ETV Bharat / bharat

దిల్లీలో మే 31 వరకు లాక్​డౌన్ పొడిగింపు

author img

By

Published : May 23, 2021, 12:28 PM IST

Updated : May 23, 2021, 12:40 PM IST

దిల్లీలో ఈనెల 31 వరకు లాక్​డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. మే 31 తర్వాత కేసులు తగ్గితే దశల వారీగా అన్​లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.

Delhi CM Arvind Kejriwal
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​

దిల్లీలో లాక్​డౌన్​ను మే 31 ఉదయం 5 గంటల వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మే 31 తర్వాత కేసులు తగ్గితే.. దశల వారీగా అన్​లాక్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.

"అందరికీ వ్యాక్సిన్​ అందితే.. కరోనా మూడో దశ వ్యాప్తి తగ్గుతుంది. వీలైనంత త్వరగా అందరికీ టీకా అందించేందుకు కృషి చేస్తున్నాం. టీకాల కోసం దేశీయ, విదేశీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం."

-- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

దిల్లీలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 2.5 శాతంగా ఉందని తెలిపారు కేజ్రీవాల్‌. కొత్తగా 1600 మందికి వైరస్​ నిర్ధరణ అయిందని వెల్లడించారు.

ఇదీ చదవండి : యాస్​ తుపాను సన్నద్ధతపై అధికారులతో మోదీ భేటీ

Last Updated : May 23, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.