ETV Bharat / city

రెచ్చిపోయిన యువకులు.. హెడ్​కానిస్టేబుల్​పై దాడి

author img

By

Published : Nov 22, 2019, 10:44 AM IST

హెడ్ కానిస్టేబుల్​పై ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది.

హెడ్​కానిస్టేబుల్​పై ముగ్గురు యువకుల వీరంగం

హెడ్​ కానిస్టేబుల్​పై ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నగర పరిధిలో స్పెషల్​ బ్రాంచ్​- ఎస్​బీ హెడ్​ కానిస్టేబుల్​గా కోరుకొండ, సీతానగరం ప్రాంతాల్లో పని చేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆనంద్​నగర్​లో నాగేశ్వరరావు ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో వెనకనుంచి ముగ్గురు యువకులు బైక్​పై వచ్చి ఢీ కొట్టారు. కింద పడిపోయిన కానిస్టేబుల్​ లేచి ఆ యువకులను ఫోటోలు తీశారు. దీంతో రెచ్చిపోయిన యువకులు హెడ్​ కానిస్టేబుల్​పై విచక్షణారహితంగా దాడి చేశారు. కింద పడేసి పిడిగుద్దులు కురిపించారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు ఆపేందుకు ప్రయత్నించినా... ఆగకుండా రెచ్చిపోయి నాగేశ్వరావుపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన హెడ్​ కానిస్టేబుల్​ను ఆసుపత్రికి తరలించారు. ఓ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేశారు. మిగతా ఇద్దరిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు సెంట్రల్​ జోన్​ డీఎస్పీ సంతోష్​ తెలిపారు.

హెడ్​కానిస్టేబుల్​పై ముగ్గురు యువకుల వీరంగం

ఇదీ చదవండి :

స్టేషన్​లో వీరంగం: మహిళా పోలీసుల చేతిని కొరికి.. మెడపై రక్కి...

Intro:Body:

ap_rjy_03_22_head_constable_pi_dadi_av_3056437_2211digital_1574395789_492


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.