రషీద్ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Rashid Khan
రషీద్ ఖాన్

ఏప్రిల్-మేలో మన దేశంలో ఐపీఎల్​ జరుగుతున్న క్రమంలో ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో టోర్నీని వాయిదా వేశారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా అత్యంత భద్రతతో మ్యాచ్​లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.