ETV Bharat / city

విశ్రాంత అధికారులూ.. మీ సేవలు కావాలి

author img

By

Published : Dec 19, 2019, 6:57 AM IST

రాష్ట్ర పాలనలో విశ్రాంత అధికారులు కీలకంగా మారారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఈఎన్సీలు, ఇతర శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేసివారూ ఈ జాబితాలో ఉన్నారు. పదవీకాలం పూర్తైనప్పటికీ ప్రభుత్వం కీలక బాధ్యతల్లో నియమించి సేవలు వినియోగించుకుటోంది.

విశ్రాంత అధికారులూ.. మీ సేవలు కావాలి
విశ్రాంత అధికారులూ.. మీ సేవలు కావాలి

విశ్రాంత అధికారులూ.. మీ సేవలు కావాలి

రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఇంజినీరింగ్ అధికారుల సేవలు వినియోగించుకుంటోంది. ఇటీవల పదవీ విరమణ చేసిన అనిల్‌ కుమార్‌ను దేవాదాయశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా నియమిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. సుధీర్ఘకాలం వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌గా చేసిన ఆయన... కొంతకాలం దేవాదాయశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా మరో విశ్రాంత ఐఏఎస్‌ సత్యనారాయణ రెడ్డిని నియమించింది. ఈయన ఉమ్మడి నల్గొండ కలెక్టర్‌గా, కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగా పనిచేశారు.

ఆర్థికశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన మరో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌... సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలను చూస్తున్నారు. ఐఏఎస్‌లు రాజీవ్‌ శర్మ, రమణాచారి, ఐపీఎస్‌లు అనురాగ్‌ శర్మ, ఏకేఖాన్‌, ఈఎన్‌సీ జీఆర్‌ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. రాజీవ్‌ శర్మ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మెన్‌గా, సీజీజీ ఎక్జిక్యూటివ్‌ ఛైర్మెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నర్సింగ్ రావు, ఐఎఫ్ఎస్ అధికారి భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు.

ముఖ్యమంత్రి భద్రతాధికారి ఎంకేసింగ్ సహా నిఘా విభాగంలో, మరికొందరు ఐపీఎస్‌లు సుధీర్ఘకాలంగా విధుల్లో ఉన్నారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా కొనసాగింపులోనే ఉన్నారు. ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, వెంకటేశ్వర్లు, గణపతిరెడ్డి, రవీందర్ రావు, సత్యనారాయణరెడ్డి, కృపాకర్ రెడ్డి, ధన్‌సింగ్, సురేష్ కుమార్ పదవీకాలం పూర్తైనవారే. వీరితో పాటు రెండు జిల్లాల్లో సంయుక్త కలెక్టర్లు, కొంతమంది ఓఎస్డీలు విధుల్లో కొనసాగుతున్నారు.

ఇదీ చూడండి: తూటా ఏ తుపాకిది? ఎవరు కాల్చారు? ఎవరికి తాకింది?

File : TG_Hyd_03_19_Retd_officers_Pkg_3053262 From : Raghu Vardhan ( ) రాష్ట్ర పాలనలో విశ్రాంత అధికారులు కీలకంగా మారారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఈఎన్సీలు, ఇతరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. పదవీకాలం పూర్తైనప్పటికీ కీలకమైన విధులు నిర్వర్తిస్తున్నారు. కొందరు అదే పదవుల్లో కొనసాగుతుండగా... మరికొందరు ఇతర బాధ్యతల్లో ఉన్నారు...లుక్ వాయిస్ ఓవర్ - రాష్ట్ర ప్రభుత్వం మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇటీవలే పదవీవిరమణ చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ కు మళ్లీ కీలక బాధ్యతలు కట్టబెట్టింది. దేవాదాయ శాఖ కార్యదర్శిగా, కమిషనర్ గా ఆయనను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సుధీర్ఘకాలం వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ గా పనిచేసిన అనిల్ కుమార్... కొంతకాలం దేవాదాయ శాఖ కమిషనర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయణ్ను రెండేళ్ల పాటు దేవాదయ శాఖ కార్యదర్శి, కమిషనర్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల కింద ఇదే తరహాలో మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి సత్యనారాయణరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా నియమించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగా పనిచేసిన ఆయన... కొన్ని నెలల క్రితం పదవీవిరమణ చేశారు. ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లిన సమయంలో అప్పటికే పదవీవిరమణ చేసిన సత్యనారాయణరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా నియమించారు. ఆర్థికశాఖ కార్యదర్శిగా బాధ్యలు నిర్వర్తించిన మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్ కూడా పదవీకాలం పూర్తైనప్పటికీ కొనసాగుతున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి విధులు నిర్వర్తిస్తోన్న ఆయన... ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సంబంధిత అంశాలను చూస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారులు రాజీవ్ శర్మ, రమణాచారి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. రాజీవ్ శర్మ ప్రభుత్వ ముఖ్యసలహాదారుతో పాటు కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా, సీజీజీ ఎక్జిక్యూటివ్ ఛైర్మన్ గా బాధ్యతల్లో ఉన్నారు. మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజేంద్ర నిమ్జే కూడా సీజీజీలో పనిచేస్తున్నారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి అనురాగ్ శర్మ, ఏకేఖాన్, విశ్రాంత ఐఈఎస్ అధికారి జీఆర్ రెడ్డిలు కూడా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి నర్సింగ్ రావు, విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు. విశ్రాంత ఐపీఎస్ లు కూడా కొందరు విధుల్లో కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి భద్రతాధికారి ఎంకేసింగ్ సహా నిఘా విభాగంలో మరికొందరు విధుల్లో సుధీర్ఘ కాలంగా ఉన్నారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా కొనసాగింపులోనే ఉన్నారు. ఇక ఇంజనీరింగ్ విభాగాల్లోనూ చాలా మంది పదవీకాలం పూర్తైన వారే కొనసాగుతున్నారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మురళీధర్, వెంకటేశ్వర్లు, గణపతిరెడ్డి, రవీందర్ రావు, సత్యనారాయణరెడ్డి, కృపాకర్ రెడ్డి, ధన్ సింగ్, సురేష్ కుమార్ తదితరులు కొనసాగింపులోనే ఉన్నారు. వీరితో పాటు రెండు జిల్లాల్లో సంయుక్త కలెక్టర్లు కూడా పదవీకాలం పూర్తైనా ఇంకా కొనసాగుతున్నారు. వీరితో పాటు ఇంకా కొందరు విశ్రాంత అధికారులు ఓఎస్టీలు, ఇతర విధుల్లో ఉన్నారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.