జగన్ పర్యటనలో ఉద్రిక్తత - భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు - YCP ACTIVISTS STOPPED AKHILA PRIYA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 2:15 PM IST

thumbnail

Tension During Chief Minister Jagan's Visit to Nandyal District : నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన​ మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురువారం ఎర్రగుంట్ల చేరింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రైతులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.  

నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల వద్ద జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. అసలైన రైతు సమస్యలు చాలా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎర్రగుంట్లకు చేరుకున్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఆమెను అడ్డుకున్నారు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్​కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారని భూమా అఖిల ప్రియ తెలిపారు. ఈ మేరకు శిరివెళ్ల పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.