2002 గోద్రా అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై.. ఏప్రిల్ 14న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
క్లీన్చిట్ను సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఇషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ పదేపదే వాయిదా పడుతోందని గుర్తు చేసిన ఉన్నత న్యాయస్థానం.. ఏది ఏమైనా తాము ఇక తప్పక విచారణ జరుపుతామని తెలిపింది.
అందుబాటులో ఉన్న తేదీని సూచించాలని ఆమె తరఫు న్యాయవాదికి స్పష్టం చేయగా.. హోలీ సెలవుల తర్వాత విచారించాలని తెలిపారు. తద్వారా న్యాయస్థానం విచారణకు ఏప్రిల్ 14ను ఖరారు చేసింది. గోద్రా అల్లర్లలో ఇషాన్ జఫ్రీ హత్యకు గురయ్యారు.